Vande Bharat Express - LIVE : సికింద్రాబాద్లో వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం
తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు ప్రారంభమైంది. ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తొలి సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు (Vande Bharat Express) పట్టాలెక్కింది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఆదివారం ఉదయం 10:30 గంటలకు దిల్లీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గా ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి, రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Updated : 15 Jan 2023 10:21 IST
Tags :