పోలీసుల బుట్టలో మోసగాడు
ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ఉంచిన విలువైన కెమెరాలను తప్పుడు ఐడీలతో అద్దెకు తీసుకుని విక్రయించిస్తున్న సైబర్ నేరగాడిని తుకారాంగేట్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు సైతం ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇవ్వగా అది చూసి బేరమాడేందుకు వచ్చి
తప్పుడు ఐడీలతో కెమెరాలు అద్దెకు తీసుకుని విక్రయం
కెమెరాలను చూపిస్తున్న డీసీపీ చందనదీప్తి
రెజిమెంటల్బజార్, న్యూస్టుడే: ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ఉంచిన విలువైన కెమెరాలను తప్పుడు ఐడీలతో అద్దెకు తీసుకుని విక్రయించిస్తున్న సైబర్ నేరగాడిని తుకారాంగేట్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు సైతం ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇవ్వగా అది చూసి బేరమాడేందుకు వచ్చి నిందితుడు దొరికిపోయాడు. నిందితుడి వద్ద నుంచి రూ.5.5లక్షల విలువైన 10కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నార్త్జోన్ డీసీపీ చందనదీప్తి శనివారం ఏసీపీ సుధీర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అంబటి అంజనేయులుతో కలిసి వివరాలు వెల్లడించారు. వనపర్తి పట్టణం న్యూటౌన్ కాలనీకి చెందిన గంగిడి కిరణ్కుమార్ యాదవ్(27) సాప్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఓఎల్ఎక్స్లో అద్దెకు, విక్రయించించేందుకు ఉంచిన వాళ్లను గుర్తించి తప్పుడు గుర్తింపు, ఆధార్కార్డులు చూపించి రోజుకు రూ.వెయ్యి చొప్పున అద్దె చెల్లిస్తానంటూ నమ్మకం కుదిరేందుకు కొంత డబ్బును అడ్వాన్స్గా చెల్లిస్తాడు. ఆ కెమెరాలను విక్రయిస్తూ జల్సాగా గడుపుతున్నాడు. ఈనెల 6న తుకారాంగేట్లో ఉండే విద్యార్థి సాత్విక్ ఆన్లైన్లో విక్రయించేందుకు కెమెరా ఉంచగా కిరణ్కుమార్ అద్దెకిస్తే డబ్బులు ఎక్కువగా వస్తాయని నమ్మించాడు. రెండు రోజుల అద్దె ఇచ్చి కెమెరా తీసుకుని వెళ్లాడు. తరువాత నిందితుడి ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో తుకారంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!