బ్రేకింగ్

breaking
08 May 2024 | 16:41 IST

ఐదేళ్లుగా ఏపీలో అభివృద్ధి శూన్యం: మోదీ

పీలేరు: ఏపీ వికాసమే తన లక్ష్యమని ప్రధాని నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘ రాయలసీమ ప్రాంతం అనేక మంది ముఖ్యమంత్రులను ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదు. సాగునీటి ప్రాజెక్టులు లేవు, యువత ఉపాధి కోసం వలస వెళ్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాలి. ప్రజలను వైకాపా మోసం చేసింది. ఐదేళ్లుగా ఏపీలో అభివృద్ధిలేదు. పేదల వికాసం కోసం కాకుండా మాఫియా కోసం వైకాపా పనిచేసింది. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక మాఫియాలకు పక్కా ట్రీట్‌మెంట్‌ ఇస్తాం’’ అని అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని