వికారాబాద్‌ జిల్లాలో మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం!

వికారాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పూడూరు మండల పరిధిలోని ఓ గ్రామంలో మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.

Published : 12 May 2022 11:14 IST

పూడూరు: వికారాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పూడూరు మండల పరిధిలోని ఓ గ్రామంలో మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు చాకలి రవి, చింటు యాదవ్‌ బుధవారం రాత్రి బాలికను బలవంతంగా ఇంటి నుంచి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.

బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో బాలికను గుర్తించి ఇద్దరు యువకులను పోలీసులకు అప్పగించారు. ఎస్సై శ్రీశైలం ఘటనాస్థలానికి చేరుకుని బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని