AndhraPradesh: ట్రెజరీ సర్వర్లో ఇబ్బందులు.. వారాంతంలోనూప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ఆదేశం
ఉద్యోగుల జీతాల బిల్లులకు సంబంధించిన ట్రెజరీ సర్వర్లో ఇబ్బందులు తలెత్తాయి. అయినప్పటికీ, కొత్త జీతాలు చెల్లించేందుకు సర్కారు యత్నిస్తోంది. ఈ మేరకు జీతాల బిల్లుల ప్రాసెస్ చేపట్టింది. మొత్తం 4.50 లక్షల బిల్లులకుగానూ 1.10 లక్షల బిల్లులు ట్రెజరీలకు...
అమరావతి : ఉద్యోగుల జీతాల బిల్లులకు సంబంధించిన ట్రెజరీ సర్వర్లో ఇబ్బందులు తలెత్తాయి. అయినప్పటికీ, కొత్త జీతాలు చెల్లించేందుకు సర్కారు యత్నిస్తోంది. ఈ మేరకు జీతాల బిల్లుల ప్రాసెస్ చేపట్టింది. మొత్తం 4.50 లక్షల బిల్లులకుగానూ 1.10 లక్షల బిల్లులు ట్రెజరీలకు చేరాయి. ఇప్పటి వరకూ 25 శాతం మంది ఉద్యోగుల జీతాల బిల్లులు ప్రాసెస్ అయినట్లు తెలుస్తోంది. పోలీసుశాఖతోపాటు కోర్టు ఉద్యోగుల బిల్లులే ట్రెజరీకి చేరుకున్నట్లు ఆ విభాగం వెల్లడించింది.
సర్వర్ సమస్యలతో బిల్లుల ప్రాసెసింగ్ ఆలస్యమవుతోంది. దీంతో శని, ఆదివారాల్లోనూ బిల్లుల ప్రాసెస్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు పాత జీతం చెల్లించాలని డీడీవోలకు ఉద్యోగులు లేఖలు ఇచ్చారు. ఉద్యోగులకు చెందిన బిల్లులు ప్రాసెస్ చేయాలని డీడీవోలపై కలెక్టర్లు ఒత్తిడి తెస్తున్నారు. కాగా, ఫిబ్రవరి 1 నుంచి పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల ఖాతాల్లో కొత్త వేతనాలు పడతాయని ప్రభుత్వం వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు