వైయస్ఆర్ జిల్లాలో అర్ధరాత్రి మహిళా ఎస్ఐపై దాడి
వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఒకటో పట్టణ ఠాణా మహిళా ఎస్ఐ హైమావతిపై శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారు.
కాలికి గాయం... పగిలిపోయిన సెల్ఫోన్
ఇసుకాసురుల పనేనని అనుమానం?
ప్రొద్దుటూరు నేరవార్తలు, న్యూస్టుడే: వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఒకటో పట్టణ ఠాణా మహిళా ఎస్ఐ హైమావతిపై శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారు. ఆమె కాలికి గాయమైంది. సెల్ఫోన్ పగిలిపోయింది. రామేశ్వరం బైపాస్ రోడ్డులోని రెండు కుళాయిల సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రొద్దుటూరులో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రతిరోజూ తెల్లవారుజామున, రాత్రి సమయంలో పెన్నానది నుంచి అనేక ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి విధుల్లో ఉన్న ఎస్ఐ హైమావతికి ఇసుక అక్రమ రవాణాపై సమాచారం రావడంతో రక్షక్ వాహనంలో కానిస్టేబుల్తో కలిసి బైపాస్ రోడ్డు వద్దకు వెళ్లారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వారిని ఆపే ప్రయత్నం చేశారు. కాసేపటి తరువాత ఇద్దరు వ్యక్తులు మళ్లీ వచ్చి మమ్మల్ని ఆపుతారా అంటూ ఎస్ఐపై రాయి విసిరి బైక్లో పరారయ్యారు. విషయం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ దృష్టికి వెళ్లడంతో నిందితులను త్వరగా పట్టుకోవాలని ప్రొద్దుటూరు పోలీసులను ఆదేశించారు. ఎస్ఐపై దాడి చేసిన వ్యక్తులు ఇసుకాసురులే కావొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి ఘటనపై ఎస్ఐ హైమావతి గ్రామీణ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల వ్యవహారం.. కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్టు
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ గురువారం అరెస్టు అయ్యారు. ఈ వ్యవహారంలోనే జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న శ్రీనివాస్నాయక్పై కూడా ఓ కేసు నమోదైంది. -
రూ.లక్ష... 50 వేలు... 30 వేలు!
రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వారిలో ఒకరు వ్యవసాయ, ఇద్దరు విద్యుత్తు ఉద్యోగులు ఉన్నారు. -
దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. ఇద్దరి మృతి
విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాత పడగా.. మరొకరికి గాయాలైన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో చోటుచేసుకుంది. -
ప్రమాదం నుంచి బయటపడి... మరో కారు ఢీకొని...!
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అబ్బరాజు పృథ్వీరాజ్(30) దుర్మరణం పాలయ్యారు. -
చెరువులో మునిగి ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి
చెరువులో దీపాలు వదిలేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు అందులో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. -
నలభై ఏళ్ల తర్వాత ఖైదీ పట్టివేత
నలభై ఏళ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఓ ఖైదీని ఎట్టకేలకు పట్టుకున్నారు. జైలు అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన ఎస్.వీరన్న మహబూబాబాద్లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. -
టెస్కాబ్ ఉన్నతాధికారిణిని నమ్మి అడ్డంగా మోసపోయారు!
రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)లో ఒక ఉన్నతాధికారిణి మాటలు నమ్మి అందులో పనిచేస్తున్న పలువురు అధికారులు, ఉద్యోగులు మోసపోయారు. -
బాలికలతో బలవంతంగా వ్యభిచారం
అంతర్ రాష్ట్ర వ్యభిచార రాకెట్తో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అరుణాచల్ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.