Andhra News: పెళ్లి ఇష్టం లేకనే కాబోయే వరుడిపై కత్తితో దాడి: అనకాపల్లి డీఎస్పీ
పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే కాబోయే వరుడిపై యువతి కత్తితో దాడి చేసినట్లు అనకాపల్లి డీఎస్పీ సునీల్ వెల్లడించారు.
బుచ్చయ్యపేట: పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే కాబోయే వరుడిపై యువతి కత్తితో దాడి చేసినట్లు అనకాపల్లి డీఎస్పీ సునీల్ వెల్లడించారు. గిఫ్ట్ ఇస్తానంటూ కళ్లకు గంతలు కట్టి అనకాపల్లి జిల్లాలో కాబోయేవాడి కంఠం కోసిన ఘటన సోమవారం కలకలం రేగిన విషయం తెలిసిందే. యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన యువతి పుష్పను ఇవాళ అనకాపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో కత్తితో దాడి చేసింది తానేనని యువతి ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను అనకాపల్లి ఎస్ఐ రామకృష్ణతో కలిసి డీఎస్పీ సునీల్ మీడియాకు వివరించారు. పుష్పను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు చెప్పారు.
డీఎస్పీ మాట్లాడుతూ.. ‘‘రామునాయుడు, పుష్పకు మే 20న వివాహం నిశ్చయించారు. అమ్మాయి, అబ్బాయి కలిసి సోమవారం స్కూటీపై బయటకి వెళ్లారు. తల్లిదండ్రుల అనుమతితోనే ఇద్దరు బయటకి వెళ్లారు. వడ్డాది వద్ద స్కూటీ ఆపి గిఫ్ట్ కొంటానని పుష్ప షాప్లోకి వెళ్లింది. ఏం కొన్నావని అడిగితే అబ్బాయికి చెప్పలేదు. యువకుడిని విశ్వశాంతి జ్యోతిర్మయి ఆశ్రమం వద్దకు తీసుకెళ్లింది. బహుమతి ఇస్తాను.. కళ్లు మూసుకో అని అబ్బాయికి చెప్పింది. అబ్బాయి కళ్లు మూసుకుంటే సరిగ్గా మూసుకోలేదని కళ్లకు చున్నీ కట్టింది. చున్నీతో కట్టిన తర్వాత తనతో తీసుకొచ్చిన చాకుతో అబ్బాయి గొంతు కోసింది. పెళ్లి ఇష్టం లేకనే గొంతు కోసినట్లు అబ్బాయితో చెప్పింది. ఆత్మహత్య చేసుకుంటుందేమోనని యువతితో సహా రామునాయుడు బయలుదేరాడు. స్థానికులు గమనించి యువకుడిని ఆస్పత్రిలో చేర్చారు. ఎవరినీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని యువతి చెప్పింది. దైవ చింతనతో ఓంశాంతి ఆశ్రమంలో జీవితం గడపాలని యువతి భావిస్తోంది. పెళ్లి చేసుకోనంటే పెద్దలు ఒప్పుకోరేమోనని దాడి చేసినట్లు తెలిపింది. యువతిపై హత్యాయత్నం కేసు నమోదు చేశాం. ఈ కేసులో వేరే వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. హత్యాయత్నానికి యువతి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నాం’’ అని డీఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు