బ్రేకింగ్

breaking
05 Dec 2022 | 13:54 IST

₹వేల కోట్లు సంపాదించారు.. మద్దతివ్వొచ్చుగా: జయరాం

కర్నూలు: తెలుగు సినీపరిశ్రమ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతివ్వాలని మంత్రి గుమ్మనూరు జయరాం డిమాండ్‌ చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ నిర్వహించిన సీమ గర్జన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘కర్నూలు, రాయలసీమ పేరు చెప్పుకొని చిత్ర పరిశ్రమలోని వారంతా వేలకోట్లు సంపాదించారు. అందులో పవన్‌ కల్యాణ్‌ కూడా ఉన్నారు. చంద్రబాబుకు పవన్‌ బైబై చెప్పి కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతివ్వాలి. ఈ సందర్భంగా అందరినీ హెచ్చరిస్తున్నా’’ అని జయరాం వ్యాఖ్యానించారు.

మరిన్ని

తాజా వార్తలు