Kavya Maran - Virat Kohli: కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది.
ఇంటర్నెట్ డెస్క్: సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. ఐపీఎల్లోనే తమపై రికార్డు స్కోరు చేసిన సన్రైజర్స్ను బెంగళూరు అడ్డుకొంది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించింది. అయితే, విరాట్ కోహ్లీ (Virat Kohli) నెమ్మదిగా ఆడటంపై నెట్టింట విమర్శలు వస్తుండగా.. మరోసారి ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్యా మారన్ (Kavya Maran) మీమర్స్కు ఫెస్ట్గా మారారు.
బెంగళూరును 206 పరుగులకే పరిమితం చేసినప్పటికీ.. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 171 పరుగులే చేయగలిగింది. తన టీమ్ ఆటగాళ్లు వికెట్లను సమర్పించుకుంటున్న సమయంలో కావ్యా మారన్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో ఆమె పెట్టిన ఎక్స్ప్రెషన్స్ నెట్టింట వైరల్గా మారాయి.
ఇలానా ఆడేది విరాట్?
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. కానీ, అది ఆ జట్టు అభిమానులకు పెద్దగా సంతోషం కలిగించలేదు. దీనికి కారణం విరాట్ కోహ్లీ ఆటతీరు. అతడి స్ట్రైక్రేట్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పవర్ ప్లేలో దూకుడుగా ఆడుతున్నప్పటికీ.. ఆ తర్వాత ఇన్నింగ్స్ నెమ్మదిస్తోందని కామెంట్లు వచ్చాయి. దీంతో విరాట్ ఆటపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. అందుకు తగ్గట్టు హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లోనూ మొదట్లో 18 బంతుల్లోనే 32 పరుగులు చేసిన కోహ్లీ.. పవర్ ప్లే ముగిశాక 25 బంతులను ఎదుర్కొని కేవలం 19 రన్స్ చేయడం గమనార్హం. మొత్తం 118 స్ట్రైక్రేట్తో 51(43) పరుగులు రాబట్టాడు.
విరాట్ ఇన్నింగ్స్ను సోడా బాటిల్తో పోలుస్తూ ఓ అభిమాని పెట్టిన పోస్టు వైరల్గా మారింది. ‘‘మూత తీయగానే సోడా బాటిల్ బుస్ మంటూ పొంగుతుంది. ఆ తర్వాత ఏమీ ఉండదు’’ అనే అర్థంలో క్యాప్షన్ రాసుకొచ్చాడు.
‘‘ఫ్లాట్ పిచ్పై ఎదురు దాడి చేయకుండా ఆడితే ఎలా? కనీసం బెంగళూరు బౌలింగ్నైనా దృష్టిలో ఉంచుకుని పరుగులు చేస్తే బాగుండేది. ‘ఇంపాక్ట్ రూల్’ వల్ల అదనంగా ప్రత్యర్థికి ఒక బ్యాటర్ వస్తాడు’’
‘‘ఒకవేళ రోహిత్ శర్మ ఇలాంటి ఇన్నింగ్సే ఆడి ఉంటే.. భారత జట్టు నుంచి అతడిని తప్పించాలని విరాట్ అభిమానులు డిమాండ్ చేసేవాళ్లే’’
‘‘కోహ్లీ ఇన్నింగ్స్ను చూశాక.. ఫెర్రారీ కారుతో రద్దీ రోడ్లపై వెళ్లినట్లుంది’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ సంగ్రామం ప్రారంభం కానుంది. కానీ, దానిపై ఉగ్రమూకలు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ఐసీసీ స్పందించింది. -
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు