ధాన్యం అదనపు కొనుగోళ్లకు ప్రతిపాదన
మండలం చందోలులో నీటి కోసం చేతిపంపు కొడుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందాడు. చందోలు పంచాయతీ పరిధిలోని పెద్దహరిజనవాడకు చెందిన మాజీ సైనికుడు చేబ్రోలు
రైతుకు టోకెన్ అందజేస్తున్న కలెక్టర్ వివేక్యాదవ్, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
వినుకొండ, నరసరావుపేట గ్రామీణ, న్యూస్టుడే: ఆర్బీకేల నుంచి పంట కొనుగోలు చేస్తున్నట్లు కలెక్టర్ వివేక్యాదవ్ తెలిపారు. వినుకొండ మండలం నరగాయపాలెం, నరసరావుపేట మండలం ఉప్పలపాడు రైతుభరోసా కేంద్రాలను బుధవారం సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో ధాన్యం సగటు దిగుబడి ఎకరానికి 26 బస్తాలుగా నిర్ణయించి ఈ మేరకు ప్రతిరైతు నుంచి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో 35 నుంచి 40 బస్తాల వరకు పండిందని ప్రజాప్రతినిధుల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు అదనపు ధాన్యం కొనుగోలుకూ పౌరసరఫరాలశాఖకు ప్రతిపాదన పంపామని పేర్కొన్నారు. ఏజెన్సీలు కొనుగోలు చేసిన 21రోజులకు రైతులకు డబ్బులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయశాఖ సిబ్బంది బాగా పనిచేస్తున్నారని అందరూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. రైస్ మిల్లులు తక్కువ ఉన్నందున వినుకొండ ప్రాంతంలో ధాన్యం కొనుగోలుకు నరసరావుపేట మిల్లర్లను అనుమతించాలని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన విజ్ఞప్తికి కలెక్టర్ అంగీకరించారు. ఈ సందర్భంగా రైతులకు ధాన్యం కొనుగోలు టోకెన్లు ఇచ్చారు. ఏపీ రైతు సంఘం నాయకుడు సురేష్రాజా ఆర్బీకే సిబ్బంది టోకెన్లు ఇచ్చినా మిల్లర్లు కోత విధిస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆర్డీవో శేషిరెడ్డి, ఏడీఏ రవికుమార్, యార్డు ఛైర్మన్ బాలిరెడ్డి, ఏవో వరలక్ష్మి, తదితరులున్నారు.
బడ్జెట్ ప్రతిపాదనలు పంపండి: డీఎంహెచ్వో
గుంటూరు వైద్యం, న్యూస్టుడే: వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని వివిధ విభాగాలకు రానున్న రెండేళ్లలో అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు వెంటనే అందజేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి యాస్మిన్ సూచించారు. డీఎంహెచ్వో కార్యాలయంలో బుధవారం ప్రోగ్రాం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాస్మిన్ మాట్లాడుతూ వివిధ పథకాలు సక్రమంగా అమలయ్యేందుకు ఎంత ఖర్చవుతుందో అంచానా వేయాలన్నారు. జీత, భత్యాలతో పాటు భవనాల నిర్మాణం, మరమ్మతులు, శిక్షణ కార్యక్రమాలకు ప్రత్యేకంగా బడ్జెట్ను కోరాలన్నారు. సమావేశంలో ఏడీఎంహెచ్వో జయసింహ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు