దిల్లీ: కరోనాను తరిమికొట్టేందుకు ఉద్దేశించిన వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో ప్రారంభమైంది. తొలి విడతగా 3 కోట్ల ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్స్కు టీకా అందించే కార్యక్రమం మొదలైంది. ఇదే సమయంలో తమ ఉద్యోగులకు కొవిడ్-19 వ్యాక్సిన్ అందించేందుకు పలు కంపెనీలు సిద్ధమయ్యాయి. వ్యాక్సిన్ను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రాధాన్య వ్యక్తులకు ప్రభుత్వ వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత బహిరంగమార్కెట్లోకి వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని కంపెనీలు భావిస్తున్నాయి. అవి అందుబాటులోకి రాగానే వ్యాక్సిన్లు కొనుగోలు చేసి ఉద్యోగులకు అందించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగులకు వ్యాక్సిన్ అందించేందుకు ఐటీసీ కంపెనీ సిద్ధంగా ఉందని, ఇప్పటికే వ్యాక్సిన్లు తయారు చేసే కంపెనీలతో చర్చలు ప్రారంభించామని ఆ కంపెనీ మానవ వనరుల విభాగాధిపతి ఒకరు వివరించారు. వ్యాక్సిన్లు కమర్షియల్గా వాడుకలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు వ్యాక్సిన్ అందిస్తామని టాటా స్టీల్ తెలిపింది. బల్క్గా వ్యాక్సిన్లు కొనుగోలు చేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉందని జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సైతం వ్యాక్సిన్ కొనుగోలుకు సుముఖత వ్యక్తంచేశారు.
ఇవీ చదవండి..
భారత్కు టెస్లా.. వయా నెదర్లాండ్స్ ..!
ఎస్బీఐ డోర్స్టెప్ బ్యాంకింగ్ సేవలు
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?