బ్రేకింగ్

breaking
30 Mar 2023 | 08:29 IST

‘బొలెరో’ను ఢీకొట్టిన ‘దురంతో’.. 5 గంటలుగా నిలిచిన రైలు

భీమడోలు: ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. రైలు హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం వేకువజామున సుమారు 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో సుమారు 5 గంటలుగా రైలు నిలిచిపోయింది. రైలు ఢీకొనడంతో ఆ వాహనం ధ్వంసమైంది. బొలెరో వాహనంలో వచ్చినవాళ్లు దొంగలా? పారిపోయే క్రమంలో గేటును ఢీకొట్టారా? లేదా మరేదైనా కారణమా? అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని