
తాజా వార్తలు
చండీగర్: బాలీవుడ్ ప్రేమజంట దీపికా పదుకొణె-రణవీర్సింగ్ స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు. గురువారం తమ మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా దీప్వీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఈ జంట తమ కుటుంబసభ్యులతో కలిసి పంజాబ్లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏడేళ్లపాటు ప్రేమించుకుని గతేడాది నవంబర్ 14న దీపిక-రణవీర్ వివాహంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం కొంకణి, సింధీ సంప్రదాయాల్లో జరిగింది.
వివాహం జరిగిన తర్వాత దీపిక-రణవీర్ కలిసి నటించిన చిత్రం ‘83’. కపిల్దేవ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణవీర్ కపిల్దేవ్ పాత్రలో కనిపించనున్నారు. కపిల్ భార్య రోమీభాటియా పాత్రలో దీపిక నటించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు దీపిక ‘చఫాక్’ చిత్రంలో నటించారు. యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రమిది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్పోర్ట్లో కొత్త మార్పులు
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్కి కోహ్లీ ఫిదా!
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
