Ukraine Crisis: ‘మామ్.. ఈ యుద్ధం చాలా కష్టంగా ఉంది’.. రష్యన్ సైనికుడి చివరి సందేశం
‘‘మామ్..నేను ఉక్రెయిన్లో ఉన్నా. నాకు చాలా భయంగా ఉంది. ఈ యుద్ధం చాలా కష్టంగా ఉంది. మేం పౌరులను కూడా లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తోంది’’.. ఉక్రెయిన్పై యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఓ రష్యన్ సైనికుడు
ఐరాసలో చదివి వినిపించిన ఉక్రెయిన్ రాయబారి
ఇంటర్నెట్డెస్క్: ‘‘మామ్..నేను ఉక్రెయిన్లో ఉన్నా. నాకు చాలా భయంగా ఉంది. ఈ యుద్ధం చాలా కష్టంగా ఉంది. మేం పౌరులను కూడా లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తోంది’’.. ఉక్రెయిన్పై యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఓ రష్యన్ సైనికుడు తన తల్లికి పంపిన చివరి సందేశం ఇది. ఉక్రెయిన్పై దండయాత్ర సాగిస్తోన్న రష్యా కూడా భారీ మూల్యం చెల్లించుకుంటోంది అనడానికి ఇదే నిదర్శనం. యుద్ధంతో ఉక్రెయిన్ను తమ అధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోన్న రష్యా.. వేలాది మంది సొంత సైనికులనూ పోగొట్టుకుంటోంది.
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య క్రమంలో... ఐక్య రాజ్య సమితి (ఐరాస)సాధారణ సభ సోమవారం అత్యవసరంగా ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఐరాసకు ఉక్రెయిన్ రాయబారి సెర్గీ కిస్లెత్స్యా మాట్లాడుతూ.. రష్యా దురాక్రమణను ఎండగట్టారు. ఈ సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఓ రష్యన్ సైనికుడు తన తల్లికి చివరిసారిగా పంపిన సందేశాన్ని సెర్గీ చదివి వినిపించారు. ఆ సైనికుడి ఫోన్ నుంచి ఈ మెసేజ్ను సేకరించినట్లు సెర్గీ వెల్లడించారు.
సెర్గీ చెప్పిన ఆ తల్లీకొడుకుల సంభాషణ ఇలా ఉంది..
సైనికుడి తల్లి: ఎక్కడున్నావ్ నాన్నా..? నేను నీకు ఒక పార్సిల్ పంపాలి.
రష్యన్ సైనికుడు: నాకు ఉరేసుకుని చచ్చిపోవాలని ఉంది మామ్.
తల్లి: ఏం మాట్లాడుతున్నావ్..? ఏం జరిగింది?
రష్యన్ సైనికుడు: మామ్, నేను ఉక్రెయిన్లో ఉన్నా. ఇక్కడ నిజమైన యుద్ధం జరుగుతోంది. నాకు చాలా భయంగా ఉంది. మేం అన్ని నగరాలపైనా బాంబులు విసురుతున్నాం. పౌరులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాం. వారు(ఉక్రెయిన్ వాసులు) మమ్మల్ని స్వాగతిస్తారని మా అధికారులు చెప్పారు. కానీ వారు(ఉక్రెయిన్ సైనికులు) మా సాయుధ వాహనాల కింద పడుతున్నారు. చక్రాలకు అడ్డుపడి మమ్మల్ని కదలనివ్వట్లేదు. మమ్మల్ని ఫాసిస్ట్లు అంటున్నారు. ఇది చాలా కష్టంగా ఉంది మామ్.
ఇదే ఆ సైనికుడు తన తల్లికి.. చనిపోయే ముందు పంపిన చివరి సందేశమని, ఆ తర్వాత ఉక్రెయిన్ జరిపిన ప్రతిదాడిలో ఆ రష్యన్ సైనికుడు మరణించాడని సెర్గీ ఐరాస వేదికపై తెలిపారు. పుతిన్ దురాక్రమణ కారణంగా వేలాది మంది రష్యన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని, ఇప్పటికైనా ఈ దారుణాలను ఆపాలని ప్రపంచ వేదికపై సెర్గీ అభ్యర్థించారు.
రష్యా దాడులను ఉక్రెయిన్ సైన్యం దీటుగా ప్రతిఘటిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు 4500 మందికి పైగా రష్యా జవాన్లను చంపినట్లు ఉక్రెయిన్ ఇప్పటికే ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఈ విషయాన్ని చెబుతూ..‘‘రష్యన్ సైనికులు తమ ప్రాణాలను కాపాడుకోవాలంటే ఉక్రెయిన్ను వీడి వెళ్లిపోవాలి’’ అని పలుమార్లు గట్టిగానే హెచ్చరించారు.
అయితే ఉక్రెయిన్ ప్రకటనను రష్యా ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. తమవైపు ఎలాంటి ప్రాణనష్టం లేదని చెబుతోంది. అయితే రష్యన్ సైనికులను ఉక్రెయిన్ జవాన్లు బంధీగా పట్టుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో బయటకు వస్తూనే ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.