CM Jagan: చదువుతోనే జీవన స్థితిగతుల్లో మార్పు: సీఎం జగన్‌

ఏపీలో ప్రైవేట్‌ బడుల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరిగాయని సీఎం జగన్‌ అన్నారు. నాడు- నేడుతో పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నట్లు చెప్పారు. ‘జగనన్న విద్యాదీవెన’ పథకం డబ్బులను తాడేపల్లిలోని

Updated : 16 Mar 2022 13:07 IST

‘జగనన్న విద్యాదీవెన’ డబ్బులను జమ చేసిన జగన్‌

అమరావతి: ఏపీలో ప్రైవేట్‌ బడుల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరిగాయని సీఎం జగన్‌ అన్నారు. నాడు- నేడుతో పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నట్లు చెప్పారు. ‘జగనన్న విద్యాదీవెన’ పథకం డబ్బులను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జగన్‌.. తల్లుల ఖాతాల్లో జమచేశారు. అనంతరం మాట్లాడుతూ.. చదువుతో జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందని చెప్పారు. చదువులకు పేదరికం అడ్డు కాకూడదని జగన్‌ అన్నారు. చదువుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని చెప్పారు. విద్య మాత్రమే పేదరికాన్ని దూరం చేస్తుందని తెలిపారు. అర్హులైన అందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నట్లు సీఎం వివరించారు. గత ప్రభుత్వంలోని బకాయిలు రూ.1,778 కోట్లు కూడా చెల్లిస్తున్నట్లు జగన్‌ చెప్పారు.

‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2021 అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి ప్రభుత్వం రూ.10.82 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు జమ చేసినట్లు జగన్‌ చెప్పారు. ఈ పథకం కింద విద్యా సంవత్సరంలో మూణ్నెళ్లు పూర్తయిన వెంటనే ఆ కాలానికి సంబంధించిన బోధనా రుసుముల్ని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని