కాళ్లు, చేతులు కట్టేసి... రూ.30 వేల అపహరణ

ఓ యువకుడి కాళ్లు, చేతులు కట్టేసి అతని వద్ద ఉన్న రూ.30 వేలు అపహరించిన ఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేట ఠాణా పరిధిలోని మల్కాపూర్‌ శివారులో జరిగింది. సీఐ నరహరి,

Updated : 14 Aug 2022 10:46 IST

నవీపేట, న్యూస్‌టుడే: ఓ యువకుడి కాళ్లు, చేతులు కట్టేసి అతని వద్ద ఉన్న రూ.30 వేలు అపహరించిన ఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేట ఠాణా పరిధిలోని మల్కాపూర్‌ శివారులో జరిగింది. సీఐ నరహరి, ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల  ప్రకారం మహారాష్ట్రలోని కొరేగాంకు చెందిన అమిత్‌పాటిల్‌(19) బెంగళూరులోని ఓ దాబాలో పనిచేస్తున్నాడు. రాఖీ పండగకు ఇంటికి వెళ్లే క్రమంలో శనివారం  నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. స్టేషన్‌ బయట గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు తమ వ్యాన్‌లో మహారాష్ట్ర తీసుకెళతామని చెప్పడంతో వాహనంలో ఎక్కాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత మత్తు పదార్థం కలిపిన మిఠాయి తినిపించడంతో అమిత్‌ స్పృహ తప్పాడు. అతని వద్ద ఉన్న రూ.30 వేలు తీసుకుని,  కాళ్లు, చేతులు కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి మల్కాపూర్‌ శివారులోని ఓ వెంచర్‌ వద్ద పడేసి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని