Crime News: మాదకద్రవ్యాలకు బానిసై.. కుటుంబ సభ్యులను హతమార్చిన యువకుడు

మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డ ఓ యువకుడు తన తల్లిదండ్రులతో పాటు, సోదరి, నాయనమ్మని హతమార్చాడు.

Updated : 24 Nov 2022 11:08 IST

రక్తపు మడుగులో నలుగురి మృతదేహాలు
దేశ రాజధానిలో దారుణం

దిల్లీ: మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డ ఓ యువకుడు తన తల్లిదండ్రులతో పాటు, సోదరి, నాయనమ్మని హతమార్చాడు. దిల్లీలోని పాలం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశవ్‌(25) మాదక ద్రవ్యాలకు బానిసై ఇటీవల ఒక రిహాబిలిటేషన్‌ కేంద్రంలో చికిత్స పొందాడు. అక్కడి నుంచి రాగానే మంగళవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో తన నాయనమ్మ దీవానాదేవి(75), తండ్రి దినేశ్‌(50), తల్లి దర్శన.. సోదరి ఊర్వశి(18)లను హతమార్చాడు. కేశవ్‌ దాడి చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి చూడగా నాలుగు మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. బంధువులు, స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేశవ్‌ తరచూ డబ్బు కోసం కుటుంబ సభ్యులను వేధించేవాడని.. మంగళవారం కూడా తల్లితో ఘర్షణ పడ్డాడని స్థానికులు తెలిపారు. కేశవ్‌ గతంలో ఏటీఎం చోరీ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని