Canada Army: ‘అది రాజకీయ సమస్య.. సైనిక సంబంధాలపై ప్రభావం చూపదు!’
భారత్- కెనడాల మధ్య ప్రస్తుత వివాదం.. ఇరు దేశాల సైనిక సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపదని కెనడా ఆర్మీ డిప్యూటీ చీఫ్ మేజర్ జనరల్ పీటర్ స్కాట్ అన్నారు.
దిల్లీ: ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య కేసుతో భారత్- కెనడాల మధ్య దౌత్యపర సంబంధాలు (India- Canada Relations) దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే, ఈ వివాదం ప్రస్తుతానికి ఇరుదేశాల సైనిక సంబంధాల (Military Ties)పై ఎటువంటి ప్రభావం చూపదని కెనడా ఆర్మీ డిప్యూటీ చీఫ్ మేజర్ జనరల్ పీటర్ స్కాట్ అన్నారు. భారత్ వేదికగా నిర్వహిస్తోన్న ‘ఇండో పసిఫిక్ ఆర్మీ చీఫ్స్ కాన్ఫరెన్స్ (IPACC)’లో పాల్గొన్న ఆయన ఈ మేరకు మాట్లాడారు. భారత్కు రావడం సంతోషంగా ఉందన్న ఆయన.. ప్రస్తుత వివాదాన్ని రాజకీయ స్థాయిలో పరిష్కారానికి వదిలేసినట్లు చెప్పారు.
‘ఇప్పటివరకు నాకు తెలిసినంత మేరకు ప్రస్తుత ఉద్రిక్తతలు ద్వైపాక్షిక సైనిక సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపబోవు. ఇది రెండు దేశాల మధ్య రాజకీయ స్థాయి సమస్య. మా రెండు సైన్యాల మధ్య ఇది ప్రభావం చూపడం లేదు. సోమవారం రాత్రే భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో మాట్లాడాను. ఇది రాజకీయ సమస్య అని, సైనికపరంగా ఎటువంటి సంబంధం లేదని ఇద్దరం ఒక అంగీకారానికి వచ్చాం’ అని పీటర్ స్కాట్ చెప్పారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం స్థాపనే లక్ష్యంగా అందరం ఎలా పనిచేయగలమో చర్చిస్తున్నట్లు తెలిపారు.
నిజ్జర్ హత్యకు సంబంధించి 90 సెకన్ల సీసీటీవీ పుటేజీ.. అమెరికా పత్రిక వెల్లడి
ఇదిలా ఉండగా.. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని నిర్ధరించేందుకుగానూ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు భారత సైన్యం రెండు రోజుల ‘ఇండో- పసిఫిక్ ఆర్మీ చీఫ్ల సమావేశాని’కి ఆతిథ్యం ఇస్తోంది. 30కిపైగా దేశాలు ఇందులో పాల్గొన్నాయి. అన్ని దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలంటూ భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తన ప్రారంభోపన్యాసంలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Putin: రెండు దశాబ్దాలుగా ‘ఒకేఒక్కడు’.. ఐదోసారి అధికారానికి ‘సై’!
రష్యాలో రెండు దశాబ్దాలకుపైగా అధికారంలో కొనసాగుతూ దేశంలో ఎదురులేని నేతగా నిలిచిన పుతిన్.. 2036 వరకు అధ్యక్ష పదవిలో ఉండేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. -
USA: ఇజ్రాయెల్ చెప్పిన దానికి.. ఫలితానికి చాలా తేడా ఉంది: బ్లింకెన్
యుద్ధం మొదలైన తర్వాత అమెరికా తొలిసారి ఇజ్రాయెల్ తీరును తప్పుపట్టింది. గాజాలో పౌరుల ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. అదే సమయంలో హమాస్ పూర్తిగా బలహీనపడే వరకు యుద్ధం ఆపమని తాము ఇజ్రాయెల్ను కోరబోమని పరోక్షంగా తేల్చిచెప్పింది. -
Canada visa: కెనడా కీలక నిర్ణయం.. స్టూడెంట్ వీసా డిపాజిట్ రెట్టింపు!
కెనడా స్టూడెంట్ పర్మిట్ డిపాజిట్ను ప్రస్తుతమున్న 10వేల డాలర్ల నుంచి 20వేల డాలర్లకు పెంచుతున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. -
Women Education: మహిళల విద్యపై అఫ్గాన్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
అఫ్గానిస్థాన్లో మహిళల విద్యపై తాలిబన్ విదేశాంగ డిప్యూటీ మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. -
Gaza: కళ్లకు గంతలు కట్టి.. లోదుస్తులతో తరలించి.. వివాదాస్పదంగా ఐడీఎఫ్ తీరు..
ఇజ్రాయెల్ దళాలు గాజాలో భారీ సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకొన్నాయి. వీరిని లోదుస్తులతో తరలించడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. -
Modi-Putin: మోదీపై ఒత్తిడి తేవడం అసాధ్యం: రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు
భారత్-రష్యా(India-Russia) మధ్య సంబంధాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్(putin) అన్నారు. అలాగే మోదీ విధానాలను ప్రశంసించారు. -
White House: పన్నూ హత్య కుట్రపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి : అమెరికా
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్రకేసు భారత్-అమెరికా మధ్య ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తోంది. తాజాగా శ్వేతసౌధం ఈ కుట్రపై పూర్తిస్థాయి దర్యాప్తును ఆశిస్తున్నట్లు ప్రకటించింది. -
కెనడాలో భారతీయ చిత్రాలు ఆడుతున్న థియేటర్లలో కలకలం
కెనడాలో భారతీయ చిత్రాలను ప్రదర్శిస్తున్న మూడు థియేటర్లలో ఆగంతుకులు గుర్తు తెలియని పదార్థాన్ని స్ప్రే చేయడంతో కలకలం రేగింది. -
చైనా మాజీ విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ ఆత్మహత్య!
ప్రభుత్వాన్ని ధిక్కరించిన ప్రముఖులు అదృశ్యమైన ఘటనలు చైనాలో అనేకం కనిపిస్తాయి. అదే కోవలో విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే జాడ లేకుండా పోయారు కిన్ గాంగ్. -
బీబీసీ ఛైర్మన్గా సమీర్ షా
బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఛైర్మన్ పదవికి భారత్లో జన్మించిన డాక్టర్ సమీర్ షా (71)ను ప్రభుత్వం ఎంపిక చేసింది. -
ఖాన్ యూనిస్లో హోరాహోరీ
గాజా నగరాన్ని దాదాపు నేలమట్టం చేసిన ఇజ్రాయెల్.. ఇప్పుడు హమాస్ ముఖ్య నేతల అడ్డాగా భావిస్తున్న గాజా స్ట్రిప్లోని రెండో అతి పెద్ద నగరమైన ఖాన్ యూనిస్పై విరుచుకుపడుతోంది. -
అమెరికాలో కాల్పులకు పాల్పడిన ప్రొఫెసర్
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. లాస్ వేగాస్లోని నెవాడా విశ్వవిద్యాలయంలో ఓ వ్యక్తి బుధవారం మధ్యాహ్నం విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. -
ఇక ఫేస్బుక్ మెసెంజర్లో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ తప్పనిసరి
ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్బుక్లో సందేశాలు, కాల్స్కు ఇకపై ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను తప్పనిసరి (డిఫాల్ట్) చేస్తున్నట్లు దాని మాతృసంస్థ మెటా గురువారం ప్రకటించింది. -
డేటింగ్లో భారత్, అమెరికా
భారత్-అమెరికా బంధం ప్రపంచానికి మేలు చేస్తుందని భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి వ్యాఖ్యానించారు. అలాగే రెండు దేశాల బంధాన్ని రొమాంటిక్ రిలేషన్షిప్గా అభివర్ణించారు. -
ఓస్ప్రే విమానాల సేవల నిలిపివేత
తమ సైన్యంలో ఉన్న ఓస్ప్రే వీ-22 విమానాల సేవలను వెంటనే నిలిపివేయాలని (గ్రౌండింగ్) అమెరికా నిర్ణయించింది. -
మార్చి 17న రష్యా ఎన్నికలు.. పోటీపై ఇంకా పెదవి విప్పని పుతిన్
రష్యా అధ్యక్ష ఎన్నికలను వచ్చే ఏడాది మార్చి 17న నిర్వహించాలని అక్కడి చట్టసభ సభ్యులు గురువారం నిర్ణయించారు. -
రష్యాలో కాల్పులకు పాల్పడిన విద్యార్థిని.. ఒకరి మృతి
రష్యాలో ఓ పాఠశాల విద్యార్థిని(14) దారుణానికి పాల్పడింది. తుపాకీతో తన తోటి విద్యార్థులపై కాల్పులకు పాల్పడింది. -
అందరికీ కరోనా సోకాలని నేను కోరుకోలేదు
కరోనా వైరస్ బ్రిటిష్ జనాభా అంతటికీ వ్యాపించాలని తాను కోరుకున్నాననే ఆరోపణలను మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం ఖండించారు. -
సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్ర అంశం.. భారత్పై అమెరికా సెనెటర్ల విమర్శ
న్యూయార్క్లో ఓ సిక్కు వేర్పాటువాదిని హతమార్చడానికి భారత ప్రభుత్వాధికారి ఒకరు కుట్రపన్నారనే ఆరోపణను పురస్కరించుకుని అమెరికా పాలక, ప్రతిపక్ష సెనెటర్లు భారత్పై విమర్శలు గుప్పించారు. -
నిక్కీ హేలీ అవినీతిపరురాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం ఆశిస్తున్న అభ్యర్థుల మధ్య నాలుగో విడత చర్చా కార్యక్రమం అలబామా విశ్వవిద్యాలయంలోని మూడీ మ్యూజిక్ హాలులో బుధవారం వాడీవేడీగా జరిగింది. -
టైప్ 1 మధుమేహానికి కీళ్లవాతం మందు
కీళ్ల వాతానికి వాడే బారిసిటినిబ్ మందు ఇన్సులిన్ ఆధారిత టైప్ 1 మధుమేహాన్ని నియంత్రించగలదని ఆస్ట్రేలియా శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
JK: కశ్మీర్లో స్టేడియానికి జనరల్ బిపిన్ రావత్ పేరు
-
Renu Desai: అంకుల్ మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది.. రేణూ దేశాయ్ వ్యంగ్యాస్త్రాలు
-
Chauhan: ఆ ఈగో వల్లే కాంగ్రెస్ ఓడింది.. సీఎం చౌహాన్
-
Nara Lokesh: శనివారం నుంచి లోకేశ్ పాదయాత్ర .. ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
-
Prakasam: గుండ్లకమ్మ ప్రాజెక్టులో కొట్టుకుపోయిన రెండో గేటు
-
Rashmika: ఒక నటిగా సందీప్ను ఎన్నోసార్లు ప్రశ్నించా..: రష్మిక