మరణం ఎదురొచ్చింది.. నలుగురు అక్కచెల్లెళ్లు సహా ఏడుగురి దుర్మరణం
పుణ్యక్షేత్రాలను దర్శించుకుని స్వస్థలాలకు బయలుదేరిన వారిని లారీ రూపంలో ఎదురొచ్చిన మృత్యువు కబళించింది.
వైయస్ఆర్ జిల్లాలో ఘోరం
ఈనాడు డిజిటల్, కడప, న్యూస్టుడే, కొండాపురం: పుణ్యక్షేత్రాలను దర్శించుకుని స్వస్థలాలకు బయలుదేరిన వారిని లారీ రూపంలో ఎదురొచ్చిన మృత్యువు కబళించింది. మరికాసేపట్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉండగా ప్రమాదం సంభవించింది. వైయస్ఆర్ జిల్లా కొండాపురం వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ తుపాను వాహనాన్ని ఢీకొట్టడంతో ఏడుగురు చనిపోగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగు, కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన బంధువులంతా కలిసి ఈ నెల 13న తిరుమల వెళ్లారు. శ్రీవారిని దర్శించుకోవడంతోపాటు పలు ప్రాంతాలను సందర్శించిన అనంతరం ఆదివారం రాత్రి 9 గంటలకు తిరుపతి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. మరో అరగంటలో తాడిపత్రి చేరుకుంటారనగా వైయస్ఆర్ జిల్లా కొండాపురం మండలం చిత్రావతి వంతెన వద్ద సోమవారం తెల్లవారుజామున ఎదురుగా వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న తుపాను వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన డ్రైవరు సహా ఐదు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది.
తుపాను వాహనంలో ప్రయాణిస్తున్న అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వెంకటలక్ష్మి (55), ఆమె కుమారుడు, వార్డు వాలంటీరు సునీల్కుమార్రెడ్డి (26), డ్రైవర్ భూమిరెడ్డి సుధాకర్రెడ్డి (32), కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన కాటసాని సుభద్ర (35), ఆమె కుమారుడు కాటసాని నితిన్రెడ్డి (11), లక్ష్మీదేవి (38), వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగుకు చెందిన సుమలత (37) మృతిచెందారు. వీరిలో వెంకటలక్ష్మి, సుమలత, లక్ష్మీదేవి, సుభద్ర నలుగురూ అక్కచెల్లెళ్లు. వీరి మరో సోదరి జయలక్ష్మి గాయపడి, చికిత్స పొందుతున్నారు. మృతదేహాలన్నీ వాహనంలో చిక్కుకుపోవడంతో స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీశారు. మృతదేహాలకు తాడిపత్రి ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి బంధువులకు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. వీరిలో మేఘన, శిల్ప పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: చంద్రబాబు
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందడంపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్సనందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు