మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు.
పేటెంట్ల అధిక నమోదు జరగాలి
వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్ రంగాలపై దృష్టి అవసరం
జస్టిస్ ఎన్.వి.రమణ సూచన
ఈనాడు - హైదరాబాద్
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. 2019-2021 మధ్యకాలంలో మనదేశంలో దాఖలైన పేటెంట్ దరఖాస్తుల్లో మహిళల వాటా 10.2 శాతం మాత్రమే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ‘ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశం. మహిళలు సహజసిద్ధమైన పరిశోధకులని చరిత్రలో ఏనాడో నిర్ధారణ అయింది. మహిళలను విస్మరించిన ఏ రంగంలోనూ ఆశించిన రీతిలో పురోగతి సాధ్యం కాదు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ మేధో సంపత్తి(ఐపీఆర్) దినోత్సవాన్ని పురస్కరించుకొని ముంబయిలో హిందాల్కో గ్రూపు నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ ఎన్.వి.రమణ ప్రధానోపన్యాసం చేశారు.
యువ జనాభాతో ఆవిష్కరణలు
1980 ప్రాంతంలో పేటెంట్లు అన్నీ అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు మనదేశం ఆవిష్కరణల్లో వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ‘2014- 23 మధ్య కాలంలో మనదేశం 4.65 లక్షల పేటెంట్లు దాఖలు చేసింది. 2023లో రోజుకు 247 పేటెంట్ దరఖాస్తులు దాఖలు చేయటం ప్రత్యేకత. పేటెంట్లలో మనదేశం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆరో స్థానంలో ఉంది. ‘గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్’లో మనదేశం 2015లో 81వ స్థానంలో ఉండగా, 2023 నాటికి 40వ స్థానానికి చేరుకుంది’ అని తెలిపారు. అయినా ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, మొత్తం జనాభాలో 35 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు 60 శాతం ఉన్న మనదేశంలో మున్ముందు ఎంతో అధికంగా ఆవిష్కరణలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కంప్యూటర్స్, బయోమెడికల్, రసాయన శాస్త్రం, యంత్ర పరిశోధనల నుంచే కాకుండా వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, వ్యర్ధాల నివారణ, పర్యావరణ పరిరక్షణ విభాగాల నుంచి అధిక పేటెంట్లు సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
సంప్రదాయాలను విస్మరించకుండానే కొత్తవి కనుక్కోవాలి..
మౌలిక సదుపాయాలు, ప్రజారోగ్యం, ఆర్థిక అసమానతలు, మహిళా సాధికారత.. మనదేశంలో పెద్ద సవాళ్లుగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. మనదేశంలో యువత ఈ సవాళ్లను అవకాశాలుగా మలుచుకొని కొత్త ఉత్పత్తులు, సేవలు ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ‘10వ తరగతి విద్యార్ధి ఒకరు గుండెపోటును పసిగట్టే ‘స్కిన్ ప్యాచ్’ను అభివృద్ధి చేస్తున్నట్లు నిన్ననే ఒక చోట చదివాను. ఇది అద్భుతమైన ఆవిష్కరణ’ అని ఆయన అన్నారు. మనదేశంలో లోహాలు, దుస్తులు, నీటి నిల్వ, ప్లాస్టిక్ సర్జరీ... తదితర విభాగాల్లో ఎన్నో పురాతన ఆవిష్కరణలు ఇప్పటికీ వినియోగంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. జపాన్లో ‘ఒరిగామి’ కళాకారులు ఒక సాధారణ కాగితంతో అద్భుతమైన ఆకృతులు సృష్టిస్తారని, ఈ కళ ఎంతో మంది ఆవిష్కర్తలు, ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్లు, డిజైనర్లు, బయాలజిస్ట్లకు స్ఫూర్తినిస్తోందని అన్నారు. అందువల్ల కొత్తవి కనుక్కోవటమంటే చరిత్రను, సంస్కృతీ సంప్రదాయాలను పూర్తిగా విస్మరించటం కాదన్నారు.
ప్రభుత్వం, కోర్టులు కీలకం..
నూతన ఆవిష్కరణలకు సామాజిక ప్రయోజనం పునాదిగా ఉండాలని, లేనిపక్షంలో అటువంటి ఆవిష్కరణలు దీర్ఘకాలం పాటు మనుగడ సాగించలేవని జస్టిస్ రమణ వివరించారు. ఈ ఆలోచనతోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో న్యాయవ్యవస్థలో తాను ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు. కొవిడ్- 19 సమయంలో కోర్టుల్లో ‘ఆన్లైన్’ విచారణలు చేపట్టినట్లు తెలిపారు. ఫాస్టర్ అనే వ్యవస్థను తీసుకొచ్చి బెయిలు ఆర్డరును నేరుగా జైలుకు పంపడం ద్వారా నిందితులను వేగంగా విడుదల చేసే అవకాశం కల్పించామన్నారు. అందరికీ ఉపయోగపడే ఆవిష్కరణలే, పరిశోధకుల లక్ష్యం కావాలని ఆయన అన్నారు. పరిశోధనలు- ఆవిష్కరణలకు పెద్దపీట వేసే క్రమంలో మేధో సంపత్తి హక్కులను పరిరక్షించాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం, కోర్టులు క్రియాశీలకమైన పాత్ర పోషించాలని సూచించారు.
హిందాల్కో గ్రూపు అల్యూమినియం ఉత్పత్తి, ప్రాసెసింగ్ విభాగాల్లో ఎన్నో ఆవిష్కరణలు తీసుకువచ్చిందని కొనియాడారు. పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలకు వందల కోట్ల రూపాయలు కేటాయించిందని, సాంకేతిక భాగస్వామ్యాలు కుదుర్చుకుందని తెలిపారు. సాంకేతిక రంగంలో మనదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టటానికి హిందాల్కో ఉద్యోగులు కృషి చేయాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
Trading hours: స్టాక్ బ్రోకర్ కమ్యూనిటీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో డెరివేటివ్స్ సెగ్మెంట్లో ట్రేడింగ్ సమయం పొడిగించే అంశాన్ని సెబీ తిరస్కరించింది. -
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!
Tesla: టెక్ కంపెనీల్లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు కష్టపడి పనిచేసిన తమను తొలగించడంపై పలువురు సామాజిక మాధ్యమ వేదికల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 67 పాయింట్ల లాభంతో 73,963 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,484 దగ్గర కొనసాగుతోంది. -
మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో.. 50శాతం మంది దేశీయ విమానాల్లోనే
మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు ప్రస్తుతం విదేశీ విమానయాన సంస్థల విమానాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఈ పరిస్థితి శరవేగంగా మారుతోందని, 2027-28 కల్లా మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 50% మంది దేశీయ సంస్థల విమానాల్లో ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. -
ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా.. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశ వ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ‘ఆత్మనిర్భర్’ విధానానికి అనుగుణంగా, 4జీ సేవలకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతనే సంస్థ ఉపయోగించనుంది. -
పెద్ద షేర్లలో లాభాల స్వీకరణ
సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ఎస్బీఐ, రిలయన్స్ వంటి షేర్లకు లాభాల స్వీకరణ ఎదురుకావడంతో సోమవారం సూచీలు స్తబ్దుగా ముగిశాయి. కొన్ని ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, ఔషధ షేర్లు మాత్రం రాణించాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి 83.52 వద్ద ముగిసింది. -
ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో జీవనకాల గరిష్ఠానికి ఎంఎఫ్ల వాటా
ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్ల) వాటా జీవనకాల గరిష్ఠానికి చేరింది. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో, ఆయా కంపెనీల్లో ఎంఎఫ్ల వాటా 8.92 శాతానికి చేరిందని ప్రైమ్ డేటాబేస్ గ్రూప్నకు చెందిన ప్రైమ్ఇన్ఫోబేస్.కామ్ వెల్లడించింది. -
నరేశ్ గోయెల్కు మధ్యంతర బెయిలు
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయెల్(75)కు వైద్య చికిత్స నిమిత్తం రెండు నెలల మధ్యంతర బెయిలును బాంబే హైకోర్టు సోమవారం మంజూరు చేసింది. -
అంతర్జాతీయ మొబైల్ నంబర్తోనూ యూపీఐ చెల్లింపులు: ఐసీఐసీఐ బ్యాంక్
భారత్లో ఉన్న ప్రవాసులు (ఎన్ఆర్ఐ), అంతర్జాతీయ మొబైల్ నంబర్లతో యూపీఐ సేవలను ఉపయోగించుకునే వీలు కల్పిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. -
సేవల రంగ వృద్ధి వేగవంతంగానే
దేశీయ సేవల రంగ వృద్ధి ఏప్రిల్లో కాస్త నెమ్మదించినప్పటికీ.. కొత్త వ్యాపారాలు, ఉత్పత్తిపరంగా మెరుగ్గానే ఉందని ఓ సర్వే వెల్లడించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ మార్చిలో 61.2 పాయింట్లుగా ఉండగా.. ఏప్రిల్లో 60.8 పాయింట్లకు దిగివచ్చింది. -
ఆంధ్ర, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో డ్రోన్లతో పురుగుమందులు, ఎరువుల పిచికారీ
30 లక్షల ఎకరాల సాగుభూముల్లో పురుగుమందులు, ఎరువుల పిచికారీకి ఇఫ్కోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డ్రోన్ కంపెనీ డ్రోన్ డెస్టినేషన్ తెలిపింది. ఒప్పందం ప్రకారం ఎకరాకు రూ.400-800ను చొప్పున చెల్లిస్తారు. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు
ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తులు అందించే కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు అరుణాచలం వెల్లాయన్, నారాయణన్ వెల్లాయన్ నియమితులయ్యారు. -
జీఎస్టీఏటీ తొలి అధ్యక్షుడిగా మిశ్రా
జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (జీఎస్టీఏటీ)కు తొలి అధ్యక్షుడిగా జస్టిస్ (రిటైర్డ్) సంజయ్ కుమార్ మిశ్రాతో సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే.. జీఎస్టీ సంబంధిత వివాదాల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించనున్న జీఎస్టీఏటీ కార్యకలాపాలు ప్రారంభమైనట్లే లెక్క. -
ఫరూఖ్నగర్లో 48 ఎకరాలు కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) హైదరాబాద్ సమీపంలో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఈ భూమిని తీసుకుంది. -
ఆఫ్లైన్లోనూ ఇ-రుపీ
ఇ-రుపీ లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని ఆఫ్లైన్ పద్ధతిలోనూ బదిలీ చేసేలా పనిచేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
మాస్చిప్ టెక్నాలజీస్ ఆదాయాల్లో వృద్ధి
సెమీకండక్టర్, సాఫ్ట్వేర్, సిస్టమ్ డిజైన్ సేవల సంస్థ మాస్చిప్ టెక్నాలజీస్ 2023-24 పూర్తి కాలానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.293.91 కోట్ల ఆదాయాన్ని, రూ.9.9 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
సంక్షిప్త వార్తలు(7)
సువెన్ లైఫ్సైన్సెస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి రూ.6.66 కోట్ల ఆదాయాన్ని, రూ.26.54 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం 8.21 కోట్లు, నష్టం రూ.27.64 కోట్లు ఉండటం గమనార్హం
తాజా వార్తలు (Latest News)
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య