
తాజా వార్తలు
ఏపీ సీఎస్, డీజీపీకి నిమ్మగడ్డ లేఖ
ఎన్నికల విధుల నుంచి 9 మందిని తప్పించాలని సూచన
అమరావతి: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ లేఖ రాశారు. ఎన్నికల విధుల నుంచి 9 మంది అధికారులను తొలగించాలని సూచించారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ.. పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలు, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎస్ఈసీ కోరారు.
గతంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత విధి నిర్వహణలో 9 మంది అధికారులు అలసత్వం వహించారని.. వారిపై చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే సీఎస్, డీజీపీకి ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు. అయితే వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. రేపటి నుంచి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో 9 మంది అధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని సూచించారు. ఆయా స్థానాల్లో మూడేసి చొప్పున పేర్లు ప్రతిపాదించాలని సీఎస్, డీజీపీని లేఖలో ఎస్ఈసీ కోరారు.
ఇవీ చదవండి..
ఏపీ సీఎస్తో ఉద్యోగ సంఘాల ఐకాస భేటీ
పంచాయతీరాజ్ ఉన్నతాధికారులపై ఎస్ఈసీ ఆగ్రహం