ఆర్టీసీ బస్సు ఢీకొని దుర్మరణం

పుల్లలపాడు జాతీయరహదారిపై మంగళవారం రాత్రి ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు.

Updated : 08 Dec 2022 04:32 IST

రామ సత్యసాయి

నల్లజర్ల: పుల్లలపాడు జాతీయరహదారిపై మంగళవారం రాత్రి ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. నల్లజర్ల గ్రామానికి చెందిన గన్నిన రామ సత్యసాయి(29) నెల్లూరు జిల్లా కావలిలో ఆయుర్వేద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల స్వగ్రామం వచ్చారు. మంగళవారం వ్యక్తిగత పనుల నిమిత్తం భీమడోలు వెళ్లి రాత్రి సమయంలో తిరిగొస్తుండగా రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. శవపంచనామా కోసం తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి ఇంకా వివాహం జరగలేదు. ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రాంబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని