BS 6 2.0: ఏప్రిల్ నుంచి అమల్లోకి బీఎస్ 6 కొత్త నిబంధనలు.. ఏమేం మారుతాయ్!
ఏప్రిల్ నుంచి కేంద్రం బీఎస్ 6 రెండో దశ (BS 6 2.0)ను అమలు చేయనుంది. ఇందులో భాగంగా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మరి, ఇవి వాహనాలు కొనుగోలు చేసే వారిపై, ఆటోమొబైల్ (Automobile) సంస్థలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే వివరాలు.
దిల్లీ: వాహనాలు విడుదల చేసే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు రెండేళ్ల క్రితం బీఎస్ 6 ప్రమాణాలను ప్రభుత్వం అమలుచేసింది. ఆ సమయంలో బీఎస్ 4 వాహనాలను చౌకగా విక్రయించిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా కేంద్రం ఏప్రిల్ నుంచి బీఎస్ 6 రెండో దశ (BS 6 Phase II)ను అమలు చేయనుంది. బీఎస్ 6 2.0గా పిలిచే ఈ దశలో ఆటోమొబైల్ తయారీ కంపెనీలు రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) ప్రమాణాలను తప్పక పాటించాలి. ఇంతకీ ఆర్డీఈ అంటే ఏంటి? ఈ ప్రమాణాలను కారు, బైక్ తయారీ సంస్థలు ఎందుకు పాటించాలి? వీటి వల్ల పర్యావరణం, వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? వీటి గురించి పూర్తి వివరాలు.
భారత్ స్టేజ్ అంటే?
వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలతో వాయుకాలుష్యం పెరగకుండా యూరో ఎమిషన్ ప్రమాణాల ఆధారంగా 2000లో భారత్ తొలిసారి భారత్ స్టేజ్ 1 (BS-I) ప్రమాణాలను పరిచయం చేసింది. వీటిని కేంద్ర కాలుష్య నియంత్రన మండలి (CPCB) రూపొందించింది. తర్వాత వాటిని బీఎస్-II, బీఎస్ -III, బీఎస్-IVగా అప్గ్రేడ్ చేస్తూ వచ్చింది. 2020లో కేంద్రం బీఎస్ 6 ప్రమాణాలను ప్రవేశపెట్టింది. వీటి ప్రకారం వాహనాలు విడుదల చేసే కార్బన్డైయాక్సైడ్ (CO2), కార్బన్ మోనాక్సైడ్ (CO), హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి ఉద్గారాలు పరిమితిని దాటకూడదు. ఇందులో భాగంగా కార్ల తయారీ కంపెనీలు వాహనాలు విక్రయించే ముందు వాటిని ఉద్గారాల విడుదలను ప్రయోగశాలల్లో పరీక్షించాలి. బీఎస్ 6 ప్రమాణాలకు అనువుగా ఉంటేనే సదరు వాహనాన్ని విక్రయించాలి.
బీఎస్ 6 రెండో దశ-ఆర్డీఈ
బీఎస్ 6 రెండో దశలో ఈ ప్రమాణాలను మరింత కఠినతరం చేశారు. దీనివల్ల వాహనాలు విడుదల చేసే ఉద్గారాలు నిర్దేశిత పరిమితిని మించి ఉండకూడదు. దీంతో ఇప్పటి వరకు వాహన ఉద్గారాల పరిమితిని లేబోరేటరీలో పరీక్షించిన ఆటోమొబైల్ సంస్థలు, దాంతోపాటు ఆర్డీఈ ప్రమాణాలను తప్పక పాటించాలి. అంటే లేబోరేటరీ పరీక్షల అనంతరం కారును విక్రయించిన తర్వాత, అది విడుదల చేసే ఉద్గారాలను మరింత తగ్గించేందుకు పోర్టబుల్ ఎమిషన్స్ మెజర్మెంట్ సిస్టమ్ (PEMS)ను అన్ని వాహనాల్లో బిగించాలి. డీజిల్ వాహనాల్లో సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్ (SCR) అనే డివైజ్ అదనంగా ఉండాలి. ఇది డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ను ఉపయోగించి నైట్రోజెన్ ఆక్సైడ్లోని ఉద్గారాలను నీరుగా మార్చి విడుదల చేస్తుంది.
ఈ వివరాలన్నింటినీ ఎప్పటికప్పడు కారు నడిపే వ్యక్తికి తెలియజేసేందుకు ఆన్బోర్డ్ సెల్ఫ్-డయాగ్నస్టిక్ డివైజ్ (OBD)ను ఆటోమొబైల్ సంస్థలు అన్ని కార్లలో ఇవ్వాలి. ఇది కర్బన ఉద్గారాల విడుదలకు సంబంధించిన సమాచారంతోపాటు, కారు నడిపే విధానంలో జరిగే మార్పులు, ట్రాఫిక్ పరిస్థితులు వంటి వాటిని పర్యవేక్షిస్తూ ఆ సమాచారాన్ని కారు నడిపే వ్యక్తికి తెలియజేస్తుంది. ఒకవేళ ఉద్గారాల విడుదల నిర్దిష్ట పరిమితిని దాటినట్లు గుర్తిస్తే వెంటనే సర్వీస్ చేయించమని సూచిస్తుంది. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని కేంద్రం ఆశిస్తోంది.
డీజిల్ వాహనాల పరిస్థితేంటి?
ఆర్డీఈ ప్రమాణాల ప్రకారం కార్లను తయారు చేయడం ఆటోమొబైల్ సంస్థలకు వ్యయంతో కూడుకున్న వ్యవహారం. దీనివల్ల కంపెనీలు కార్ల ధరలను తప్పక పెంచాల్సిన పరిస్థితి. దాంతో మోడల్, ఫీచర్ల ఆధారంగా కొనుగోలుదారుడు సుమారు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే మెర్సిడెజ్, హ్యుందాయ్, టాటా సంస్థలు బీఎస్ 6 రెండో దశ ప్రమాణాలతో వాహనాలను మార్కెట్లోకి విడుదల చేశాయి.
మరోవైపు డీజిల్ కార్లలో 2.0 లీటర్ల ఇంజిన్, అంతకన్నా తక్కువ సామర్థ్యం కలిగిన వాహనాలకు అధిక ధర కలిగిన ఈ డివైజ్లను బిగించడం ఆటోమొబైల్ సంస్థలకు గిట్టుబాటు కాదనీ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే పలు కంపెనీలు 2.0 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం కలిగిన కార్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
ఈ జాబితాలో హోండా, హ్యుందాయ్, రెనాల్ట్, మారుతీ సుజుకీ, మహీంద్రా కంపెనీల కొన్ని మోడల్స్ ఉన్నాయి. వీటిలో ఎంట్రీ లెవల్ పెట్రోల్ మోడల్స్ కూడా ఉండటం గమనార్హం. ఏయే మోడల్స్ విక్రయాలు నిలిచిపోతాయే దానిపై పూర్తి స్పష్టత రానప్పటికీ.. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. మారుతీ సుజుకీ ఆల్టో, సియాజ్,ఇగ్నిస్ - హ్యుందాయ్ ఐ20, ఐ10 నియోస్, ఆరా - మహీంద్రా అల్టురాస్ జీ4 - స్కోడా ఆక్టేవియా, సూపర్బ్ - హోండా అమేజ్, సిటీ ఐదో జనరేషన్ - రెనో క్విడ్ 800 సీసీ, టయోటా ఇన్నోవా క్రిస్టా - నిస్సాన్ కిక్స్లు ఈ జాబితాలో ఉన్నాయి.
ద్విచక్రవాహనాల మాటేంటి?
టూవీలర్ కంపెనీలు సైతం బీఎస్ 6 రెండో దశ ప్రమాణాలను తప్పక పాటించాలి. ఇందులో భాగంగా ప్రస్తుతం బైక్లలో ఉపయోగిస్తున్న కార్బొరేటర్ల స్థానంలో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్(FIS)ను ఉపయోగించడంతోపాటు ఓబీడీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కార్బొరేటర్లతో పోలిస్తే ఎఫ్ఐఎస్ల ధర అధికం. దీంతో బైక్ల ధరలు కనీసం 10 శాతం పెరుగుతాయని మార్కెట్ వర్గాల అంచనా. తాజాగా హీరో మోటార్ ధరలను పెంచింది. ఇప్పటికే బీఎస్ 6 ప్రమాణాల కారణంగా బైక్ల ధరలు గణనీయంగా పెరిగాయి. గతంలో బీఎస్ 4 నుంచి బీఎస్ 6కు మారేందుకు కేంద్రం గడువును పెంచక పోవడంతో పలు కంపెనీలు తమ బీఎస్ 4 మోడళ్లను తక్కువ ధరకే విక్రయించాయి. ఆ సమయంలో కొన్ని కంపెనీలు నష్టాలను చవిచూశాయి. తాజాగా బీఎస్ 6 రెండో దశ ప్రమాణాలతో క్రమంగా పెట్రోల్ ఆధారిత బైక్లకు డిమాండ్ తగ్గిపోయే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
₹14.9 లక్షల బీఎండబ్ల్యూ స్కూటర్.. ఈ విశేషాలు తెలుసా?
BMW CE 04: జర్మనీకి చెందిన ప్రీమియం వాహనాల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత్లో తొలి విద్యుత్ స్కూటర్ను విడుదల చేసింది. దీంట్లోని విశేషాలేంటో చూద్దాం. -
బీఎండబ్ల్యూ నుంచి కొత్త కార్లు
జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ బుధవారం దేశీయ విపణిలోకి కొత్త కార్లను పరిచయం చేసింది. ఆల్-న్యూ 5 సిరీస్ లాంగ్ వీల్బేస్ ప్రారంభ ధర రూ.72.9 లక్షలుగా ఉంది. -
భారత్లో ఎక్స్-ట్రైల్ ఎస్యూవీని ఆవిష్కరించిన నిస్సాన్
Nissan X-Trail: నిస్సాన్ తమ ఎక్స్-ట్రైల్లో కొత్త వెర్షన్ను భారత్లో విడుదల చేయనుంది. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి గెరిల్లా 450.. ధర, ఫీచర్లు ఇవే..!
Royal Enfield Guerrilla 450: రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ కొత్త మోటార్ సైకిల్ గెరిల్లా 450ని లాంచ్ చేసింది. దీని ధర రూ.2.39 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
బజాజ్ బాటలో టీవీఎస్.. త్వరలో CNG స్కూటర్..?
TVS CNG scooter: టీవీఎస్ సంస్థ సీఎన్జీ ఆప్షన్తో ఓ స్కూటర్ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇది 2025 తొలి అర్ధభాగంలో వచ్చే అవకాశం ఉంది. -
ఎస్యూవీలపై టాటా, మహీంద్రా బిగ్ డిస్కౌంట్
Tata motors- Mahindra price cut: ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలైన టాటా, మహీంద్రా తమ ఎస్యూవీల ధరలను తగ్గించాయి. -
మహీంద్రా ఎక్స్యూవీ 700పై ₹2 లక్షల వరకు తగ్గింపు
Mahindra XUV700: మూడో వార్షికోత్సవం సందర్భంగా ఎక్స్యూవీ 700పై మహీంద్రా అండ్ మహీంద్రా డిస్కౌంట్ ప్రకటించింది. -
హైబ్రిడ్ వాహనాలపై ఆ రాష్ట్రం గుడ్ న్యూస్.. రోడ్డు ట్యాక్స్ మాఫీ
Hybrid Vehicles: హైబ్రిడ్ వాహనాలపై 100శాతం రోడ్డు ట్యాక్స్ను మాఫీ చేస్తూ యూపీ ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. దీంతో అక్కడ ఈ కార్ల ధరలు దాదాపు రూ.3లక్షల వరకు తగ్గనున్నాయి. -
త్వరలో సీఎన్జీ ఆటో ట్యాక్సీ.. ప్రకటించిన బజాజ్ ఆటో
Bajaj Auto: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ సీఎన్జీతో పనిచేసే తొలి ఆటో ట్యాక్సీని త్వరలోనే తీసుకురానున్నట్లు ప్రకటించింది. -
ప్రపంచంలోనే తొలి CNG బైక్ వచ్చేసింది.. ధర, ఇతర వివరాలు ఇవే..!
Bajaj CNG Bike: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ను బజాజ్ ఆటో ఆవిష్కరించింది. మూడు వేరియంట్లలో ఈ బైక్ లభిస్తుంది. -
ట్రయంఫ్ స్పీడ్, స్క్రాంబ్లర్ మోటార్ సైకిళ్లపై డిస్కౌంట్
Triumph Motorcycles: ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్.. బైక్లపై ట్రయంఫ్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. -
బజాజ్ నుంచి సీఎన్జీ బైక్.. రిలీజ్కు ముందే వివరాలు లీక్!
Bajaj CNG Bike: బజాజ్ సీఎన్జీ బైక్ జులై 5న విడుదల కానుంది. ఈనేపథ్యంలో కొన్ని వివరాలు బయటకొచ్చాయి. -
జూన్లో తగ్గిన ఈవీ విక్రయాలు.. కారణం ఇదేనా..?
EV sales: దేశంలో జూన్ నెలలో విద్యుత్ వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. -
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
Social Media: ఏటా జూన్ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. -
రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీగా మరో బైక్.. ఇండియాకు రానున్న బ్రిటీష్ బ్రాండ్
దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్కు గట్టి పోటీనిచ్చేందుకు మరో అంతర్జాతీయ కంపెనీ దేశంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. -
హీరో మోటోకార్ప్ వాహన ధరలు పెంపు.. 1 నుంచి కొత్త ధరలు
Hero MotoCorp: హీరో మోటోకార్ప్ వాహన ధరలు పెరగనున్నాయి. సవరించిన ధరలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
జులై నుంచి టాటా వాహనాల ధరలు పెంపు
Tata Motors: జులై 1 నుంచి వాణిజ్య వాహనాల ధరల్ని పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. -
మహీంద్రా అదుర్స్.. దేశంలోనే రెండో అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీగా..
Mahindra & Mahindra: భారత్లోని అత్యంత విలువైన ఆటో మొబైల్ కంపెనీల స్థానంలో టాటా మెటార్స్ను వెనక్కి నెట్టి మహీంద్రా రెండో స్థానంలో నిలిచింది. -
పాత కారు కొంటున్నారా?
పాత కారు కొనాలని అనుకుంటున్నారా? దీనికోసం రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ కార్లకూ రుణం ఇస్తున్నాయి. కాకపోతే కొన్ని నిబంధనలను మనం అర్థం చేసుకోవాలి. -
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల రీకాల్.. కారణం ఇదే..
TVS Motor: టీవీఎస్ కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేసింది. 40వేల స్కూటర్లను వెనక్కి రప్పిస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..