నీళ్ల ట్యాంకు కూలి మహిళ మృతి

నీళ్ల ట్యాంకు గోడలు కూలి ఓ మహిళ మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడులో మంగళవారం చోటు చేసుకుంది.

Published : 30 Nov 2022 06:15 IST

త్రిపురాంతకం, న్యూస్‌టుడే: నీళ్ల ట్యాంకు గోడలు కూలి ఓ మహిళ మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడులో మంగళవారం చోటు చేసుకుంది. దూపాడు గ్రామానికి చెందిన అల్లంరాజు వెంకట నారాయణమ్మ (42), అమ్మిరెడ్డి తిరుపతమ్మ మంగళవారం ఉదయం నీరు తెచ్చుకునేందుకు గ్రామంలోని నీళ్లట్యాంకు వద్దకు వెళ్లారు. అక్కడ బిందెలతో నీళ్లు పడుతుండగా ఒక్కసారిగా ట్యాంకు గోడలు రెండు వైపులా కూలాయి. అక్కడే ఉన్న నారాయణమ్మ, తిరుపతమ్మలపై గోడలు పడ్డాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలవడంతో స్థానికులు వెంటనే త్రిపురాంతకంలోని ఓ వైద్యశాలకు తరలించారు. నారాయణమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని