Nirmal: గడ్డెన్నవాగు ప్రాజెక్టులో మృతదేహాల కలకలం

నిర్మల్ జిల్లా భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టులో రెండు మృతదేహాలు తేలడం కలకలం రేపింది.

Published : 08 Jan 2022 13:58 IST

భైంసా: నిర్మల్ జిల్లా భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టులో రెండు మృతదేహాలు తేలడం కలకలం రేపింది. ఉదయం కాలినడకకు వచ్చిన స్థానికులు మృతదేహాలు గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాలపై ఆరా తీశారు. ఒకరు భైంసా రాహుల్‌నగర్‌కు చెందిన గోపాల్‌గా గుర్తించారు. మరో మృతురాలిని సునీతగా అనుమానిస్తున్నారు. గోపాల్‌కు వివాహమవగా.. యువతిని అవివాహితగా తేల్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని