BS 6 2.0: ఏప్రిల్ నుంచి అమల్లోకి బీఎస్ 6 కొత్త నిబంధనలు.. ఏమేం మారుతాయ్!
ఏప్రిల్ నుంచి కేంద్రం బీఎస్ 6 రెండో దశ (BS 6 2.0)ను అమలు చేయనుంది. ఇందులో భాగంగా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మరి, ఇవి వాహనాలు కొనుగోలు చేసే వారిపై, ఆటోమొబైల్ (Automobile) సంస్థలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే వివరాలు.
దిల్లీ: వాహనాలు విడుదల చేసే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు రెండేళ్ల క్రితం బీఎస్ 6 ప్రమాణాలను ప్రభుత్వం అమలుచేసింది. ఆ సమయంలో బీఎస్ 4 వాహనాలను చౌకగా విక్రయించిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా కేంద్రం ఏప్రిల్ నుంచి బీఎస్ 6 రెండో దశ (BS 6 Phase II)ను అమలు చేయనుంది. బీఎస్ 6 2.0గా పిలిచే ఈ దశలో ఆటోమొబైల్ తయారీ కంపెనీలు రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) ప్రమాణాలను తప్పక పాటించాలి. ఇంతకీ ఆర్డీఈ అంటే ఏంటి? ఈ ప్రమాణాలను కారు, బైక్ తయారీ సంస్థలు ఎందుకు పాటించాలి? వీటి వల్ల పర్యావరణం, వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? వీటి గురించి పూర్తి వివరాలు.
భారత్ స్టేజ్ అంటే?
వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలతో వాయుకాలుష్యం పెరగకుండా యూరో ఎమిషన్ ప్రమాణాల ఆధారంగా 2000లో భారత్ తొలిసారి భారత్ స్టేజ్ 1 (BS-I) ప్రమాణాలను పరిచయం చేసింది. వీటిని కేంద్ర కాలుష్య నియంత్రన మండలి (CPCB) రూపొందించింది. తర్వాత వాటిని బీఎస్-II, బీఎస్ -III, బీఎస్-IVగా అప్గ్రేడ్ చేస్తూ వచ్చింది. 2020లో కేంద్రం బీఎస్ 6 ప్రమాణాలను ప్రవేశపెట్టింది. వీటి ప్రకారం వాహనాలు విడుదల చేసే కార్బన్డైయాక్సైడ్ (CO2), కార్బన్ మోనాక్సైడ్ (CO), హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి ఉద్గారాలు పరిమితిని దాటకూడదు. ఇందులో భాగంగా కార్ల తయారీ కంపెనీలు వాహనాలు విక్రయించే ముందు వాటిని ఉద్గారాల విడుదలను ప్రయోగశాలల్లో పరీక్షించాలి. బీఎస్ 6 ప్రమాణాలకు అనువుగా ఉంటేనే సదరు వాహనాన్ని విక్రయించాలి.
బీఎస్ 6 రెండో దశ-ఆర్డీఈ
బీఎస్ 6 రెండో దశలో ఈ ప్రమాణాలను మరింత కఠినతరం చేశారు. దీనివల్ల వాహనాలు విడుదల చేసే ఉద్గారాలు నిర్దేశిత పరిమితిని మించి ఉండకూడదు. దీంతో ఇప్పటి వరకు వాహన ఉద్గారాల పరిమితిని లేబోరేటరీలో పరీక్షించిన ఆటోమొబైల్ సంస్థలు, దాంతోపాటు ఆర్డీఈ ప్రమాణాలను తప్పక పాటించాలి. అంటే లేబోరేటరీ పరీక్షల అనంతరం కారును విక్రయించిన తర్వాత, అది విడుదల చేసే ఉద్గారాలను మరింత తగ్గించేందుకు పోర్టబుల్ ఎమిషన్స్ మెజర్మెంట్ సిస్టమ్ (PEMS)ను అన్ని వాహనాల్లో బిగించాలి. డీజిల్ వాహనాల్లో సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్ (SCR) అనే డివైజ్ అదనంగా ఉండాలి. ఇది డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ను ఉపయోగించి నైట్రోజెన్ ఆక్సైడ్లోని ఉద్గారాలను నీరుగా మార్చి విడుదల చేస్తుంది.
ఈ వివరాలన్నింటినీ ఎప్పటికప్పడు కారు నడిపే వ్యక్తికి తెలియజేసేందుకు ఆన్బోర్డ్ సెల్ఫ్-డయాగ్నస్టిక్ డివైజ్ (OBD)ను ఆటోమొబైల్ సంస్థలు అన్ని కార్లలో ఇవ్వాలి. ఇది కర్బన ఉద్గారాల విడుదలకు సంబంధించిన సమాచారంతోపాటు, కారు నడిపే విధానంలో జరిగే మార్పులు, ట్రాఫిక్ పరిస్థితులు వంటి వాటిని పర్యవేక్షిస్తూ ఆ సమాచారాన్ని కారు నడిపే వ్యక్తికి తెలియజేస్తుంది. ఒకవేళ ఉద్గారాల విడుదల నిర్దిష్ట పరిమితిని దాటినట్లు గుర్తిస్తే వెంటనే సర్వీస్ చేయించమని సూచిస్తుంది. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని కేంద్రం ఆశిస్తోంది.
డీజిల్ వాహనాల పరిస్థితేంటి?
ఆర్డీఈ ప్రమాణాల ప్రకారం కార్లను తయారు చేయడం ఆటోమొబైల్ సంస్థలకు వ్యయంతో కూడుకున్న వ్యవహారం. దీనివల్ల కంపెనీలు కార్ల ధరలను తప్పక పెంచాల్సిన పరిస్థితి. దాంతో మోడల్, ఫీచర్ల ఆధారంగా కొనుగోలుదారుడు సుమారు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే మెర్సిడెజ్, హ్యుందాయ్, టాటా సంస్థలు బీఎస్ 6 రెండో దశ ప్రమాణాలతో వాహనాలను మార్కెట్లోకి విడుదల చేశాయి.
మరోవైపు డీజిల్ కార్లలో 2.0 లీటర్ల ఇంజిన్, అంతకన్నా తక్కువ సామర్థ్యం కలిగిన వాహనాలకు అధిక ధర కలిగిన ఈ డివైజ్లను బిగించడం ఆటోమొబైల్ సంస్థలకు గిట్టుబాటు కాదనీ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే పలు కంపెనీలు 2.0 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం కలిగిన కార్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
ఈ జాబితాలో హోండా, హ్యుందాయ్, రెనాల్ట్, మారుతీ సుజుకీ, మహీంద్రా కంపెనీల కొన్ని మోడల్స్ ఉన్నాయి. వీటిలో ఎంట్రీ లెవల్ పెట్రోల్ మోడల్స్ కూడా ఉండటం గమనార్హం. ఏయే మోడల్స్ విక్రయాలు నిలిచిపోతాయే దానిపై పూర్తి స్పష్టత రానప్పటికీ.. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. మారుతీ సుజుకీ ఆల్టో, సియాజ్,ఇగ్నిస్ - హ్యుందాయ్ ఐ20, ఐ10 నియోస్, ఆరా - మహీంద్రా అల్టురాస్ జీ4 - స్కోడా ఆక్టేవియా, సూపర్బ్ - హోండా అమేజ్, సిటీ ఐదో జనరేషన్ - రెనో క్విడ్ 800 సీసీ, టయోటా ఇన్నోవా క్రిస్టా - నిస్సాన్ కిక్స్లు ఈ జాబితాలో ఉన్నాయి.
ద్విచక్రవాహనాల మాటేంటి?
టూవీలర్ కంపెనీలు సైతం బీఎస్ 6 రెండో దశ ప్రమాణాలను తప్పక పాటించాలి. ఇందులో భాగంగా ప్రస్తుతం బైక్లలో ఉపయోగిస్తున్న కార్బొరేటర్ల స్థానంలో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్(FIS)ను ఉపయోగించడంతోపాటు ఓబీడీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కార్బొరేటర్లతో పోలిస్తే ఎఫ్ఐఎస్ల ధర అధికం. దీంతో బైక్ల ధరలు కనీసం 10 శాతం పెరుగుతాయని మార్కెట్ వర్గాల అంచనా. తాజాగా హీరో మోటార్ ధరలను పెంచింది. ఇప్పటికే బీఎస్ 6 ప్రమాణాల కారణంగా బైక్ల ధరలు గణనీయంగా పెరిగాయి. గతంలో బీఎస్ 4 నుంచి బీఎస్ 6కు మారేందుకు కేంద్రం గడువును పెంచక పోవడంతో పలు కంపెనీలు తమ బీఎస్ 4 మోడళ్లను తక్కువ ధరకే విక్రయించాయి. ఆ సమయంలో కొన్ని కంపెనీలు నష్టాలను చవిచూశాయి. తాజాగా బీఎస్ 6 రెండో దశ ప్రమాణాలతో క్రమంగా పెట్రోల్ ఆధారిత బైక్లకు డిమాండ్ తగ్గిపోయే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు. -
Kia India: ఏప్రిల్ నుంచి కియా వాహనాల ధరల పెంపు
Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం. -
Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!
చైనాలో మరో టెక్ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్