అబ్బాయిలతో ఫోను మాట్లాడొద్దని మందలించినందుకు.. అన్నయ్య ప్రాణాలు తీసిన చెల్లి

అబ్బాయిలతో మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడొద్దని మందలించాడన్న కోపంతో 14 ఏళ్ల బాలిక తన అన్నయ్య(18)ను గొడ్డలితో నరికి హత్య చేసింది.

Updated : 06 May 2024 06:12 IST

 

రాజ్‌నంద్‌గావ్‌: అబ్బాయిలతో మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడొద్దని మందలించాడన్న కోపంతో 14 ఏళ్ల బాలిక తన అన్నయ్య(18)ను గొడ్డలితో నరికి హత్య చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్‌-ఛుయిఖదాన్‌-గండయి జిల్లాలోని అమ్లీదిఖాలా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబసభ్యులంతా కూలి పని కోసం బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో అన్నా, చెల్లి మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో బాలిక మొబైల్‌ ఫోన్‌లో అబ్బాయిలతో చాలాసేపు మాట్లాడుతోంది. ఆ సంగతిని గమనించిన అన్నయ్య ఆమెను మందలించాడు. ఫోన్‌ ఉపయోగించొద్దని కోరాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన బాలిక అన్నయ్య నిద్రలోకి జారుకున్న వెంటనే గొడ్డలితో గొంతు నరికింది. అనంతరం తన శరీరంపై పడిన రక్తపు మరకలు కడిగేసుకుంది. వస్త్రాలనూ శుభ్రం చేసుకుంది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు బయటకు వచ్చి ‘మా అన్నయ్యను ఎవరో హత్య చేశారు’ అని గ్రామస్థులకు తెలిపింది. పోలీసులు బాలికను గుచ్చిగుచ్చి ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని