బాలికలతో బలవంతంగా వ్యభిచారం
అంతర్ రాష్ట్ర వ్యభిచార రాకెట్తో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అరుణాచల్ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
ఈటానగర్లో డీఎస్పీ సహా 21 మంది అరెస్ట్
ఈటానగర్: అంతర్ రాష్ట్ర వ్యభిచార రాకెట్తో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అరుణాచల్ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. 10-15 ఏళ్లలోపు వయసున్న ఐదుగురు మైనర్లను రక్షించినట్లు బుధవారం వెల్లడించారు. అరెస్టయిన ప్రభుత్వ అధికారుల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ), డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కూడా ఉన్నారని తెలిపారు. ఈటానగర్లో బ్యూటీ పార్లర్ను నడుపుతున్న ఇద్దరు మహిళలు అస్సాంలోని ధేమాజీ నుంచి మైనర్లను అరుణాచల్ప్రదేశ్కు తీసుకొచ్చారని ఎస్పీ రోహిత్ రాజ్బీర్ సింగ్ తెలిపారు. చింపూలో మైనర్ బాలికలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ మే 4న వచ్చిన సమాచారం మేరకు పోలీసులు వరుస దాడులు నిర్వహించారు. పలువురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు బాధిత మైనర్లను రక్షించారు. ఉద్యోగాల పేరిట ధేమాజీ నుంచి తీసుకొచ్చిన తర్వాత తమను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టారని మైనర్లు వాపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్కు సమాచారం ఇచ్చారు. విచారణలో మరో ఇద్దరు మైనర్లు కూడా మహిళల అధీనంలో ఉన్నట్లు వెల్లడైంది. మరో బాలికను వేరే ప్రాంతానికి తరలించినట్లు గుర్తించారు. వీరందరినీ రక్షించి ప్రస్తుతానికి వసతి గృహానికి తరలించారు. వ్యభిచార గృహ నిర్వహణతో సంబంధం ఉన్న 10 మందిని, ఐదుగురు ప్రభుత్వ అధికారులు సహా 11 మంది విటులను పోలీసులు అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు నుంచి తెచ్చి.. హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా అరెస్టు
బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న ముఠాను బహుదూర్పురా పోలీసులతో కలిసి టీజీన్యాబ్ పోలీసులు అరెస్టు చేశారు. -
చెప్పుల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం.. రూ.50లక్షల ఆస్తి నష్టం
పురానీ హవేలీలోని ఎస్కే ఫుట్వేర్ షాప్లో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్ల తిరస్కరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. -
హైదరాబాద్ మోష్ పబ్లో మోసం చేసి.. నాగ్పూర్లో చిక్కిన నయా ముఠా
డేటింగ్ యాప్లతో అమ్మాయిలను ఎరగా వేసి కస్టమర్ల నుంచి అధిక బిల్లులు వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. -
కుటుంబ కలహాలతో కో-డైరెక్టర్ ఆత్మహత్య
కుటుంబ కలహాల కారణంగా సినీ కో-డైరెక్టర్, స్క్రిప్ట్రైటర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోరబండ పోలీస్స్టేషన్ పరిధిలోని రాజ్నగర్ బస్తీలో చోటుచేసుకుంది. -
వివాదాల డి బాస్
అభిమానులు ముద్దుగా ‘డి’ బాస్ అంటూ పిలుచుకునే ఆయన నిత్యం ఏదో ఒక వ్యవహారంలో వివాదానికి కేంద్రబిందువుగా మారుతుంటారు. తానేం చేసినా వార్తల్లో వ్యక్తిగా ఉంటారు. వెండితెరపై అభిమానులను అలరించే ఆయనకు నిజజీవితంలో వివాదాల సుడిగుండంలో చిక్కుకోవడం పరిపాటిగా మారింది. -
హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ అరెస్టు
తనతో సహజీవనం చేస్తున్న నటికి అసభ్య సందేశాలు పంపినందుకు ఒక యువకుడిని హత్య చేశారనే ఆరోపణలపై కన్నడ చలనచిత్ర నటుడు దర్శన్ తూగుదీపను బెంగళూరు నగర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. -
సైబర్ నేరగాళ్ల వలలో బ్యాంకు మేనేజర్
పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న ఓ బ్యాంకు మేనేజర్ సైబర్ నేరగాళ్లుకు చిక్కి డబ్బులు పోగొట్టుకున్న ఘటన సోమవారం చోటు చేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. -
భారతీయ యువతను మభ్యపెట్టి.. ఉక్రెయిన్తో యుద్ధ ఊబిలోకి
మాస్కోలో ఉద్యోగావకాశాలు ఉన్నాయంటూ భారతీయ యువతను ఆశపెట్టి, తీరా వారు రష్యా చేరాక ఉక్రెయిన్పై యుద్ధానికి పంపుతున్న ముగ్గురు మానవ అక్రమ రవాణాదారుల అరెస్టుకు రెడ్కార్నర్ నోటీసు జారీ చేయాల్సిందిగా ఇంటర్పోల్ను సీబీఐ కోరనుంది. -
తాడిపత్రి అల్లర్ల కేసులో పెద్దారెడ్డి అనుచరుల అరెస్టు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన రాళ్లదాడి కేసులో తొమ్మిది మందిని పట్టణ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. -
రూ.18 లక్షల నకిలీ కరెన్సీ పట్టివేత
కర్ణాటక నుంచి హైదరాబాద్కు భారీగా తరలిస్తున్న నకిలీ కరెన్సీ పట్టుబడిన సంఘటన మంగళవారం శంషాబాద్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
రూ.500 కోసం ఇద్దరి హత్య
రూ.500 కోసం ఇద్దరిని హత్యచేసిన ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన వరికుప్పల శ్రీనివాస్కు యావజ్జీవ కఠిన కారాగార శిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి కుంచాల సునీత మంగళవారం తీర్పునిచ్చారు. -
రూ.300 విలువైన ఆభరణాలు రూ.6కోట్లకు.. అమెరికా మహిళకు టోకరా!
అమెరికాకు చెందిన ఓ మహిళను నిట్టనిలువునా ముంచేశాడు జైపుర్కు చెందిన వ్యాపారి. కేవలం రూ.300 విలువ చేసే నగల్ని రూ.6 కోట్లకు విక్రయించాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మేం గెలుస్తామని చెప్పావు.. ఇప్పుడు చూడు ఇలా: యువీతో అఫ్రిది
-
కువైట్ అగ్నిప్రమాదం.. మోదీ ఉన్నత స్థాయి సమీక్ష.. గల్ఫ్కు కేంద్రమంత్రి పయనం
-
బెంగళూరు నుంచి తెచ్చి.. హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా అరెస్టు
-
కోర్టు ప్రాంగణంలో పాక్ అనుకూల నినాదాలు.. గ్యాంగ్స్టర్కు దేహశుద్ధి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఈ నైపుణ్యం మీ జీవితాన్నే మార్చేస్తుంది.. వారెన్ బఫెట్ చెప్పిన సూత్రమిదే