ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు.
పేద బ్రాహ్మణ విద్యార్థులకు జగన్ మోసం
‘విదేశీ విద్యా దీవెన’లో మొండిచేయి
రాతలు మారుస్తా అని.. ‘కోతలు’ కోశారు!
అగమ్యగోచరంగా 96 మంది విద్యార్థుల భవిత
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్.
ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు.
అంతలోనే ‘విద్యా దీవెన’కు కోతలు కోసి వారి రెక్కలు విరిచారు!!
అంతూపొంతులేని షరతులు పెట్టి పేద విద్యార్థుల కలల సౌధాలను కుప్పకూల్చారు ఈ మాటల జాదూ జగన్!
‘‘ప్రతిభావంతులైన పేద పిల్లలు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోకూడదా? ప్రపంచ విఖ్యాత విశ్వవిద్యాలయాల్లో సీటు వస్తే పేద పిల్లలకు ఫీజులు కట్టే ఆర్థిక స్తోమత ఉండదు. అలాంటి వారి ఉన్నత విద్యకు పేదరికం అడ్డురాకూడదన్న ఉద్దేశంతో విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలుచేస్తున్నాం. ప్రతిభావంతులైన పేద పిల్లలు తల్లిదండ్రులపై ఆధారపడకుండా సొంతకాళ్లపై నిలబడేలా అడుగులు వేస్తున్నాం’’
‘మామ’ ఇచ్చిన మాటపై ఆశతో ప్రతిభావంతులైన పేద బ్రాహ్మణ విద్యార్థులు విదేశాలకు వెళ్లి అక్కడి వర్సిటీల్లో చేరారు. ఇప్పుడేమో నిబంధనలను సాకుగా చూపి ఫీజు చెల్లించకుండా వారి నోట్లో మట్టి కొట్టారు.
విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు ఆసక్తి ఉన్న పేద బ్రాహ్మణ విద్యార్థులకు గత తెదేపా ప్రభుత్వం అండగా నిలిచింది. ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ (బ్రాహ్మణ కార్పొరేషన్) ద్వారా 2014- 2019 మధ్యకాలంలో 236 మందికి రూ.22.50 కోట్ల ఫీజును చెల్లించింది. జగన్ సర్కారు మాత్రం ప్రతిభ కల పేద బ్రాహ్మణ విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకుంది. నిబంధనలు, షరతులను సాకుగా చూపి వారి ఉన్నత విద్యను అడ్డుకుంది. తన ఐదేళ్ల పాలనాకాలంలో కేవలం పది మంది బ్రాహ్మణ విద్యార్థులకు మాత్రమే ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ కింద ఫీజులు చెల్లించింది. ఇది చాలు.. పేద బ్రాహ్మణ విద్యార్థులపై జగన్ ఎంత కక్షగట్టారో చెప్పడానికి..!
96 మంది నోట్లో మట్టి
వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది నుంచే సీఎం జగన్ బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్యను దూరం చేశారు. 2019-20 బడ్జెట్లో విదేశీ విద్య పథకానికి నిధులు కేటాయించడంతో.. ఆ ఏడాది విద్యార్థులకు ఆర్థికసాయం అందిస్తారని బ్రాహ్మణ కార్పొరేషన్ అధికారులు భావించారు. దీంతో ఆ ఆర్థిక సంవత్సరంలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందిన 96 మంది బ్రాహ్మణ విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో 94 మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున, ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.9.50 కోట్ల ఆర్థికసాయం పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ విషయమై సంబంధిత విద్యార్థులకు సమాచారం కూడా ఇచ్చారు. దీంతో వారంతా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి అక్కడి విశ్వవిద్యాలయాల్లో చేరారు. నేడో, రేపో డబ్బు మంజూరవుతుందని ఆశగా ఎదురుచూశారు. అంతలోనే పిడుగులాంటి వార్త వారిని ఉలికిపాటుకు గురయ్యారు. గతంలో అవకతవకలు జరిగాయంటూ జగన్ ఈ పథకాన్ని ఆకస్మికంగా నిలిపేశారు. విద్యార్థులకు ఈ విషయం అశనిపాతంలా పరిణమించింది. ఈ డబ్బులు అందక 96 మంది విద్యార్థుల భవిష్యత్తు, వారి ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
అర్హులను తగ్గించేందుకు ఎత్తుగడలు
గత తెదేపా ప్రభుత్వం బ్రాహ్మణ విద్యార్థులకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా చెల్లించిన ఫీజును వైకాపా సర్కారు.. ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈబీసీ) కార్పొరేషన్ ద్వారా అందే ఏర్పాటు చేసింది. అయితే ‘జగనన్న విద్యా దీవెన’లో అర్హుల సంఖ్యను తగ్గించేందుకు తీసుకొచ్చిన నిబంధనలు, విధించిన షరతులు బ్రాహ్మణ విద్యార్థులకు శాపంలా పరిణమించాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు విదేశాల్లోని 400 అగ్రశ్రేణి వర్సిటీల్లో ఎక్కువగా చదువుతూ మంచి సంస్థల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. అయితే, క్యూఎస్ ర్యాంకింగులో ఉన్న టాప్-200 విశ్వవిద్యాలయాల్లో సీటు పొందిన వారికే ఆర్థికసాయం అందిస్తామని ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో 100లోపు ర్యాంకు ఉన్న వర్సిటీల్లో సీటు లభిస్తే 100 శాతం ఫీజు భరిస్తామని, 101 నుంచి 200 వరకు ర్యాంకు ఉన్న వర్సిటీల్లో సీటు పొందితే సగం ఫీజుగానీ, రూ.50 లక్షలుగానీ (రెండింటిలో ఏదీ తక్కువైతే అది) చెల్లిస్తామని తెలిపింది. తర్వాత నిబంధనలను కఠినతరం చేసి పేద విద్యార్థులకు విదేశీ విద్యను అందని ద్రాక్షగా మార్చేసింది. సబ్జెక్టుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి.. టాప్-50 ర్యాంకు కల వర్సిటీల్లో సీటు సాధిస్తేనే సాయం చేస్తామని షరతు విధించింది. దీంతో విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునే అన్ని వర్గాలకు చెందిన పేద విద్యార్థుల సంఖ్య దారుణంగా తగ్గిపోయింది. బ్రాహ్మణ విద్యార్థుల్లో కేవలం 10 మంది మాత్రమే అర్హత సాధించారు. ఫీజు చెల్లిస్తామని వైకాపా ప్రభుత్వం చెబితేనే తాము విదేశాల్లోని ప్రముఖ వర్సిటీల్లో చేరామని, అకస్మాత్తుగా చేతులెత్తేస్తే తమ చదువులు, భవిష్యత్తు ఏం కావాలి అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారుపై భరోసాతోనే తమ పిల్లలను విదేశాల్లో చదివించేందుకు రూ.లక్షలను అప్పుగా తీసుకొచ్చామని, ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చితే అంత డబ్బును తాము ఎక్కడి నుంచి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. -
వైకాపా అరాచకాలపై మేము సైతం పోరాడతాం
‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. -
వైద్య బోధకుల బదిలీల దుమారం
ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి. -
ఇఫ్కోకు భూకేటాయింపుపై పిల్ కొట్టివేత
యూరియా, అమోనియా ప్లాంట్ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. -
భరోసానూ బరికేశారు!
రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు. -
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
‘బాహుబలి’ యానిమేషన్ సిరీస్లో జరిగే కథ ఇదే!
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!