పర్యావరణ దినోత్సవం నాడు గంజాయి మొక్కలు నాటారు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు సాధారణంగా మొక్కలు నాటుతుంటారు.

Updated : 09 Jun 2021 01:38 IST

నాటిన యువకుడి కోసం గాలిస్తున్న పోలీసులు

కొల్లాం: ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు సాధారణంగా మొక్కలు నాటుతుంటారు. కానీ గంజాయి మొక్కలు నాటిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. కొల్లాం జిల్లాలోని కందిచీరా ప్రాంతంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. అయితే వాటిలో కొన్ని గంజాయి మొక్కలు కూడా ఉన్నాయి. స్థానికులు మొక్కలతో ఫొటోలు దిగుతున్న సమయంలో వీటిని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే గంజాయి సాగుపై కేసు నమోదైన ఓ యువకుడు వీటిని నాటినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని