Hyderabad: పేరుకు అమ్మాయే.. మగరాయుడిలా వేషభాష
స్నేహంగా మెలుగుతున్నందుకు చనువుతో పెళ్లి ప్రస్తావన తెచ్చిన యువకుడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన యువతికి గురువారం బెయిలు లభించింది.
హైదరాబాద్: స్నేహంగా మెలుగుతున్నందుకు చనువుతో పెళ్లి ప్రస్తావన తెచ్చిన యువకుడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన యువతికి గురువారం బెయిలు లభించింది. పోలీసులు, స్థానికులు వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరానికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) భార్య, ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంటున్నారు. ఆయన కుమార్తె లక్ష్మీ సౌమ్య(23) బీబీఏ పూర్తిచేసింది. ఈమెకు తండ్రితో విభేదాలు రావడంతో 6 నెలల క్రితం నగరానికి వచ్చేసింది. క్రికెట్ కోచింగ్తోపాటు ఉద్యోగ ప్రయత్నం నిమిత్తం వచ్చానంటూ కేపీహెచ్బీ నాలుగో రోడ్డులోని శ్రీ తనూజ హాస్టల్లో చేరింది.
సాధారణంగా రాత్రి 10 గంటలకు హాస్టల్ గేట్లు మూసేస్తారు. కానీ లక్ష్మీ సౌమ్య మాత్రం నిత్యం ఆలస్యంగా చేరుకునేది. దీంతో ఆమె ప్రవర్తన నచ్చక హాస్టల్ నిర్వాహకులు ఆమెను ఖాళీ చేయించగా తొమ్మిదో ఫేజ్లో ఓ గది అద్దెకు తీసుకొని ఉంటోంది. పేరుకు అమ్మాయే అయినా మగరాయుడిలా కనిపించేది. ఆమె వేషధారణ, భాష అంతా విభిన్నంగా ఉండేది. ఈమె హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడికి సమీపంలోనే ఉన్న దేవీ లగ్జరీ బాయ్స్ హాస్టల్లో గుంటూరుకు చెందిన నాదెండ్ల అశోక్కుమార్ (27) 7 నెలలుగా ఉంటూ ఎస్ఏపీ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇతని సోదరి కూడా సమీపంలోని హాస్టల్లోనే ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేది. అశోక్కుమార్, లక్ష్మీ సౌమ్య నిత్యం ఓ టీ స్టాల్కు వెళ్లేవారు. అక్కడ పరిచయం ఏర్పడి రోజూ కలుసుకుని మాట్లాడుకునేవాళ్లు.
ఈక్రమంలో లక్ష్మీ సౌమ్యకు అవసరమై అప్పుడప్పుడు అశోక్కుమార్ కొంత నగదు ఇచ్చాడు. అలా చనువుకొద్దీ ఆమెతో పెళ్లి ప్రస్తావన తెచ్చేవాడు. ఆమె మౌనం వహించేది. ఈనెల 5న అశోక్కుమార్ పుట్టినరోజు ఉండటంతో ఖర్చులకు తానిచ్చిన డబ్బులు ఇవ్వమని లక్ష్మీ సౌమ్యని అడిగాడు. దానిపై మాటమాట పెరిగి డబ్బులు ఇవ్వకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అశోక్ అనడంతో లక్ష్మీ సౌమ్య ఆగ్రహంతో ఊగిపోయింది. తన వద్ద ఉన్న చాకు లాంటి మినీ కట్టర్తో అశోక్కుమార్పై దాడి చేసింది. ప్రస్తుతం ఇతని ఆరోగ్యం నిలకడగానే ఉంది. అతని ముఖానికి సంబంధించిన నరం తెగిందని, ముఖం ఎడమ వైపు పక్షవాతం వచ్చిందని, రెండు రోజుల్లో డిశ్ఛార్జ్ అవుతాడని వైద్యులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు