Iraq: పెళ్లి వేడుకలో విషాదం.. అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా మృతి
ఇరాక్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వివాహ వేడుకలో ఈ ఘటన జరిగింది. 100 మందికి పైగా మృతి చెందినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి.
మొసూల్: ఇరాక్ (Iraq)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పెళ్లి వేడుకలో పేల్చిన బాణసంచా కారణంగా ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకొని 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్లోని నినెవేహ్ ప్రావిన్స్లో మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం..
హమ్దానియా ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిన్న రాత్రి పెళ్లి వేడుక జరుగుతుండగా ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అవి హాల్ అంతా వ్యాపించాయి. దీంతో ఈ వేడుకలో పాల్గొన్న అతిథులు, కుటుంబసభ్యులు అందులో చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
నెల్సన్ మండేలా మనవరాలు కన్నుమూత
ఈ దుర్ఘటనలో 114 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నినెవేహ్ ప్రావిన్స్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 150 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
టపాసుల పేల్చడంతో..
ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రాలేదు. అయితే, పెళ్లి వేడుకలో పేల్చిన బాణసంచా కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. వేడుక జరుగుతున్న సమయంలో కొందరు టపాసులను పేల్చారు. ఈ క్రమంలోనే షాండ్లియర్కు మంటలు అంటుకున్న క్షణాల్లో వ్యాపించినట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఘటన సమయంలో వధూవరులు స్టేజీపై డ్యాన్స్ చేస్తున్నారు. ప్రమాదంలో వారు కూడా గాయపడినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
China: ప్రాణం తీసిన గేమింగ్.. ఐదు రోజులు నిద్ర లేకుండా లైవ్ స్ట్రీమింగ్లో ఆడి
తగినంత నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతుంటారు. అయినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. నిద్రాహారాలు మాని లైవ్ స్ట్రీమింగ్లో గేమ్ ఆడిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. -
North Korea: కిమ్ శాటిలైట్.. శ్వేతసౌధం, పెంటాగన్ ఫొటోలు తీసిందట..!
తాము పంపిన నిఘా ఉపగ్రహం అమెరికాలోని కీలక భవనాలు, స్థావరాల ఫొటోలు తీసిందని ఉత్తర కొరియా(North Korea) వెల్లడించింది. అయితే ఈ దేశం చేసిన ప్రకటనపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
Musk: అప్పటి వరకు ప్రతిరోజూ ఈ ట్యాగ్ ధరిస్తా: ఎలాన్ మస్క్
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్(Musk) ప్రస్తుతం ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
USA: ‘ప్రార్థనా స్థలాల్లో రాజకీయాలొద్దు’.. ఖలిస్థానీల దుశ్చర్యపై ‘సిఖ్స్ ఆఫ్ అమెరికా’ ఖండన
అమెరికాలో గురుద్వారాకు వెళ్లిన భారత రాయబారి తరణ్జీత్ సింగ్ సంధూను ఖలిస్థాన్ మద్దతుదారులు అడ్డుకోవడాన్ని ‘సిఖ్స్ ఆఫ్ అమెరికా’ తీవ్రంగా ఖండించింది. -
Britain-Greek: పురాతన శిల్పాల వివాదం.. ప్రధానుల భేటీ రద్దు
పురాతన శిల్పాలను తిరిగిచ్చే విషయంలో తలెత్తిన వివాదం కారణంగా.. గ్రీస్ ప్రధానితో సమావేశాన్ని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ రద్దు చేసుకున్నారు. -
అమెరికా అభ్యర్థనకు ఓకే.. కెనడాకు మాత్రం నో: కీలక కేసుల దర్యాప్తుపై భారత దౌత్యవేత్త వ్యాఖ్యలు
India-US-Canada: ఖలిస్థానీ ఉగ్రవాదులు నిజ్జర్, పన్నూలకు సంబంధించిన కేసుల్లో అమెరికా, కెనడా కోరిన దర్యాప్తులకు భారత్ వేర్వేరుగా స్పందించింది. ఇందుకు స్పష్టమైన కారణం ఉందని కెనడాలోని భారత హైకమిషనర్ వెల్లడించారు. అదేంటంటే..? -
గాజాలో దాడులను ముగించాలి
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధ పరిస్థితులపై స్పెయిన్లోని బార్సెలోనాలో సోమవారం ఐరోపా సమాజం (ఈయూ), అరబ్, ఉత్తర ఆఫ్రికా దేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. 42 దేశాలకు చెందిన ప్రతినిధులు భేటీకి వచ్చారు. -
బుకర్ ప్రైజ్ విజేత పాల్ లించ్
ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ను 2023 సంవత్సరానికి గాను ఐర్లాండ్ రచయిత పాల్ లించ్ గెలుచుకున్నారు. ఆయన రాసిన ‘ప్రాఫెట్ సాంగ్’ నవలకు ఈ అవార్డు లభించింది. -
నకిలీ ప్రపంచంలో ‘నిజం’ కోసం ఆరాటం
సాంకేతిక సాయంతో తన ఫొటోలను అసభ్యంగా మార్చి ప్రచారంలో పెట్టారని ఇటీవల ఒక నటి ఆక్రోశించడంతో ‘డీప్ఫేక్’ అనే పదం బాగా వెలుగులోకి వచ్చింది. ఇది భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. -
America - Work Permits: అమెరికాలో పని అనుమతులపై రగడ
మెక్సికో, వెనెజువెలా, కొలంబియా వంటి లాటిన్ దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చేవారి సంఖ్య నానాటికీ పెరుగుతూ కొత్త సమస్యలు కొనితెస్తోంది. అమెరికాలో పంటకోతలు, పండ్లు, కూరగాయలు తెంపడం, హోటళ్లు, దుకాణాల్లో, భవన నిర్మాణంలో పనిచేయడం వంటివాటితో వలసదారులు జీవనాధారం పొందుతున్నారు. -
నల్ల సముద్రంలో తుపాను.. అంధకారంలో 20 లక్షల మంది
నల్ల సముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగా రష్యా ఆక్రమిత క్రిమియా అతలాకుతలమైంది. దక్షిణ రష్యాలోని సోచీ తీరంలోనూ పెద్దఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. అనాపా, కుబాన్ తదితర ప్రాంతాల్లో ఆస్తి నష్టం సంభవించింది. -
భారతీయ కొవిడ్ బాధితులకు ప్రయోజనం అంతంతే
కొవిడ్-19 చికిత్సకు డెక్సామెథాసోన్ మందును ఎక్కువ మోతాదులో వాడటం వల్ల ఐరోపావాసులకు కలిగేంత ప్రయోజనం భారతీయులకు కలగలేదని ప్రముఖ వైద్యపత్రిక ‘లాన్సెట్’ ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. -
ఊపిరితిత్తుల వాపుతో బాధపడుతున్న పోప్
ఊపిరితిత్తుల వాపుతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్(86).. యాంటీబయాటిక్స్ను ఉపయోగిస్తున్నారని వాటికన్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఆయనకు నిమోనియా కానీ జ్వరం కానీ లేవని స్పష్టంచేసింది. -
పాక్లో భద్రతాబలగాలు లక్ష్యంగా ఆత్మాహుతి దాడి
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్లో తెహ్రీక్-ఎ-తాలిబాన్(టీటీపీ) తీవ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. భద్రతా బలగాల్ని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడిచేశారు. -
న్యూజిలాండ్కు కొత్త ప్రధానిగా లక్సన్
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్టఫర్ లక్సన్ (53) సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం దేశార్థికాన్ని మెరుగుపరచడమే తన ప్రథమ లక్ష్యమని ప్రకటించారు. -
పోలండ్కు అల్పాయుష్షు ప్రభుత్వం!
పోలండ్లో సోమవారం ప్రమాణ స్వీకారం చేసే మితవాద లా అండ్ జస్టిస్ పార్టీ ప్రభుత్వానికి 14 రోజుల్లోనే ఆయుష్షు తీరిపోనుంది. అక్టోబరులో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 460 స్థానాల్లో ఆ పార్టీకి 194 మాత్రమే వచ్చాయి. -
మెటాపై 33 అమెరికా రాష్ట్రాల దావా
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ల మాతృ సంస్థ ‘మెటా’.. 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచాన్ని సేకరించిందని ఆరోపిస్తూ అమెరికాలోని పలు రాష్ట్రాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. -
న్యూయార్క్లో రెచ్చిపోయిన ఖలిస్థానీ మద్దతుదారులు
అమెరికాలోని ఖలిస్థాన్ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. సిక్కుల గురుపూర్ణిమ సందర్భంగా న్యూయార్క్లోని హిక్స్విల్ గురుద్వారాకు వెళ్లిన భారత రాయబారి తరణ్జీత్ సింగ్ సంధూను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. -
బ్యాక్టీరియాకు నాలుగుతరాల జ్ఞాపకాలు!
ఏకకణ జీవులైనప్పటికీ బ్యాక్టీరియాకు జ్ఞాపకశక్తి సామర్థ్యం ఉంటుందని, ఆ జ్ఞాపకాలను తమ వారసులకూ చేరవేయగలవని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. -
సొంత పాస్పోర్టు నంబర్లే ఇవ్వాలి
వీసాల కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థులకు అమెరికా రాయబార కార్యాలయం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ మార్పులు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఎఫ్, ఎం, జే వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఇవి వర్తిస్తాయి. -
కాల్పుల విరమణ మరో 2 రోజులు పొడిగింపు
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరో 2 రోజులు కొనసాగనుంది. తొలుత కుదుర్చుకున్న నాలుగు రోజుల ఒప్పందం సోమవారంతో ముగియడంతో ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో 2 రోజుల పొడిగింపునకు రెండు వర్గాలు అంగీకరించాయి.


తాజా వార్తలు (Latest News)
-
Bumrah: బుమ్రా ముంబయి ఇండియన్స్ను వీడతాడా? సోషల్ మీడియాలో అన్ఫాలో చేసిన స్టార్ పేసర్
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
China: ప్రాణం తీసిన గేమింగ్.. ఐదు రోజులు నిద్ర లేకుండా లైవ్ స్ట్రీమింగ్లో ఆడి
-
Rahul Gandhi: శీతాకాల సమావేశాల వేళ.. మళ్లీ విదేశాలకు రాహుల్..!
-
Uttarakhand Tunnel: మిగిలిన 2 మీటర్ల డిగ్గింగ్.. కూలీలను తీసుకొచ్చేందుకు మరికొన్ని గంటలు
-
Girl Kidnap: బాలిక కిడ్నాప్.. రూ.10 లక్షల డిమాండ్