Varun Gandhi: రాయ్బరేలీ నుంచి పోటీ.. వరుణ్ గాంధీకి భాజపా ఆఫర్?
రాయ్బరేలీ నుంచి వరుణ్ గాంధీని బరిలోకి దింపేందుకు భాజపా ప్రతిపాదించింది. అయితే పార్టీ నిర్ణయాన్ని ఆయన తిరస్కరించినట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్కు కంచుకోటగా పేరొందిన రాయ్బరేలీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెబల్ నేత వరుణ్గాంధీని నిలబెట్టేందుకు భాజపా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన్ను కాషాయ పార్టీ సంప్రదించినట్లు సమాచారం. అయితే.. పార్టీ ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రాయ్బరేలీ నుంచి ప్రియాంకగాంధీని రంగంలోకి దింపాలని కాంగ్రెస్ చూస్తోన్న సమయంలో.. భాజపా ప్రతిపాదన ఆసక్తిగా మారింది.
ఈ స్థానంపై కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. 2004 నుంచి సోనియాగాంధీ ఇక్కడినుంచే పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి ఆమె రాజ్యసభకు వెళ్లడంతో ఈ స్థానం ఖాళీగా ఉంది. సోనియా ఈసారి ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవడంతో.. ప్రియాంకగాంధీని ఇక్కడినుంచి బరిలోకి దింపేందుకు హస్తం పార్టీ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాహుల్గాంధీ సోదరుడు వరుణ్ను కాంగ్రెస్కు పోటీగా నిలబెట్టేందుకు భాజపా పావులు కదుపుతోంది. కానీ, ఆయన ఎన్నికల పోరు నుంచి వైదొలిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయంపై ఆయన అధికారంగా ప్రకటించాల్సి ఉంది.
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
వరుణ్గాంధీ పీలీభీత్ సిట్టింగ్ ఎంపీ. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయనకు మొండిచేయి చూపిన భాజపా.. ఈ స్థానంలో యూపీ మాజీ మంత్రి జితిన్ ప్రసాదకు అవకాశం కల్పించింది. వరుణ్ తల్లి మేనకాగాంధీకి సుల్తాన్పుర్ను ఖారారు చేసింది. ఇదిలాఉంటే.. కాంగ్రెస్ కంచుకోటలైన రాయ్బరేలీ, అమేఠీ అభ్యర్థులపై ఆ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈక్రమంలోనే హస్తం పార్టీకి వ్యతిరేకంగా ఈ స్థానం నుంచి పోటీ చేయకూడదనే వరుణ్ తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సొంత పార్టీపై ఆయన విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డబ్బుల్లేవ్.. పోటీ చేయను: టికెట్ వెనక్కి ఇచ్చిన కాంగ్రెస్ నాయకురాలు
Congress: కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. పార్టీ నిధులు ఇవ్వడం లేదని, తన వద్ద డబ్బుల్లేవని ఒడిశాలో ఓ అభ్యర్థి పోటీకి నిరాకరించారు. తన టికెట్ వెనక్కి ఇచ్చేశారు. -
పోలైన ఓట్ల గణాంకాలు సకాలంలో వెల్లడికి ప్రాధాన్యం
సార్వత్రిక ఎన్నికల్లో ఒకటి, రెండు దశల పోలింగ్లో నమోదైన ఓటింగ్ శాతాన్ని వెల్లడించడంలో జాప్యంతో పాటు ఆ గణాంకాల్లో వ్యత్యాసం ఉండడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న వేళ ఎన్నికల సంఘం(ఈసీ) శుక్రవారం స్పందించింది. -
రాయ్బరేలీలో రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ యూపీలోని రాయ్బరేలీ స్థానం నుంచి కూడా సార్వత్రిక ఎన్నికల బరిలో దిగారు. కేరళలోని వయనాడ్ నుంచి ఆయన పోటీ చేయగా అక్కడ పోలింగ్ కూడా ముగిసిన విషయం తెలిసిందే. -
వయనాడ్లో ఓటమి భయంతోనే.. రెండోచోట యువరాజు పోటీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ యూపీలోని రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తుండటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన కొత్త సీటు వెదుక్కొంటారని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు. -
ప్రియాంక ఎందుకు పోటీ చేయట్లేదు?
గాంధీ కుటుంబానికి కంచుకోటల్లాంటి అమేఠీ, రాయ్బరేలీ స్థానాల్లో కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీ చేస్తారన్న ఉత్కంఠకు తెరపడింది. అయితే ఈ రెండు సీట్లలో ఎక్కడా పార్టీ అగ్రనేత ప్రియాంకాగాంధీ వాద్రా బరిలో నిలవకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. -
శివసేన గూటికి తిరిగొచ్చిన మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్
కాంగ్రెస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ (59) మళ్లీ శివసేన (శిందే) గూటికి చేరారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే సమక్షంలో శుక్రవారం ఆయన శివసేన పార్టీ కండువా కప్పుకొన్నారు. -
లాలూ కుమార్తెపై లాలూ పోటీ!
ఆర్జేడీ కంచుకోట, గతంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ప్రాతినిధ్యం వహించిన సారణ్ నుంచి ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య ఈసారి పోటీలో ఉన్నారు. -
50% రిజర్వేషన్ల పరిమితిని మోదీ ఎత్తేయగలరా?
దేశంలో 50శాతంగా ఉన్న రిజర్వేషన్ల పరిమితిని ప్రధాని మోదీ ఎత్తేయగలరా అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి భాజపాతోపాటు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. -
సంక్షిప్త వార్తలు (7)
మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, భాజపా నాయకురాలు ఇమర్తీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారీపై శుక్రవారం కేసు నమోదైంది. -
రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేస్తారా?
దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లను తొలగించాలనేది ‘భాజపా-ఆరెస్సెస్’ల స్పష్టమైన దీర్ఘకాల లక్ష్యమని కాంగ్రెస్ ఆరోపించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50% పరిమితిని తొలగిస్తారా? -
రాజ్యాంగ మౌలిక సూత్రాల్నిఏ పార్టీ, నాయకుడూ మార్చలేరు: గడ్కరీ
భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలైన లౌకికతత్వం, ప్రాథమిక హక్కులు వంటి వాటిని పార్లమెంటు సహా ఏ పార్టీ, నాయకుడూ మార్చలేరని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. -
రాజ్యాంగ పీఠిక పూర్వరూపాన్ని పునరుద్ధరిస్తాం
రాజ్యాంగ పీఠికలో ‘లౌకిక’ పదాన్ని చేర్చడం ద్వారా రాజ్యాంగంపై కాంగ్రెస్ పార్టీ దాడికి పాల్పడిందని భాజపా ధ్వజమెత్తింది. తాము కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే పీఠిక పూర్వరూపాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించింది. -
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
చెస్లో అగ్రస్థానానికి పోటీ పడే ముందు రాహుల్ గాంధీ ముందు రాయ్బరేలీలో గెలవాలని చెస్ లెజెండ్ గ్యారీ కాస్పరోవ్ సలహా ఇచ్చారు. ఓ యూజర్ పోస్టుకు ఆయన స్పందించారు. -
ఇక అమేఠీలో ర్యాపిడ్ ఫైర్ ప్రచారాలే..!
అమేఠీలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ప్రచారాలే మిగిలిఉన్నాయి. హస్తం పార్టీకి దాదాపు రెండు వారాల సమయం మాత్రమే మిగిలిఉంది. ఈనేపథ్యంలో పార్టీ అభ్యర్థిని ప్రజల్లోకి ఎలా తీసుకెళతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. -
శివసేన గూటికి తిరిగొచ్చిన సంజయ్ నిరుపమ్
కాంగ్రెస్ బహిష్కృత నేత సంజయ్ నిరుపమ్ శివసేన (శిందే వర్గం)లో చేరారు. -
ఫోన్లలో మాట్లాడేందుకూ ప్రజలు భయపడుతున్నారు: శశి థరూర్
కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ అధికార భాజపాపై నిప్పులు చెరిగారు. -
ఉద్ధవ్ది ‘నకిలీ’ శివసేన: అమిత్ షా విమర్శలు
ఉద్ధవ్ ‘నకిలీ’ శివసేన నడుపుతున్నారని.. అసలైన పార్టీ శిందేతోనే ఉందన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. -
లాలూ కుమార్తెపై లాలూ పోటీ..!
లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్యపై లాలూ పోటీ చేస్తున్నారు. ఇది వినడానికి కాస్త విచిత్రంగానే ఉన్నా.. దీనివెనక ఒక ఆసక్తికర విషయం ఉంది. -
ప్రియాంకా గాంధీ.. ఎందుకు పోటీ చేయట్లేదు?
లోక్సభ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ పోటీకి దూరంగా ఉండడానికి కారణం ఏమై ఉండవచ్చన్న అంశంపై చర్చ నడుస్తోన్న క్రమంలో ఆ పార్టీ స్పందించింది. -
‘వారసత్వం కాదు.. బాధ్యత’: రాహుల్ రాయ్బరేలీకి మారడంపై కాంగ్రెస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ అమేఠీ నుంచి రాయ్బరేలీకి మారడంపై విమర్శలు వస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. దీనిపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. -
రాయ్బరేలీ నుంచి నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.
తాజా వార్తలు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి