
తాజా వార్తలు
సీఎం జగన్కు నరసాపురం ఎంపీ మరో లేఖ
అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి లేఖ రాశారు. వృద్ధాప్య పింఛను వయో పరిమితి 65 ఏళ్లు నుంచి 60కి తగ్గిస్తూ గతేడాది జీవో ఇచ్చారని గుర్తుచేశారు. జూలై 2019 నుంచి జీవో అమలు చేస్తామని చెప్పి.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నారన్నారు. దీనివల్ల ఒక్కో లబ్ధిదారుడు ఏడు నెలలకు రూ.15,750 నష్టపోయారని పేర్కొన్నారు. అర్హులకు ఆ మొత్తం అందేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఏటా పెంచే పింఛను రూ.250 మొత్తాన్ని వైఎస్ జయంతి నుంచి ఇవ్వాలన్నారు. ప్రస్తుత పింఛను మొత్తాన్ని రూ.2500కు పెంచాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.
Tags :