బ్రేకింగ్

breaking
08 May 2024 | 07:21 IST

బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు దుర్మరణం

హైదరాబాద్‌: నగరంలోని బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. నిన్న సాయంత్రం రేణుక ఎల్లమ్మ కాలనీలో వర్షానికి గోడ కూలింది. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ రోజు ఉదయం శిథిలాల నుంచి ఏడుగురి మృతదేహాలను సిబ్బంది వెలికితీశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులను తిరుపతిరావు (20), శంకర్‌ (22), రాజు (25), రామ్‌ యాదవ్‌ (34), గీత (32), హిమాన్షు (4), ఖుషిగా గుర్తించారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని