Siddipet: భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్య

సిద్దిపేట జిల్లా (Siddipet News) చిన్నకోడూర్‌ మండలం రామునిపట్ల గ్రామంలో దారుణం జరిగింది.

Updated : 15 Dec 2023 14:03 IST

చిన్నకోడూర్‌: సిద్దిపేట జిల్లా (Siddipet News) చిన్నకోడూర్‌ మండలం రామునిపట్ల గ్రామంలో దారుణం జరిగింది. భార్య, ఇద్దరు పిల్లలను చంపి..  కలెక్టర్‌ గన్‌మెన్‌ తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిద్దిపేట కలెక్టర్‌ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్ద గన్‌మెన్‌ ఆకుల నరేశ్‌(35).. ఆన్‌ డ్యూటీలో ఉండగానే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల వల్ల నరేశ్‌ అప్పుల ఊబిలోకి  కూరుకుపోయాడు. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ తారస్థాయికి చేరడంతో ఆగ్రహానికి గురైన నరేశ్‌.. పాఠశాలకు వెళ్లి పిల్లలను ఇంటికి తీసుకువచ్చాడు. ఆపై కుమారుడు రేవంత్(6), కుమార్తె రిషిత (5) సహా భార్య చైతన్య(30)ను తుపాకీతో కాల్చి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటనపై మీడియాతో సీపీ శ్వేత మాట్లాడారు. ‘‘సర్వీస్‌ రివాల్వర్‌తో కుటుంబ సభ్యులను నరేశ్‌ కాల్చి చంపాడు. నరేశ్‌కు అప్పులు ఉన్నట్లు ప్రాథమికంగా తెలిసింది. నరేశ్‌ ఆన్‌ డ్యూటీలో ఉండగానే ఈ ఘటన జరిగింది. నరేశ్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నాం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం’’ అని ఆమె వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని