సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
భారం పడదని చెబుతూనే.. మిగులు లెక్కలు చూపిన ఏపీఈఆర్సీ
ఆ భారాన్ని వినియోగదారులపైనే..
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీనివల్ల డిస్కంలకు విముక్తి లభిస్తుంది’
సెకి నుంచి విద్యుత్ తీసుకునే ప్రతిపాదనల ఆమోదం కోసం డిస్కంల పిటిషన్ను ఆమోదిస్తూ ఏపీఈఆర్సీ వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది.
ఈనాడు-అమరావతి: భారత సౌర విద్యుత్తు సంస్థ (సెకి) నుంచి తీసుకునే మిగులు విద్యుత్తు వల్ల వినియోగదారులపై రూ.8,291 కోట్ల భారం పడనుంది. ఒప్పందం ప్రకారం సెకి సంస్థకు యూనిట్కు రూ.2.49 చొప్పున చెల్లించే ధర ప్రకారం లెక్కిస్తేనే ఈ మొత్తం అవుతుంది. వాస్తవ విద్యుత్ ఉత్పత్తి వ్యయంతో లెక్కిస్తే ఆ భారం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఏటా జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నిత్యం విద్యుత్ డిమాండ్కు మించి వివిధ వనరుల నుంచి విద్యుత్ లభిస్తుంది. రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాలను బ్యాక్డౌన్ (విద్యుత్ ఉత్పత్తి తగ్గించిన తర్వాత) చేసిన తర్వాత రాబోయే ఏడేళ్ల పాటు మిగులు విద్యుత్తు ఉంటుందని అంచనా వేసింది. ఏపీఈఆర్సీ వేసిన అంచనా ప్రకారం ఏడేళ్లలో సుమారు 33,300 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ మిగిలిపోనుంది.
ఈ ఏడాది నుంచే సెకి విద్యుత్
సెకి నుంచి ఏటా గరిష్ఠంగా 17 వేల ఎంయూల సౌరవిద్యుత్తు తీసుకునేలా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అది ఈ ఏడాది సెప్టెంబరు నుంచి వచ్చే మూడేళ్లలో లభిస్తుంది. ఆ విద్యుత్తును మనం వాడుకోకపోయినా ఏడేళ్ల పాటు భారాన్ని వినియోగదారులే భరించక తప్పని పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. సెకి విద్యుత్తో ప్రజలపై ఎలాంటి భారమూ పడబోదని చెప్పిన ఏపీఈఆర్సీ.. పరోక్షంగా భారం వేసేలా లెక్కలు చూపుతోంది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరుల నుంచి వచ్చే విద్యుత్తు ఉత్పత్తి ఎంత? దానికి సెకి విద్యుత్తును కూడా కలిపి..రాష్ట్రంలో అప్పటి డిమాండ్ ఆధారంగా లెక్కలు వేసింది. ఆ ప్రకారం ఎంత విద్యుత్తు మిగిలే అవకాశం ఉందనేది తేల్చింది. మిగులు విద్యుత్తు సర్దుబాటు కోసం థర్మల్ యూనిట్లను పూర్తి సామర్థ్యంలో 40 శాతానికి మించి బ్యాక్డౌన్ చేయడం సాధ్యం కాదు. ఆ మేరకు ఉత్పత్తి తగ్గించినా ఇంకా మిగులు ఉంటుందని ఏపీఈఆర్సీ అంచనా వేసింది. సెకి విద్యుత్తు ఒకసారి గ్రిడ్కు అనుసంధానం చేశాక వాడినా.. వాడకున్నా బిల్లు చెల్లించాలి. ఆ మిగులు భారం మొత్తం ప్రజలపైనే పడనుంది.
మెగావాట్ సామర్థ్యం గల పవన విద్యుత్తు ప్లాంటు నుంచి ఏడాదికి సగటున 2 ఎంయూల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని అంచనా. ఈ ప్రకారం రాష్ట్రంలో ఏడేళ్లలో సుమారు 33,300 ఎంయూల మిగులు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. సెకి సంస్థకు యూనిట్కు రూ.2.49 చొప్పున చెల్లించే ధర ప్రకారం లెక్కిస్తేనే రూ.8,291.70 కోట్లు అవుతుంది. ఆ భారాన్ని వినియోగదారులపై ప్రభుత్వం వేయబోతోంది. సెకి విద్యుత్ వల్ల ప్రత్యక్షంగా భారం పడకున్నా.. పరోక్షంగా వినియోగదారులే భరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముందు సీఎస్ చూసి వెళ్లారు.. తర్వాత రౌడీ మూకలొచ్చాయి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, ఆయన కుమారుడు తాము సాగు చేసుకుంటున్న భూములను మే 20వ తేదీన పరిశీలించాక, త్రిలోక్ ముఠా వాటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిందని అన్నవరం, తూడెం గ్రామ రైతులు ఆరోపించారు. -
గుత్తేదార్లకు నిధుల ‘ధార’
వాటర్ గ్రిడ్ టెండర్ల వ్యవహారంలో రాష్ట్ర గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజినీర్లు అడ్డగోలుగా వ్యవహరించారు. జలజీవన్ మిషన్లో భాగమైన రూ.8,690 కోట్ల విలువైన వాటర్ గ్రిడ్ పనులను ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉండే గుత్తేదారు సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారు. -
మధ్యాహ్నం బాధ్యతలు.. సాయంత్రం విరమణ
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, వేధింపులకు గురైన డైరెక్టర్ జనరల్ హోదా కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) చివరికి ఆయన కోరుకున్నట్లుగానే పోలీసు యూనిఫాంలో పదవీ విరమణ చేశారు. -
ప్రజారోగ్యంతో చెలగాటం!
ప్రజారోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది. ప్రజలు కలుషిత నీరు తాగి.. ప్రాణాలు కోల్పోతున్న ఘటనలే అందుకు నిదర్శనం. విజయవాడ నగరంలో ప్రస్తుతం వరుస అతిసార మరణాలు కలవరానికి గురిచేస్తున్నాయి. -
మన గుడిలో పూజ.. దిల్లీ సంస్థ సేవ!
రాష్ట్రంలో దేవాదాయశాఖకు చెందిన ప్రధాన ఆలయాల్లో నిర్వహించే అన్ని రకాల వర్చువల్ (పరోక్ష) పూజలు, సేవలకు సంబంధించిన టికెట్లను విక్రయించడానికి దిల్లీకి చెందిన సంస్థకు సైతం అనుమతి ఇస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
న్యాయవ్యవస్థపై జస్టిస్ శేషసాయి ముద్ర ప్రస్ఫుటం
న్యాయవ్యవస్థపై జస్టిస్ ఏవీ శేషసాయి చెరగని ముద్ర వేశారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ అభినందించారు. -
శ్రీవారి సేవలో కేంద్ర హోంమంత్రి అమిత్షా
తిరుమల శ్రీవారిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న హోంమంత్రి అమిత్షా, సోనాల్షా దంపతులకు అర్చకులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఏమైందో ఏమో..! ఎప్పుడూ గలగలా మాట్లాడే మోదీ మౌనంగానూ, ఎల్లప్పుడూ మౌనంగా ఉండే మన్మోహన్ గట్టిగానూ మాట్లాడుతున్నారు..!! -
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి -
విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు
ఇకపై.. విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు వెళ్లనున్నారు. ఉపాధ్యాయులు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో బోధన తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించాలంటూ రాష్ట్రప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
తాడిపత్రి అల్లర్ల కేసులో మరో 9 మంది అరెస్టు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన రాళ్లదాడి ఘటనలో శుక్రవారం తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్సై గౌస్బాషా తెలిపారు. -
కలుషిత నీటితో 8కి చేరిన మృతుల సంఖ్య
అతిసారంతో శుక్రవారం మరో మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతిచెందారు. విజయవాడ నగరం 64వ డివిజన్కు చెందిన చౌదరి కనకమ్మ(60) వాంతులు విరేచనాలతో ఉదయం మరణించారు. -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీత రచన పోటీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర గీతంగా ఉన్న ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతాన్ని గౌరవిస్తూనే దాని స్థానంలో వర్తమాన ఆంధ్రప్రాంత వైభవ స్వాభిమాన గీతాన్ని రూపొందించేందుకు ఐదు నిమిషాల నిడివిగల గీత రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. -
రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ డిమాండ్
రోహిణీకార్తె నేపథ్యంలో మండిపోతున్న ఎండలతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. విద్యుత్ వినియోగం 258.34 మిలియన్ యూనిట్ (ఎంయూ)లకు చేరింది. -
పోస్టల్ బ్యాలట్పై నిబంధనల మేరకే ఆ ఉత్తర్వులు
పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపు సమయంలో ఓటరు డిక్లరేషన్కు సంబంధించిన ‘ఫాం-13ఏ’పై అటెస్టింగ్ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా పర్వాలేదు, -
సంక్షిప్త వార్తలు (5)
తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన అక్షత్ గ్రీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వివేక్ కైలాష్, విక్రమ్ కైలాష్ కుటుంబసభ్యులు రూ.1.5 కోట్లను విరాళంగా అందించారు.
తాజా వార్తలు (Latest News)
-
గవర్నర్ను కలిసిన సీఎం రేవంత్.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం..
-
వైఎస్సార్ జిల్లాలో పోలీసుల తనిఖీలు.. కారులో తరలిస్తున్న రూ.1.5 కోట్లు స్వాధీనం
-
బుజ్జి అండ్ భైరవ.. యానిమేటెడ్ సిరీస్ ఎలా ఉంది?
-
శాంపిళ్లు మార్చినట్లు ఆరోపణలు..పుణె కారు ప్రమాద ఘటనలో బాలుడి తల్లి అరెస్టు
-
అప్పుడు వర్కౌట్ కాలేదు.. ఈసారైనా సీనియర్లు ముందుండాలి: మంజ్రేకర్
-
అమ్మతోడు ఆ రోజు నేను లేను.. తొడగొట్టినోళ్లు హడలెత్తుతున్నారు