Gujarat: అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష
గుజరాత్లోని అహ్మదాబాద్లో 2008లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో మొత్తం 38 మంది దోషులకు ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మరో 11 మందికి యావజ్జీవ కారాగార
మరో 11 మందికి యావజ్జీవం
ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు
దేశంలో ఇంత మందికి మరణశిక్ష ఇదే మొదటిసారి
బాధిత కుటుంబాల హర్షం
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో 2008లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో మొత్తం 38 మంది దోషులకు ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. సుమారు 13 ఏళ్ల విచారణ అనంతరం శుక్రవారం ఈ సంచలన తీర్పును వెలువరించింది. దేశంలో ఒక న్యాయస్థానం ఒకేసారి ఇంతమందికి మరణ దండన విధించడం ఇదే తొలిసారి! ఇంతకుముందు 1998లో తమిళనాడులోని టాడా కోర్టు రాజీవ్గాంధీ హత్యకేసులో గరిష్ఠంగా 26 మందికి మరణశిక్ష విధించింది. 2008, జులై 26న... అహ్మదాబాద్ నగరంలో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. 70 నిమిషాల వ్యవధిలోనే 21 బాంబు పేలుళ్లతో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనల్లో మొత్తం 56 మంది ప్రాణాలు కోల్పోగా,
200 మందికి పైగా గాయపడ్డారు. యావద్దేశాన్ని తీవ్రంగా కలచివేసిన ఈ పేలుళ్లపై అహ్మదాబాద్, సూరత్లలో మొత్తం 35 కేసులు నమోదయ్యాయి. ప్రత్యేక న్యాయస్థానం వీటన్నింటినీ కలిపి విచారణ ప్రారంభించింది. మొత్తం 78 మందిపై అభియోగాలు నమోదుకాగా, వీరిలో ఓ వ్యక్తి అప్రూవర్గా మారాడు. మిగతా 77 మందిపై 2009లో విచారణ ఆరంభమైంది. మొత్తం 1,171 మంది సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను నమోదు చేసిన న్యాయస్థానం... ఈ నెల 8న 49 మందిని దోషులుగా తేల్చింది. మరో 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ క్రమంలోనే, ప్రత్యేక న్యాయమూర్తి ఎ.ఆర్.పటేల్ శుక్రవారం దోషులకు శిక్షను ఖరారుచేస్తూ తీర్పు వెలువరించారు. 38 మందికి మరణ దండన, 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. దోషుల్లో 48 మందికి రూ.2.85 లక్షలు, ఒకరికి రూ.2.88 లక్షల చొప్పున జరిమానా విధించారు. హత్య, నేరపూరిత కుట్ర, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం వంటి అభియోగాల కింద ఈ శిక్షలను ఖరారు చేశారు.
మృతుల కుటుంబాలకు రూ.లక్ష
పేలుళ్లలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.లక్ష, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు. తీర్పు వెలువరిస్తున్న సమయంలో... దోషులంతా అహ్మదాబాద్లోని సబర్మతి కేంద్ర కారాగారం, దిల్లీలోని తిహార్ జైలుతో పాటు భోపాల్, గయ, బెంగళూరు, కేరళ, ముంబయి జైళ్ల నుంచి వీడియో ద్వారా విచారణకు హాజరయ్యారు.
ఇంకా నలుగురిపై అభియోగాలు
వరుస పేలుళ్ల కేసును గుజరాత్ పోలీసు విభాగం, ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్తంగా ఛేదించాయి. రాజస్థాన్, దిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక పోలీసులు కూడా దర్యాప్తులో సహకరించారు. ఈ కేసులో మరో నలుగురిపైనా ఆరోపణలు నమోదైనా, ఇంకా విచారణ ప్రారంభం కాలేదని ప్రభుత్వ సీనియర్ న్యాయవాది తెలిపారు. వరుస బాంబు పేలుళ్లపై తొలుత విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ త్రివేది... ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. తీర్పు వెలువరించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎ.ఆర్.పాటిల్ 2017 జులై 14 నుంచి వాదనలు వింటూ వచ్చారు.
మోదీని కూడా చంపాలనుకున్నారు...
అహ్మదాబాద్లో వరుస బాంబు పేలుళ్లు చేపట్టడంతో పాటు... నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని కూడా హతమార్చాలని కుట్రదారులు ప్రణాళికలు వేసినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుధీర్ బ్రహ్మభట్ చెప్పారు. కేసు దర్యాప్తు సందర్భంగా ఓ నిందితుడు ఈ విషయాన్ని వెల్లడించినట్టు పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారని ఆయన వివరించారు. సదరు వ్యక్తిని న్యాయస్థానం దోషిగా తేల్చి, శిక్ష విధించిందన్నారు.
ప్రతీకారేచ్ఛతోనే..
2002-గోద్రా రైలు దుర్ఘటన అనంతర అల్లర్లలో వెయ్యి మందికి పైగా మృతిచెందారు. ప్రతీకారంగా నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ అహ్మదాబాద్లో బాంబు పేలుళ్లకు కుట్రపన్నింది. దీనిలోమధ్యప్రదేశ్కు చెందిన సఫ్దర్ నగోరి, కుమరుద్దీన్ నగోరి, గుజరాత్కు చెందిన ఖయూముద్దీన్ కపాడియా, జాహిద్ షేక్, షంషుద్దీన్ షేక్ కీలకపాత్ర పోషించారు. సఫ్దర్, జాహిద్లు పేలుడు పదార్థాల కొనుగోలుకు నిధులు సేకరించినట్టు ఆధారాలు లభించాయి.
స్వాగతించిన బాధిత కుటుంబాలు
పేలుళ్లలో మృతిచెందినవారి కుటుంబ సభ్యులు ఈ తీర్పును స్వాగతించారు. ‘‘ఈ సమయం కోసమే మా అమ్మ, నేను 13 ఏళ్లుగా నిరీక్షించాం. 38 మందికి మరణశిక్ష విధించడం ఆనందం కలిగించింది. మిగతా దోషులకూ ఇదే శిక్షను ఖరారుచేసి ఉంటే బావుండేది’’ అని ఈ దుర్ఘటనలో తండ్రిని, సోదరుడిని కోల్పోయి... తాను కూడా తీవ్రంగా గాయపడిన యశ్ వ్యాస్ పేర్కొన్నాడు. అతని తండ్రి దుష్యంత్ వ్యాస్ ఓ క్యాన్సర్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్. కుమారులిద్దరికి సైకిల్ తొక్కడం నేర్పిద్దామని సాయంత్రం వారిని సరదాగా బయటకు తీసుకువెళ్లగా... పేలుళ్లు సంభవించాయి! ఆ ధాటికి దుష్యంత్తో పాటు యశ్ సోదరుడు కూడా మృతిచెందారు. 50% కాలిన గాయాలతో యశ్ చాలా నెలలు ఐసీయూలోనే చికిత్స పొందాల్సి వచ్చింది. తొమ్మిదేళ్ల వయసులో ఇంతటి ఘోరాన్ని చూసిన యశ్... ఇప్పుడు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. భారీ పేలుడు కారణంగా పాక్షికంగా వినికిడి శక్తిని కోల్పోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. హెచ్ఎస్బీసీ, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే విశాఖను వదిలి వెళ్లిపోయాయి. -
ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు
వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. -
జగన్ పంతం.. జలయజ్ఞ విధ్వంసం!
తడిచెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. ‘కాలువ నీరెప్పుడు వస్తుందంటే చెప్పరు.. ఈ కష్టాల సాగు మావల్ల కాదు’ అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు. -
జగన్ జమానాలో.. ఆశా ‘నిరాశై’..!
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. -
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోకుండా చేశారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
ఆంధ్రా పారిస్లో అ‘న్న’న్నా!
‘నాకు మంచి స్నేహితుడు’ అని ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రజాప్రతినిధిని ఇటీవల ఓ సభలో ప్రజలకు పరిచయం చేశారు. -
అత్యవసర వాహనానికి ఆపద!
తిరుపతి నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న ఓ 108 వాహనం బుధవారం ఉదయం ఇలా నడిరోడ్డుమీదే ఆగిపోయింది. -
21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో బుధవారం 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 118 మండలాల్లో వడగాలులు వీచాయి. 21 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
విజ్ఞతతో ఓటేద్దాం.. అభివృద్ధికి బాటేద్దాం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోస్టుమ్యాన్ పురుష్తోతం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. -
మద్యం ఆదాయం.. ఐదేళ్లలో నాలుగు రెట్లు!
‘రాష్ట్రానికి ఏటా సుమారు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులో రూ.72వేల కోట్లు జీఎస్టీ, వ్యాట్, రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది. -
నేరచరిత్ర, ఆస్తుల వివరాలను అభ్యర్థులు ప్రకటించుకోవాల్సిందే
సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలను స్వతంత్రంగా పత్రికల్లో ప్రచురించుకోవాలని, ఆయా పార్టీల వెబ్సైట్లో వివరాలను ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
పంచాయతీ భవనంలో మద్యం నిల్వలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏకంగా పంచాయతీ భవనంలోనే మద్యం నిల్వలు దాచిపెట్టిన ఉదంతం కలకలం రేపింది. -
రూ.80 లక్షల విలువైన మద్యం ధ్వంసం
ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. -
చందనోత్సవం వేళ.. సింహాచలం డీసీకి కమిషనరేట్లో బాధ్యతలు
సింహాచలంలో ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. గతేడాది ఇదే చందనోత్సవంలో అధికార యంత్రాంగం విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
హోంగార్డుల వేతనాల్లో కోతపై గగ్గోలు
తమిళనాడులో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డుల వేతనాల్లో కోత పడింది. బుధవారం ఖాతాల్లో పడిన వేతనం చూసి వారు హతాశులయ్యారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
-
సినీ నటుడు వెంకటేశ్ కూతురి ప్రచారం
-
హైదరాబాద్లో అభ్యర్థులకు ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయింపు
-
నీ పేరు పెట్టావ్.. ఒట్టు తీసి గట్టున పెట్టావ్
-
సన్ పిక్చర్స్కు ఇళయరాజా నోటీసు
-
ఏమైనా ఇచ్చేస్తాం.. ఎంతైనా కొనేస్తాం!.. ఓట్ల కొనుగోలుకు బరితెగించిన వైకాపా