మిస్సింగ్ కేసులపై ఆందోళన వద్దు:సజ్జనార్
హైదరాబాద్లో మిస్సింగ్ కేసులపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. ఈ కేసుల గురించి మాట్లాడుతూ..చాలామంది
ఇంటర్నెట్ డెస్క్ : హైదరాబాద్లో మిస్సింగ్ కేసులపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. ఈ కేసుల గురించి మాట్లాడుతూ.. చాలామంది వ్యక్తిగత సమస్యల కారణంగానే ఇంట్లోంచి వెళ్లిపోతున్నట్లు వివరించారు. వ్యవస్థీకృత పద్ధతిలో ఏమీ జరగటం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి మిస్సింగ్ కేసును సవాల్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, సరికొత్త పద్ధతులు అవలంబిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో.. దర్పణ్ అనే సాఫ్ట్వేర్ అప్లికేషన్, ఆపరేషన్ స్మైల్ వంటివి ఈ రకమైన కేసులను పరిష్కరించటంలో ఎంతో తోడ్పాటునందిస్తున్నట్లు చెప్పారు.
‘‘ప్రతి మిస్సింగ్ కేసునూ ఓ సవాల్గా స్వీకరిస్తున్నాం. ప్రతి కేసులోనూ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం. మనం రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థ మరెక్కడా లేదు. అవసరమైతే టాస్క్ఫోర్స్, ఎస్వోటీ, క్రైం వారిని కూడా ఉపయోగించుకుంటున్నాం. తల్లిదండ్రులు తిట్టారని, అప్పుల బాధ తాళలేక, ఇతరత్రా సమస్యలతో ఇల్లు విడిచి వెళ్లిపోయిన కేసులు చాలా ఉంటున్నాయి. ఇటీవల ఇలాంటి కేసులనూ చాలా పరిష్కరించాం ’’ అని సీపీ వివరించారు.
ఇంట్లోంచి వెళ్లిపోవటం పరిష్కారం కాదు...
‘‘ముఖ్యంగా నేను చెప్తున్నదొకటే. ఈ రోజు...మనం ఈ స్థితిలో ఉన్నామంటే అందుకు తల్లిదండ్రులే కారణం. ఎన్నో కష్టాలకు ఓర్చి చదివిస్తారు. ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటారు. కోపంతో ఏదైనా మాట అంటే బాధపడొద్దు. వారు మీ మంచి కోసమే తిడతారు. మీకు చెడు జరగాలని ఎప్పుడూ అనుకోరు. వారికి మీరే ప్రపంచం. మీరు కనిపించకుండా పోతే వారు తట్టుకోలేరు. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. సమస్యలు ఉన్నప్పుడు పరిష్కరించుకోవటానికి ప్రయత్నించాలి. కానీ...ఇంట్లోంచి వెళ్లిపోవటం సరికాదు. అలా వెళ్లటం వల్ల సమస్యలకు పరిష్కారం దొరకదు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఉన్న సమస్యల గురించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి’’ అని సజ్జనార్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!