బతుకమ్మ ఆడుతుండగా మహిళ హత్య.. మరొకరితో సహజీవనం చేస్తోందంటూ భర్త ఘాతుకం
తన భార్య మరొక వ్యక్తితో సహజీవనం చేస్తోందంటూ కక్ష పెంచుకున్న భర్త బతుకమ్మ ఆడుతున్న ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి సిద్దిపేట జిల్లా వీరాపూర్లో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల
బెజ్జంకి, న్యూస్టుడే: తన భార్య మరొక వ్యక్తితో సహజీవనం చేస్తోందంటూ కక్ష పెంచుకున్న భర్త బతుకమ్మ ఆడుతున్న ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి సిద్దిపేట జిల్లా వీరాపూర్లో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన మామిడి ఎల్లమ్మ, గోపాల్రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలుండగా పెద్ద కూతురు మంగను స్థానికుడైన యాళ్ల ఎల్లారెడ్డికి ఇచ్చి పెళ్లిచేశారు.
నెల రోజులకే మంగ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోవడంతో మరలా రెండో కుమార్తె స్వప్నను ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆరేళ్ల వరకు వీరి కాపురం సజావుగా జరిగింది. తరువాత భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు మొదలయ్యాయి. స్వప్న ఇదే గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తితో 14 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది. దీంతో ఎల్లారెడ్డి పలుమార్లు ఆమెతో గొడవకు దిగి చంపేస్తానని బెదిరించాడు.
ఈక్రమంలో ఆదివారం రాత్రి తోటి మహిళలతో బతుకమ్మ ఆడుతుండగా.. ఆమె తలపై ఎల్లారెడ్డి ఇనుప రాడ్తో బలంగా మోదడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్ఐ తిరుపతి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.