ఇక సెలవు
ప్రపంచ చరిత్రలో ఓ కీలక అధ్యాయానికి తెరపడింది! అఫ్గానిస్థాన్లో అమెరికా బలగాల 20 ఏళ్ల ప్రస్థానం ముగిసింది! ఆ దేశం నుంచి అగ్రరాజ్య బలగాలు పూర్తిగా వెనక్కి మళ్లాయి. అఫ్గాన్
అఫ్గాన్ను వీడిన అమెరికా సైనికులు
గడువుకు ఒకరోజు ముందే తరలింపు పూర్తి
రెండు దశాబ్దాల పోరాటానికి తెర
ముష్కరుల చేతికి చిక్కకుండా ఆయుధ వ్యవస్థల నిర్వీర్యం
చివరిరోజు కాబుల్ విమానాశ్రయంలో ఉద్విగ్న వాతావరణం
కాబుల్, వాషింగ్టన్: ప్రపంచ చరిత్రలో ఓ కీలక అధ్యాయానికి తెరపడింది! అఫ్గానిస్థాన్లో అమెరికా బలగాల 20 ఏళ్ల ప్రస్థానం ముగిసింది! ఆ దేశం నుంచి అగ్రరాజ్య బలగాలు పూర్తిగా వెనక్కి మళ్లాయి. అఫ్గాన్ గడ్డపై ముష్కర మూకలను నిర్మూలించాలన్న తమ లక్ష్యం నెరవేరలేదన్న వేదన మనసుల్ని కుంగదీస్తున్నా.. ఆ దేశాన్ని తాలిబన్ల చేతుల్లో పెట్టి తప్పనిసరి పరిస్థితుల్లో స్వదేశానికి పయనమయ్యాయి. ముందుగా నిర్దేశించుకున్న గడువుకు ఒకరోజు ముందుగానే తరలింపు చర్యలకు గుమ్మడికాయ కొట్టేశాయి!
అఫ్గానిస్థాన్లో రెండు దశాబ్దాల సుదీర్ఘ పోరాటానికి అమెరికా మంగళం పలికింది. అక్కడి నుంచి తమ సైనికులందర్నీ వెనక్కి రప్పించింది. తాలిబన్ల ఆక్రమణ అనంతరం గత రెండు వారాలుగా అఫ్గాన్ నుంచి విదేశీ పౌరులు, బలగాలు, శరణార్థుల తరలింపు చర్యలను అమెరికా ముమ్మరంగా కొనసాగించింది. మంగళవారం (ఆగస్టు 31) కల్లా తరలింపులను పూర్తిచేయాలని తుది గడువు విధించుకుంది. అయితే అంతకంటే ఒకరోజు ముందే వాటిని ముగించింది. అగ్రరాజ్యానికి చెందిన చివరి సి-17 విమానం కాబుల్ విమానాశ్రయం నుంచి సోమవారం అర్ధరాత్రి బయలుదేరి వెళ్లింది. దాదాపు 200 మంది అమెరికన్లు ఇంకా అఫ్గాన్లోనే ఉన్నారు. ప్రస్తుతానికి తరలింపు చర్యలను ముగించినప్పటికీ.. అఫ్గాన్లోని అమెరికన్లుగానీ, ఇతర అఫ్గానీలుగానీ దేశం వీడాలనుకుంటే వారికి సహాయం చేస్తామని అమెరికా భరోసా ఇచ్చింది.
‘అనుకున్నంతమందిని తరలించలేకపోయాం’
అఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహణ సోమవారం ఉద్వేగపూరితంగా సాగింది. ఐఎస్ఐఎస్-కె ఉగ్రవాదులు దాడులు చేసే ముప్పు పొంచి ఉండటంతో ఆఖరి విమానం బయలుదేరే వరకూ సైనికులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. చివరి కొన్ని గంటల్లో కాబుల్ నుంచి దాదాపు 1,500 మంది అఫ్గానీలను తాము సురక్షితంగా బయటకు తీసుకెళ్లామని అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ మెరీన్ జనరల్ ఫ్రాంక్ మెకంజీ తెలిపారు. తరలింపు చర్యలను ముగించే సమయానికి విమానాశ్రయంలో పౌరులెవరూ లేరని స్పష్టం చేశారు. ‘‘ఉద్విగ్న క్షణాల మధ్య మేం కాబుల్ను వీడాం. అనుకున్నంత మందిని తరలించలేకపోయాం’’ అని పేర్కొన్నారు. అఫ్గాన్లో తమ ఆయుధ వ్యవస్థలు, ఇతర అధునాతన సామగ్రి.. ముష్కరుల చేతికి చిక్కకుండా అమెరికా బలగాలు జాగ్రత్తలు తీసుకున్నాయి. విమానాశ్రయం వద్ద మోహరించిన ‘రాకెట్లు, మోర్టార్ల విధ్వంసక వ్యవస్థ (సి-రామ్)’ సహా పలు ఆయుధ వ్యవస్థలను నిర్వీర్యం చేశాయి. కాబుల్లో విమానాల రాకపోకలు కొనసాగేందుకు ఉపయోగపడే అగ్నిమాపక వాహనాలు వంటి కొన్నింటిని తాలిబన్లు ఉపయోగించుకునేలా అక్కడే ఉంచాయి.
అమెరికాలోనూ ఉద్విగ్నత
తరలింపు చర్యల చివరి 90 నిమిషాలను పెంటగాన్లో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. తమ సైనికులు రన్వేపై తనిఖీలు చేపట్టడం, కీలక రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, సి-17 విమానాల్లోకి ఎక్కడం వంటి పరిణామాలన్నింటినీ నిశ్శబ్దంగా చూశారు. చివరి విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు పెంటగాన్లోనూ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఆ విమానం సురక్షితంగా బయలుదేరాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం.. తరలింపు చర్యల్ని సమన్వయం చేసిన మేజర్ జనరల్ క్రిస్టోఫర్ డానహ్యూ (82వ ఎయిర్బార్న్ డివిజన్ కమాండర్)కు ఆస్టిన్ ఫోన్ చేశారు. కాబుల్లో అందరికంటే చివరగా విమానం ఎక్కింది డానహ్యూయే. ఆయన కంటే ముందు అఫ్గాన్లో అమెరికా రాయబారిగా ఉన్న రాస్ విల్సన్ విమానంలోకి ప్రవేశించారు.
చొరబాటుదారులకు గుణపాఠం
‘‘అఫ్గానిస్థాన్కు శుభాకాంక్షలు. ఈ విజయం మనందరిదీ. తాలిబన్లు సాధించిన ఈ గెలుపు చొరబాటులందరికీ గుణపాఠం’’ అని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన కాబుల్ విమానాశ్రయం రన్వేపైనే వందల మంది ముఠా సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా సహా ప్రపంచ దేశాలన్నింటితో తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మరో కీలక నేత హెక్మతుల్లా వసీఖ్ మాట్లాడుతూ.. అందరికీ తాము క్షమాభిక్ష ప్రసాదించామని పునరుద్ఘాటించారు. అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిపోవడంతో అఫ్గాన్కు సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చిందని తాలిబన్ రాజకీయ విభాగంలోని కీలక నేత షహాబుద్దీన్ దిలావర్ వ్యాఖ్యానించారు. త్వరలోనే దేశం ప్రగతి బాటలో పయనిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. హెచ్ఎస్బీసీ, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే విశాఖను వదిలి వెళ్లిపోయాయి. -
ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు
వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. -
జగన్ పంతం.. జలయజ్ఞ విధ్వంసం!
తడిచెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. ‘కాలువ నీరెప్పుడు వస్తుందంటే చెప్పరు.. ఈ కష్టాల సాగు మావల్ల కాదు’ అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు. -
జగన్ జమానాలో.. ఆశా ‘నిరాశై’..!
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. -
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోకుండా చేశారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
ఆంధ్రా పారిస్లో అ‘న్న’న్నా!
‘నాకు మంచి స్నేహితుడు’ అని ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రజాప్రతినిధిని ఇటీవల ఓ సభలో ప్రజలకు పరిచయం చేశారు. -
అత్యవసర వాహనానికి ఆపద!
తిరుపతి నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న ఓ 108 వాహనం బుధవారం ఉదయం ఇలా నడిరోడ్డుమీదే ఆగిపోయింది. -
21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో బుధవారం 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 118 మండలాల్లో వడగాలులు వీచాయి. 21 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
విజ్ఞతతో ఓటేద్దాం.. అభివృద్ధికి బాటేద్దాం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోస్టుమ్యాన్ పురుష్తోతం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. -
మద్యం ఆదాయం.. ఐదేళ్లలో నాలుగు రెట్లు!
‘రాష్ట్రానికి ఏటా సుమారు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులో రూ.72వేల కోట్లు జీఎస్టీ, వ్యాట్, రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది. -
నేరచరిత్ర, ఆస్తుల వివరాలను అభ్యర్థులు ప్రకటించుకోవాల్సిందే
సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలను స్వతంత్రంగా పత్రికల్లో ప్రచురించుకోవాలని, ఆయా పార్టీల వెబ్సైట్లో వివరాలను ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
పంచాయతీ భవనంలో మద్యం నిల్వలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏకంగా పంచాయతీ భవనంలోనే మద్యం నిల్వలు దాచిపెట్టిన ఉదంతం కలకలం రేపింది. -
రూ.80 లక్షల విలువైన మద్యం ధ్వంసం
ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. -
చందనోత్సవం వేళ.. సింహాచలం డీసీకి కమిషనరేట్లో బాధ్యతలు
సింహాచలంలో ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. గతేడాది ఇదే చందనోత్సవంలో అధికార యంత్రాంగం విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
హోంగార్డుల వేతనాల్లో కోతపై గగ్గోలు
తమిళనాడులో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డుల వేతనాల్లో కోత పడింది. బుధవారం ఖాతాల్లో పడిన వేతనం చూసి వారు హతాశులయ్యారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.