మహీంద్రా థార్‌ ఎర్త్‌ ఎడిషన్‌

సరికొత్త డిజైన్‌, ప్రీమియం ఫీచర్లతో థార్‌ ఎర్త్‌ ఎడిషన్‌ను మహీంద్రా ఆవిష్కరించింది. పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్లతో, కావాల్సిన యాక్సెసరీస్‌తో ఈ కార్లను కొనుగోలు చేసుకోవచ్చు.

Updated : 29 Feb 2024 10:07 IST

ప్రారంభ ధర రూ.15.40 లక్షలు

దిల్లీ: సరికొత్త డిజైన్‌, ప్రీమియం ఫీచర్లతో థార్‌ ఎర్త్‌ ఎడిషన్‌ను మహీంద్రా ఆవిష్కరించింది. పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్లతో, కావాల్సిన యాక్సెసరీస్‌తో ఈ కార్లను కొనుగోలు చేసుకోవచ్చు. ప్రారంభ ధర రూ.15.40 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌ ధర). ఎర్త్‌ ఎడిషన్‌ పెట్రోల్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ (ఎంటీ) ధర రూ.15.40 లక్షలు కాగా, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ (ఏటీ) వేరియంట్‌ రూ.16.99 లక్షలుగా ఉంది. డీజిల్‌ ఎంటీ ధర రూ.16.15 లక్షలు కాగా, ఏటీ ధర రూ.17.40 లక్షలుగా ఉంది. వినియోగదార్లు మరిన్ని యాక్సెసరీలను ఎంపిక చేసుకోవచ్చని, వాటి ఆధారంగా ధర ఉంటుందని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని