Ukraine: ఇక మేము ఆయుధాలివ్వం.. ఉక్రెయిన్కు దిమ్మతిరిగే షాకిచ్చిన పోలాండ్..!
ఉక్రెయిన్కు మిత్రపక్షాలతో విభేధాలొచ్చాయి. పొరుగు దేశమైన పోలాండ్ ఇకపై తాము ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేయబోమని తేల్చిచెప్పింది. దీనంతటికీ ధాన్యం ఎగుమతులే కారణంగా నిలిచాయి. నల్లసముద్రంలోకి పెద్దగా ఉక్రెయిన్ ధాన్యాన్ని రష్యా రానీయకపోవడం పరోక్షంగా ఈ విభేదాలకు కారణమైంది.
ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్(Ukraine)కు పొరుగు దేశం పోలాండ్ (Poland) దిమ్మతిరిగే షాకిచ్చింది. ధాన్యం వివాదం ముదిరితే.. తాము భవిష్యత్తులో ఉక్రెయిన్కు ఎటువంటి ఆయుధాలను సరఫరా చేయలేమని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని పోలాండ్ ప్రధాని మతౌజ్ మోరవియోకి సోషల్ మీడియాలో ప్రకటించారు. ఉక్రెయిన్ ఓ పక్క రష్యాపై ఎదురుదాడులను మెల్లగా పెంచుతున్న సమయంలో పోలాండ్ ప్రకటన దానికి భారీ షాక్గా మారింది.
రష్యా యుద్ధం ప్రకటించిన నాటి నుంచి చాలా దేశాలు భయపడుతున్న సమయంలో కూడా ఉక్రెయిన్కు బలమైన మద్దతుదారుగా పోలాండ్ నిలిచింది. ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేయడానికి మిగిలున్న అతి తక్కువ మార్గాల్లో పోలాండ్ ఒకటి. నాటో నుంచి ఇక్కడికి తరలించిన ఆయుధాలను రైలు, రోడ్డు మార్గాల్లో ఉక్రెయిన్కు చేరుస్తున్నారు. దీంతోపాటు పోలాండ్ కూడా సొంతంగా కొన్ని ఆయుధాలను ఉక్రెయిన్కు అందిస్తోంది.
ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్ నుంచి ధాన్యం దిగుమతులపై ఐరోపా సమాఖ్య నిషేధాన్ని విధించింది. ఎందుకంటే చౌకగా లభించే ఉక్రెయిన్ ధాన్యం స్థానిక మార్కెట్లలోకి వస్తే స్థానిక రైతుల ఉపాధి దెబ్బతింటుందనే భయాలు ఈయూ దేశాల్లో ఉన్నాయి. కానీ, గత వారం ఐరోపా సమాఖ్య ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. దీనిని పోలాండ్, హంగేరీ, స్లోవేకియా దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తాము ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ ధాన్యాన్ని తమ దేశంలోకి రానీయబోమని చెప్పాయి. మరోవైపు ఈ మూడు దేశాలపై ఉక్రెయిన్ నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. అంతేకాదు.. ఈ మూడు దేశాలపై దావాలు కూడా దాఖలయ్యాయి.
ఆజ్యం పోసిన జెలెన్స్కీ వ్యాఖ్యలు..
ధాన్యం వివాదంపై ఐరాసలో జెలెన్స్కీ బుధవారం మాట్లాడుతూ ఈ దేశాలను పరుషపదాలతో విమర్శించారు. ఓ దశలో రష్యాకు సాయం చేస్తున్నాయని ఆరోపించారు. ‘‘రాజకీయంగా సాయం చేస్తున్నట్లు కనిపించినా.. ధాన్యం నుంచి లబ్ధిపొందాలని చూస్తున్నారు. వారు సొంతంగానే తమ పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తున్నా.. మాస్కోలోని వారి కోసం అసలు వేదికను సిద్ధం చేస్తున్నారు’’ అని ఎద్దేవా చేశారు.
జెలెన్స్కీ పరుషంగా మాట్లాడటంపై పోలాండ్ తక్షణమే స్పందించింది. ఆయన వ్యాఖ్యలను ఖండించింది. అంతేకాదు.. ఉక్రెయిన్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసి నిరసన తెలిపింది. మరోవైపు పొలాండ్ ప్రధాని మతౌజ్ మోరవియోకి ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పందిస్తూ ‘‘ఉక్రెయిన్ ధాన్యం దిగుమతుల కోసం స్థానిక మార్కెట్ను అస్థిర పర్చలేను. కానీ, మా రవాణా మార్గాలను ఉపయోగించుకొని ఆ దేశం ఎగుమతులు చేసుకోవడానికి అడ్డం చెప్పం. అలాగని ఆ ఖర్చును మేము భరించబోం. అవసరమైతే వాటి ద్వారా ఆదాయం సంపాదిస్తాం. అంతేకాదు.. మేము ఉక్రెయిన్కు ఇక ఆయుధాలు ఇవ్వబోం.. మమ్మల్ని మేము అత్యాధునిక ఆయుధాలతో బలోపేతం చేసుకోవడంపై దృష్టిపెడతాము’’ అని వివరించారు. దీంతోపాటు ఉక్రెయిన్ ఒలిగార్క్లు అక్కడి ధాన్యాన్ని పోలిష్ మార్కెట్, స్థానిక రైతుల పరిస్థితులను పట్టించుకోకుండా తమ దేశంలోకి డంప్ చేస్తున్నారని ఆరోపించారు.
పారిన పుతిన్ పాచిక..
నల్లసముద్రం ధాన్యం డీల్ను రద్దు చేసుకొని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విసిరిన పాచిక పారింది. ఇది ఉక్రెయిన్ మిత్రపక్షాల మధ్య బంధం బీటలు వారేట్లు చేసింది. వాస్తవానికి పుతిన్కు ఒకప్పటి సోవియట్లోని భాగమైన తూర్పు ఐరోపా దేశాల మార్కెట్లపై మంచి అవగాహన ఉంది. దీంతో ఉక్రెయిన్ ధాన్యాన్ని నల్లసముద్రం వైపు ఎక్కువగా రానీయకపోతే.. అది భూమార్గంలో పోలాండ్ సహా ఇతర దేశాల వైపు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు ఆయా దేశాల స్థానిక రైతులు గగ్గోలు పెట్టడం మొదలైతే.. అక్కడి ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతుందన్నది పుతిన్ వ్యూహం. తాజా పరిణామాలు మాస్కోకు మరింత కలిసొచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
Biden: విదేశీయులను ఆహ్వానించడమంటే భారత్కు భయమంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. -
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?