CM Chandrababu: తొందరపడి టికెట్లు ఇచ్చానేమో..!
యువత కదా అని ప్రోత్సహిస్తే రచ్చకెక్కి పరువు తీశారు
ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని విభేదాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
వారి వ్యవహారం తేల్చాలని క్రమశిక్షణ కమిటీకి ఆదేశం

ఈనాడు, అమరావతి: ‘పార్టీ సిద్ధాంతాలు, కట్టుబాట్లు గురించి తెలియనివారికి, రాజకీయ అనుభవం లేనివారికి టికెట్లిస్తే ఇలాంటి సమస్యలే వస్తాయి. నేను కూడా తొందరపడ్డానేమో! వారి వ్యవహారశైలిని కొంతకాలం చూశాక టికెట్లు ఇవ్వాల్సింది. యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో టికెట్లు ఇస్తే పార్టీ పరువు ఇలా బజారుకు ఎక్కిస్తున్నారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) విభేదాలతో రచ్చకెక్కడంపై ఆయన మండిపడ్డారు. వారిద్దరినీ పిలిచి మాట్లాడతామని పార్టీ నాయకులు చెప్పగా.. ఎవర్నీ బతిమలాడాల్సిన పనిలేదని, తీరు మార్చుకోకపోతే ఉపేక్షించబోమని స్పష్టంగా చెప్పాలని చంద్రబాబు పేర్కొన్నారు. వారిద్దరినీ పిలిచి వివరణ తీసుకుని తనకు నివేదించాలని, లండన్ పర్యటన నుంచి తిరిగొచ్చాక వారితో మాట్లాడతానని క్రమశిక్షణ కమిటీకి చెప్పారు. ముఖ్యమంత్రి శుక్రవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నేతలు వర్ల రామయ్య, అశోక్బాబు, మంతెన సత్యనారాయణరాజు, బ్యాక్ ఆఫీస్లోని వివిధ విభాగాలతో సమావేశం నిర్వహించారు.
పార్టీ గుర్తుపైనే గెలిచారని మర్చిపోతే ఎలా?
- పార్టీ నాయకులు పరస్పర ఆరోపణలతో మీడియాకు ఎక్కడం గతంలో ఎప్పుడూ లేదు. పార్టీ విధానాల్ని అనుసరించకుండా, సొంత ఎజెండాతో వెళ్లాలనుకున్నవారు స్వతంత్రంగా పోటీ చేస్తే వారి సత్తా ఏంటో తెలిసేది. పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టే గెలిచామని గుర్తు పెట్టుకోవాలి.
 - వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనని నాయకుల వివరాలు నాకివ్వండి. ప్రతి నాయకుడి పనితీరు, వ్యవహారశైలిని నమోదు చేస్తున్నాం.
 - భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం వివరాల నమోదు త్వరలో మొదలవుతుంది. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులంతా తప్పనిసరిగా పాల్గొనాలి.
 
సీఎంఆర్ఎఫ్ లేఖలు ఇవ్వడానికీ ఎమ్మెల్యేలకు తీరిక లేదా?
పేదలకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద ఉదారంగా సాయం అందిస్తుంటే కొందరు ఎమ్మెల్యేలు దానిపైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు అర్హులైన పేద రోగులకూ సీఎంఆర్ఎఫ్ లేఖలు ఇవ్వడం లేదన్న విషయం సీఎం దృష్టికి తేగా వారి వివరాలు తనకు ఇవ్వాలని, అలాగే అనర్హులకు లేఖలు ఇచ్చినవారి వివరాలూ అందజేయాలని, వారితో మాట్లాడతానని సీఎం పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు సిద్ధమైన తర్వాత కూడా ఎమ్మెల్యేలు వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా దగ్గర పెట్టుకుంటున్నారని, గడువు ముగిసిపోవడంతో మళ్లీ చెక్కులు ఇవ్వాల్సి వస్తోందని సీఎం పేర్కొన్నారు. ఇలాంటి వాటిలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించనన్నారు. మతపరమైన, సున్నితమైన అంశాలపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నాయకులకు సూచించారు.
మద్యం వ్యాపారానికి దూరంగా ఉండాలి
తెదేపా నాయకులు మద్యం వ్యాపారానికి దూరంగా ఉండాలని, అలాంటి వారి వల్ల పార్టీకి మరక అంటుతోందని సీఎం వ్యాఖ్యానించారు. పార్టీ కేడర్ను ఆర్థికంగా ఎలా బలోపేతం చేయాలన్న అంశంపై నాయకులతో చర్చించారు. మొంథా తుపానును దీటుగా ఎదుర్కోవడంలో ప్రభుత్వం చేసిన కృషిని పార్టీ పరంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. లండన్ నుంచి తిరిగొచ్చాక పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీలను ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు.
తిరుమల పవిత్రతను మంటగలిపిన వైకాపా నేతలు
ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తితిదేలో కూడా వైకాపా నేతలు అవినీతికి పాల్పడి రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీశారని చంద్రబాబు మండిపడ్డారు. ‘కల్తీ నెయ్యి వ్యవహారంతో తిరుమల పవిత్రతను మంటగలిపారు. పరకామణి నుంచి చోరీ వ్యవహారంలో వైకాపా నేతలు నిందితుల్ని కాపాడేలా వ్యవహరించడం సిగ్గుచేటు. వైకాపా నేతలు విపత్కర పరిస్థితుల్లోనూ వికృత మనస్తత్వంతో విషం చిమ్ముతున్నారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
గ్రామ, వార్డు సచివాలయాల్ని స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మార్చాలన్న ప్రతిపాదనపై సమావేశంలో చర్చ జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో మావయ్య నిర్దోషి
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిన్నారి నాగవైష్ణవి అపహరణ, హత్య కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ హైకోర్టు పాక్షికంగా సవరించింది. - 
                                    
                                        

నెల్లూరు జైలుకు మాజీ మంత్రి జోగి రమేష్
నకిలీ మద్యం కేసులో వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాములకు కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు వారిద్దరినీ నెల్లూరు జైలుకు తరలించారు. - 
                                    
                                        

ప్రభుత్వాసుపత్రిలో దౌర్జన్యంపై కేసు
పోలీసులను దౌర్జన్యంగా తోసేసి.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అద్దాలు పగలగొట్టిన ఘటనపై వైకాపా నేత జోగి రమేష్ భార్య, ఇద్దరు కుమారులు, మరికొందరిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. - 
                                    
                                        

పెట్టుబడులకు ఏపీ ఎంతో అనుకూలం
వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్లో అనుకూల వాతావరణం ఉందని, అనుమతులు సైతం సింగిల్ విండో విధానంలో జారీ చేస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. - 
                                    
                                        

చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఎయిమ్స్లో చికిత్స
మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి మంగళగిరి ఎయిమ్స్లో వైద్య చికిత్స అందించారు. - 
                                    
                                        

మద్యం డబ్బులు తీసుకోలేదని జగన్ ప్రమాణం చేయగలరా?
‘మద్యం నుంచి డబ్బులు తీసుకోవడం లేదని నేను దేవుడిపై ప్రమాణం చేస్తాను. తాను తీసుకోలేదని వైకాపా నేత జగన్ తన పిల్లలపై గానీ దేవుడిపై గానీ ప్రమాణం చేయగలరా’ అని మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. - 
                                    
                                        

అమరావతిలో ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్
అమరావతిలో వచ్చే జనవరి నాటికి ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. లండన్లో పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. - 
                                    
                                        

విజయవాడలో ఎల్ఐసీ హౌసింగ్ ఉప ప్రాంతీయ కార్యాలయం
వ్యక్తిగత గృహ రుణాల మంజూరులో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆశించిన ప్రగతి కనబరుస్తోందని, భవిష్యత్తులో మరింత పుంజుకుంటుందని ఆ సంస్థ ఎండీ, సీఈవో త్రిభువన్ అధికారి పేర్కొన్నారు. - 
                                    
                                        

ఓఎంసీ గనుల్లో డ్రోన్ సర్వే ప్రారంభం
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రాంతంలో అంతర్రాష్ట్ర సరిహద్దు గుర్తింపు కోసం సోమవారం అధికారులు డ్రోన్తో సర్వే ప్రారంభించారు. అనంతపురం జిల్లా ఓబుళాపురం, సిద్ధాపురం గ్రామాల పరిధిలో అక్రమ తవ్వకాల కారణంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులు గల్లంతయ్యాయి. - 
                                    
                                        

‘వీధి కుక్కలకు ఆహారం’పై త్వరలో మార్గదర్శకాలు
ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో వీధి శునకాలకు ఉద్యోగులు ఆహారం పెట్టే విషయంలో తగు మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. - 
                                    
                                        

భాగస్వామ్య సదస్సులో ₹ 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు
విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు 45 దేశాలకు చెందిన 300 మంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరుకానున్నారని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. - 
                                    
                                        

160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి మా లక్ష్యం
రాష్ట్రంలో 160 గిగావాట్ల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా లండన్లో అతిపెద్ద విద్యుత్తు సరఫరాదారుగా ఉన్న ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ను రాష్ట్రానికి ఆహ్వానించారు. - 
                                    
                                        

ప్రపంచకప్ గెలిచిన జట్టులో మా అమ్మాయి ఉండటంపై గర్విస్తున్నాం
మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలవడం, అందులో తమ కుమార్తె భాగస్వామ్యం కావడంపై గర్వపడుతున్నామని భారత మహిళల జట్టు క్రీడాకారిణి శ్రీచరణి తల్లిదండ్రులు నల్లపురెడ్డి చంద్రశేఖర్రెడ్డి, రేణుక తెలిపారు. - 
                                    
                                        

హాయ్ల్యాండ్కు తరలించాలన్న నిర్ణయం ఎవరిది?
‘ఏపీపీఎస్సీ కార్యాలయం నుంచి గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాలను మంగళగిరి సమీపంలోని హాయ్ల్యాండ్ రిసార్ట్కు తరలించాలనే నిర్ణయం ఎవరిది? ఏపీపీఎస్సీ సమష్టిగా నిర్ణయం తీసుకుందా? లేదా అప్పటి ఛైర్మన్, లేదా కార్యదర్శి నిర్ణయం మేరకు వాటిని తరలించారా? ఇందుకు సంబంధించిన ఏమైనా ఉత్తర్వులున్నాయా? - 
                                    
                                        

రాజధాని నిర్మాణానికి మరో ₹ 32,500 కోట్ల రుణం
రాజధాని అమరావతి నిర్మాణానికి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) మరో రూ.32,500 కోట్లు రుణం తీసుకోనుంది. - 
                                    
                                        

పింఛనుదారులకు డిజిటల్ సాధికారత
పింఛనుదారులకు డిజిటల్ సాధికారత కల్పించడం, పింఛను పొందే ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా డిజిటల్ జీవన ప్రమాణ పత్రాన్ని (లైఫ్ సర్టిఫికెట్) విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని కేంద్ర ప్రభుత్వ పింఛను, పింఛనర్ల సంక్షేమ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవేశ్ కుమార్ పేర్కొన్నారు. - 
                                    
                                        

భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేయాలి
‘కార్తిక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగినందున భక్తుల భద్రత, సౌకర్యాలపై యంత్రాంగం దృష్టి సారించాలి. క్యూలైన్లు, పారిశుద్ధ్య నిర్వహణ, భద్రతలపై తగిన చర్యలు చేపట్టాలి’ అని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆదేశించారు. - 
                                    
                                        

ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా పులికాట్
తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సును ఎకో టూరిజానికి గమ్యస్థానంగా.. ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పేర్కొన్నారు. - 
                                    
                                        

దొనకొండలో ప్రపంచస్థాయి క్యాన్సర్ సెంటర్ రూ.4,260 కోట్లతో నిర్మాణం
ప్రకాశం జిల్లా దొనకొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.4,260 కోట్ల (480 మిలియన్ డాలర్ల) వ్యయంతో ‘చున్ జియోంగ్ ఉన్ చల్లా క్యాన్సర్ సెంటర్’ను నిర్మించనున్నట్లు దక్షిణ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం ఛైర్మన్ పీటర్ చున్ వెల్లడించారు. - 
                                    
                                        

రాష్ట్రంలో ‘హిందుజా’ రూ.20 వేల కోట్ల పెట్టుబడులు
హిందుజా గ్రూపు రాష్ట్రంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ మేరకు కీలక ఒప్పందం కుదిరింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


