Vangalapudi anitha: ముందస్తు చర్యలతో సంగం బ్యారేజీకి ముప్పు తప్పింది: హోం మంత్రి అనిత

Eenadu icon
By Andhra Pradesh News Team Updated : 30 Oct 2025 16:58 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

విజయవాడ: అధికారుల ముందస్తు చర్యలతో నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీకి ముప్పు తప్పిందని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సంగం బ్యారేజీకి కొట్టుకువచ్చిన 35 టన్నుల భారీ బోటును ఒడ్డుకు చేర్చడంలో అధికారుల పనితీరు ప్రశంసనీయమన్నారు. బ్యారేజీకి ప్రమాదం సంభవించకుండా కలెక్టర్, అధికారులు వెంటనే స్పందించారని తెలిపారు. సంగం బ్యారేజీ బోటు ప్రమాదానికి గురికాకుండా చర్యలు తీసుకున్నారన్నారు.

నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం: బీసీ జనార్ధన్‌రెడ్డి

నంద్యాల జిల్లా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి పర్యటించారు. బనగానపల్లె నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. కోవెలకుంట్ల, సంజామల మండలాల్లో దెబ్బతిన్న పంటను పరిశీలించారు. కోవెలకుంట్ల మండలం స్వామినగర్‌, బిజినవేములలో కూలిన మట్టి మిద్దెలను పరిశీలించారు. దెబ్బతిన్న రోడ్లను పరిశీలించి.. పునరుద్ధరణ పనులు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

Tags :
Published : 30 Oct 2025 16:56 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు