విద్యార్థినులకు స్కాలర్షిప్లు
ఆర్థిక సమస్యల కారణంగా ఇంజినీరింగ్ చదవలేని విద్యార్థినులకు చేయూతను అందిస్తోంది డీఆర్డీఓ (డిఫెన్స్ ఆర్ అండ్ డిఆర్గనైజేషన్) స్కాలర్షిప్.దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఆర్థిక సమస్యల కారణంగా ఇంజినీరింగ్ చదవలేని విద్యార్థినులకు చేయూతను అందిస్తోంది డీఆర్డీఓ (డిఫెన్స్ ఆర్ అండ్ డిఆర్గనైజేషన్) స్కాలర్షిప్.దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఎవరు అర్హులు: ఏరోస్పేస్ ఇంజినీరింగ్/ ఏరోనాటికల్ ఇంజినీరింగ్/ స్పేస్ ఇంజినీరింగ్ అండ్ రాకెటరీ/ ఏవియానిక్స్/ ఏర్క్రాఫ్ట్ ఇంజినీరింగ్ చదువుతోన్న డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులు స్కాలర్షిప్ పొందడానికి అర్హులు. డ్యూయల్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
డిగ్రీ: డిగ్రీ స్థాయిలో 20 స్కాలర్షిప్లు ఉన్నాయి. భారతీయ విద్యార్థినులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ (మెయిన్)లో మేలైన స్కోర్ సాధించి ఉండాలి. ఏడాదికి రూ.1,20,000 చొప్పున నాలుగేళ్లకు స్కాలర్షిప్ ఇస్తారు. లేదా వార్షికఫీజు.. ఏది తక్కువగా ఉంటే అది చెల్లిస్తారు.
పీజీ: పీజీ స్థాయిలో 10 స్కాలర్షిప్లు ఉన్నాయి. భారతీయ విద్యార్థినులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంఈ/ఎంటెక్/ఎంఎస్సీ ఇంజినీరింగ్ చదువుతున్నవారై ఉండాలి. బీఈ/బీటెక్/బి.ఇంజినీరింగ్ డిగ్రీలో 60 శాతం మార్కులు పొంది ఉండాలి. గేట్లో మేలైన స్కోర్ సాధించాలి. ఏడాదికి రూ.1,86,000 స్కాలర్షిప్ను రెండేళ్ల కాలానికి చెల్లిస్తారు. లేదా నెలకు రూ.15,500 చొప్పున చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతోపాటు ఇటీవలి పాస్పోర్ట్ సైజ్ కలర్ఫొటో, ఆధార్, ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్, ఫీజు వివరాలు... మొదలైనవి అప్లోడ్ చేయాలి. పూర్తి వివరాలతో నింపకపోయినా, సంబంధిత పత్రాలను జతపరచకపోయినా దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎలాంటి కరస్పాండెన్స్కూ అవకాశం ఉండదు. స్కాలర్షిప్ల మంజూరుకు సంబంధించి ఏ దశలోనూ ఎలాంటి ఫీజూ చెల్లించనవసరం లేదు. ప్రతిభ ఆధారంగానే అర్హులైన విద్యార్థినులను ఎంపికచేస్తారు.
దరఖాస్తులకు చివరి తేది: 31.03.2022
వెబ్సైట్: https://rac.gov.in
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్