ఆర్టీసీ బస్సు ఢీకొని దుర్మరణం
పుల్లలపాడు జాతీయరహదారిపై మంగళవారం రాత్రి ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు.
రామ సత్యసాయి
నల్లజర్ల: పుల్లలపాడు జాతీయరహదారిపై మంగళవారం రాత్రి ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. నల్లజర్ల గ్రామానికి చెందిన గన్నిన రామ సత్యసాయి(29) నెల్లూరు జిల్లా కావలిలో ఆయుర్వేద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల స్వగ్రామం వచ్చారు. మంగళవారం వ్యక్తిగత పనుల నిమిత్తం భీమడోలు వెళ్లి రాత్రి సమయంలో తిరిగొస్తుండగా రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. శవపంచనామా కోసం తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి ఇంకా వివాహం జరగలేదు. ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రాంబాబు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
జన్మభూమి సేవలో అజరామరుడు.. కానిస్టేబుల్ అహ్మద్ షేక్కు మరణానంతరం శౌర్యచక్ర
-
Ap-top-news News
Andhra News: కల్యాణ మండపంలో కలకలం.. ఉన్నట్లుండి ఊడిపోయి పైకి లేచిన ఫ్లోరింగ్ టైల్స్
-
Crime News
Crime News: బ్రెయిన్ మ్యాపింగ్తో హత్య కేసులో నిందితుల గుర్తింపు
-
Politics News
Balakrishna: బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం
-
Sports News
MS Dhoni: కొబ్బరి బొండం పట్టుకుని.. టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్లోకి..
-
Politics News
Andhra News: ‘పెద్దిరెడ్డిపై పోటీకి చంద్రబాబు అవసరం లేదు.. నేను చాలు’