ముత్తూట్‌ ఫైనాన్స్‌ ఎండీపై రాళ్ల దాడి

ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ముత్తూట్‌ ఫైనాన్స్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జార్జ్‌ అలెగ్జాండర్‌ ముత్తూట్‌పై దాడి జరిగింది. మంగళవారం ఉదయం కొందరు ఆగంతకులు ఆయన కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో అలెగ్జాండర్‌

Updated : 08 Jan 2020 02:01 IST

కోచి: ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ముత్తూట్‌ ఫైనాన్స్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జార్జ్‌ అలెగ్జాండర్‌ ముత్తూట్‌పై దాడి జరిగింది. మంగళవారం ఉదయం కొందరు ఆగంతకులు ఆయన కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో అలెగ్జాండర్‌ తలకు గాయమైంది. దీంతో ఆయనను స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో కోచిలోని ఐజీ ఆఫీస్‌ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఘటనపై ముత్తూట్‌ ఫైనాన్స్‌ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఐటీయూ(సెంటర్ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌)కు చెందిన వ్యక్తులే దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను సీఐటీయూ తోసిపుచ్చింది. ఇలాంటి హింసాత్మక ఆందోళనలకు తాము పాల్పడబోమని సీఐటీయూ నేత అనంతలవట్టమ్‌ ఆనందన్‌ స్పష్టం చేశారు. 

గతేడాది డిసెంబరులో ముత్తూట్‌ ఫైనాన్స్‌ దేశవ్యాప్తంగా తమ కంపెనీకి చెందిన 43 బ్రాంచుల్లో 160 మంది సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. దీంతో సదరు ఉద్యోగులు గత కొన్ని రోజులుగా ఆందోళనకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నిరసన జరుగుతోంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని