గురువులపై బోధనేతర విధుల భారం
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి.
గుంటూరు విద్య, న్యూస్టుడే : గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి.. బోధనేతర పనులు ఉపాధ్యాయులకు అప్పగించి విద్యాప్రమాణాలకు పాతర వేశారు. ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయికి చేర్చుతున్నామని చెప్పుకుంటూనే ప్రభుత్వం ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగిస్తోంది. నాడు- నేడు పనుల పర్యవేక్షణ, మరుగుదొడ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం అమలు వంటివి ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలనే నిబంధనలు విధించి ఒత్తిళ్లకు గురిచేశారు. ఆన్లైన్ యాప్లతో బోధనపై ప్రభావం పడుతుందని ఆ విధులు రద్దు చేయాలని పలుమార్లు నిరసనలు, ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలేదు. దీంతో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత పాఠశాలల వరకు బోధనపై ప్రభావం పడి ఉపాధ్యాయులు నానా అవస్థలు పడ్డారు. తుదకు పాఠశాలల పర్యవేక్షణ పేరుతో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి తనిఖీలు చేసి ఉపాధ్యాయులకు నోటీసులు, పలుసందర్భాల్లో చర్యలు తీసుకున్నారు.
బోధనకు తీవ్ర ఆటంకం: శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు
ఉపాధ్యాయులకు ఆన్లైన్ యాప్ల బాధ్యతలు ఇచ్చి అనేక రకాల డేటా అప్లోడ్ చేయాలని విధులు అప్పగించడంతో బోధనకు తీవ్ర ఆటంకం ఎదురైంది. పాఠశాల 9 గంటలకే ప్రారంభమైనా యాప్లో వివరాల నమోదుకు రెండు గంటలు కేటాయించాల్సి వస్తోంది. దీనితో విద్యార్థుల సిలబస్ అనుకున్న సమయానికి పూర్తి కాక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. విద్యార్థుల వర్క్బుక్స్ కూడా సరిగా చూడలేక పోయాం.
నాడు-నేడు పనులతో అవస్థలు పడ్డాం: విజయకుమార్, ఉపాధ్యాయుడు
పాఠశాలల్లో నాడు- నేడు పనుల బాధ్యత ప్రధానోపాధ్యాయులకు అప్పగించడం వలన వారు పాఠశాల అడకమిక్ కార్యక్రమాలపై దృష్టి పెట్టలేక పోయారు. నిత్యం అభివృద్ధి పనుల లెక్కలతోనే వారు కాలం గడపాల్సి రావడంతో పిరియడ్ల షెడ్యూల్, పరీక్షల నిర్వహణ తదితర పనులకు ఇబ్బంది పడ్డాం. నిత్యం ఏదో ఒక మీటింగ్ ఉందని జిల్లా కార్యాలయానికి వెళ్లాల్సి రావడంతో పాఠశాలలు అస్తవ్యస్తంగా మారాయి. దీంతో ఈ ఏడాది పలుపాఠశాలల్లో పదో తరగతి ఫలితాలపై కూడా ప్రభావం పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి: నారా రోహిత్
[ 07-05-2024]
ఏపీ ప్రజలంతా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి, రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేయాలని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. -
పోస్టల్ బ్యాలెట్లో తప్పిదం.. ఇద్దరు అధికారులపై చర్యలు
[ 07-05-2024]
పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్ బ్యాలెట్లో జరిగిన తప్పిదంపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
[ 07-05-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను, మరో ముగ్గురు నిందితులను గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. -
ఊపిరి నేనన్నావు.. ఉసురు పోసుకున్నావు!
[ 07-05-2024]
ఆర్బీకేల ద్వారా భరోసా ఇచ్చామని జగన్ అన్నారు.. ఆ మాటలే నిజమైతే ఇన్ని వందల మంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు.. మిగ్జాం తుపానుతో రైతులు కుదేలైతే పంటల పరిశీలన పేరిట వేదికలు పెట్టి పిక్నిక్ స్పాట్లా మార్చారు. -
జగన్ మార్కు ఇసుక దోపిడీ
[ 07-05-2024]
వైకాపా నేతలు బరితెగించి కృష్ణా తీరంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జీసీకేసీ కంపెనీకి కొన్ని రీచ్లలో ఇసుక తవ్వకాలకు అనుమతులను సాకుగా చూసి అడ్డగోలుగా తవ్వి తరలిస్తున్నారు. -
పోస్టల్ బ్యాలట్లో..ప్రలోభాల పర్వం..
[ 07-05-2024]
ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగించుకునే కేంద్రాల వద్దకు అధికార పార్టీ నేతల అనుచరులు వచ్చి ఉద్యోగులతో మాటలు కలిపి ప్రలోభాలకు తెరలేపారు. -
ఎస్సీ రైతులపై కపట ప్రేమ
[ 07-05-2024]
రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ కింద అసైన్డ్ భూములిచ్చిన ఎస్సీలకు మూడేళ్లుగా కౌలు ఎగ్గొట్టారు. ఇందుకు సీఐడీ విచారణ అంటూ వంక పెట్టారు. వారిని ఆర్థికంగా చితికిపోయేలా చేశారు. -
‘వైకాపాకు వేసే ఓటు మురిగిపోయినట్లే’
[ 07-05-2024]
ఎన్నికల్లో వైకాపాకు వేసే ప్రతి ఓటు మురిగిపోయినట్లేనని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తాడికొండ మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్తో కలసి సోమవారం ఉదయం ఆయన రోడ్షో నిర్వహించారు. -
గుంటూరు తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి, కార్యకర్తలపై వైకాపా దాడి
[ 07-05-2024]
గుంటూరు తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్వలి సహా ఆ పార్టీ కార్యకర్తలపై వైకాపా మూకలు దాడి చేశాయి. సోమవారం మస్తాన్వలి కార్యకర్తలతో కలిసి 50వ డివిజన్లోని శారదాకాలనీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. -
‘జగన్కు ఒకసారి ఓటేస్తేనే పదేళ్లు వెనుకబడ్డాం’
[ 07-05-2024]
మండలంలోని పిడపర్రు, పిడపర్తిపాలెం, మున్నంగి గ్రామాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్డర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్నతో కలిసి సోమవారం పర్యటించారు. -
గడప గడపకు కిలాడి మాటలు
[ 07-05-2024]
భూమి పూజకు పరిమితం.. పాత పొన్నూరు ఇందిరాకాలనీలో రెండేళ్ల కిందట ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పర్యటించగా.. మురుగుకాలువ నిర్మాణ పనులు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. -
పోరాట బాట.. గెలుపు బాసట
[ 07-05-2024]
చీరాలలో ఓ పెద్దాయనను గెలిపిస్తే.. పార్టీ మారి నమ్మక ద్రోహం చేశారు.. జిల్లా నుంచి తెదేపా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్ ఈ అయిదేళ్లలో ఎన్నో కష్టాలు పడ్డారు.. -
నోటికాడ ‘అన్నం’ లాగేసిన జగన్
[ 07-05-2024]
పేదలు కడుపు నిండా అన్నం తిన్నా జగన్కు రుచించదు.అందుకే వారి నోటికాడ ముద్ద తీసి పొట్టపై కొట్టాడు. అర్ధాకలితో అలమటించేలా చేశాడు. తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను మూతపడేలా చేశాడు. -
వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి బరితెగింపు
[ 07-05-2024]
నరసరావుపేటలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో రెండోరోజు వైకాపా నేతల ఆరాచకం రాజ్యమేలింది. వైకాపా మూకల అఘాయిత్యాలకు హద్దే లేకుండా పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!