ఇక ఓపీ సేవలు సులభం
జనరల్ ఆసుపత్రిలో బాధితుల తాకిడి ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. వైద్యులను సంప్రదించడం పక్కన పెడితే ఓపీ చీటీ పొందాలంటేనే గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి.
అందుబాటులోకి ప్రత్యేక యాప్
మంచిర్యాల సిటీ, న్యూస్టుడే: జనరల్ ఆసుపత్రిలో బాధితుల తాకిడి ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. వైద్యులను సంప్రదించడం పక్కన పెడితే ఓపీ చీటీ పొందాలంటేనే గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి. దీంతో ఓపీ సేవలు కొనసాగే సగం సమయం దీనికే సరిపోతుంది. ఇక వైద్యులు చూసి ఏవైనా పరీక్షలు రాస్తే అంతే సంగతులు. ఈ భారీ వరుసల నుంచి బాధితులకు ఉపశమనం కలిగించేలా, వారి ఇబ్బందులను అధిగమించేలా ప్రత్యేక యాప్(ఏబీహెచ్ఏ) అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ డౌన్లోడ్తో ఓపీ చీటీని సులభంగా క్షణాల్లో పొందవచ్చు. ప్రస్తుతం ప్రతి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జీజీహెచ్లోనూ మొదలుకాగా బాధితులకు అవగాహన లేక ఇంకా వరుస కడుతూనే ఉన్నారు. స్మార్ట్ఫోన్ ఉన్న బాధితులందరికి ఈ యాప్ సేవలు చేరువ చేసేలా పర్యవేక్షకులు సిబ్బందిని కేటాయించారు. యాప్ గురించి వివరించడంతోపాటు వారి అనుమతి మేరకు దగ్గరుండి డౌన్లోడ్ చేయిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ సేవలు వినియోగించుకునేందుకు పలువురు సిద్ధం అవుతుండగా మరింత విస్తృతం చేసేందుకు ఓపీ నమోదు కౌంటర్ల వద్ద సిబ్బందిని అందుబాటులో ఉంచి అవగాహన పెంచుతున్నారు. వివిధ సమస్యలరీత్యా ఆసుపత్రికి వచ్చే బాధితులు ఈ యాప్ సేవలతో ఉపశమనం పొందవచ్చు.
ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
చరవాణిలోని ప్లేస్టోర్కు వెళ్లి ఏబీహెచ్ఏ(ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) టైప్ చేయండి. నేషనల్ హెల్త్ అథారిటీతో కూడిన యాప్ కనిపిస్తుంది. ఇన్స్టాల్ చేసిన అనంతరం ఆసుపత్రిలోని ఓపీ నమోదు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోని క్యూఆర్ కోడ్ను డౌన్లోడ్ చేసుకుని యాప్ ద్వారా స్కాన్ చేయాలి. సంబంధిత బాధితుల సమాచారం(ఆధార్కార్డు, చరవాణి సంఖ్య) నమోదు కాగానే ఆ వివరాలన్నీ ఓపీ నమోదు కౌంటర్కు చేరుతాయి. వెంటనే టోకెన్ నంబర్ వస్తుంది. ఆ సంఖ్యను అబా కౌంటర్లోని సిబ్బందికి తెలపగానే ఏ వైద్యుడిని కలవాలో అడిగి ఆయా గది నంబరుతో కూడిన ఓపీ చీటీ అందజేస్తారు. ఆ తర్వాత మరోసారి ఆసుపత్రికి వచ్చినా అక్కడి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే టోకెన్ నంబరు సులువుగా పొంది సమయం ఆదా చేసుకోవచ్చు.
- ఇది మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పరిస్థితి. ఓపీ నమోదు గదిలో బాధితులు ఇలా బారులు తీరుతున్నారు. వరుస క్రమంలో గంటలకొద్ది నిలబడుతున్నారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన అబా(ఏబీహెచ్ఏ) యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఈ ఇబ్బందులను అధిగమించవచ్చు. ఆసుపత్రికి వచ్చిన ప్రతీసారి వరుసలో నిలబడే అవసరం ఉండదు. నిమిషం వ్యవధిలో ఓపీ చీటీ పొందవచ్చు.
- అబా(ఏబీహెచ్ఏ) యాప్పై అవగాహన పెంచేందుకు, మంచిర్యాల జీజీహెచ్లోనూ ఈ తరహా విధానాన్ని విస్తృతం చేసేందుకు ఓపీ నమోదు వద్ద ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. బాధితులకు ఇలా దగ్గరుండి వివరిస్తున్నారు. స్వయంగా చరవాణిలో యాప్ను డౌన్లోడ్ చేయిస్తున్నారు. ఎలా వినియోగించాలో తెలియజేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ కార్యక్రమం చేపడుతుండగా చాలా మంది బాధితులు ఆసక్తి చూపిస్తున్నారని, సమయం ఆదా చేసుకుంటూ ఉపశమనం పొందుతున్నారని సిబ్బంది చెబుతున్నారు.
- ఇది అబా యాప్కు సంబంధించిన సూచనలు, డౌన్లోడ్, పని చేసే విధానాన్ని తెలియజేసే సూచిక. దీన్ని ఫ్లెక్సీ రూపంలో జీజీహెచ్లో అందుబాటులో ఉంచారు. ఆసుపత్రికి వచ్చే బాధితులు దీని ఆధారంగా యాప్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వివరాల నమోదుతో టోకెన్ పొందవచ్చు. అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక అబా టోకెన్ కౌంటర్లో తెలిపి ఓపీ చీటీని సులభంగా తీసుకోవచ్చు.
ఇది ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఇటీవల ఏర్పాటు చేసిన అబా టోకెన్ కౌంటర్. అక్కడే క్యూఆర్ కోడ్తో కూడిన ఫ్లెక్సీని అందుబాటులో ఉంచగా బాధితులు ఇలా వచ్చి స్కాన్ చేసుకుని టోకెన్ నంబరును పొందుతున్నారు. ఆ పక్కనే ఉన్న సంబంధిత కౌంటర్లో తెలిపి ఓపీ చీటీ సులువుగా స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సేవలు మంచిర్యాలలోని జీజీహెచ్లోనూ మొదలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరదతో పొంచి ఉన్న ముప్పు
[ 01-06-2024]
వర్షాకాలంలో లోతట్టు కాలనీవాసుల కష్టాలు వర్ణనాతీతం. వరద నీరు ఇళ్లను ముంచితే బంధువుల ఇంటికో లేక బల్దియా యంత్రాంగం ఏర్పాటు చేసిన తాత్కాలిక పునరావాస కేంద్రానికో వెళ్లాల్సిన పరిస్థితి. -
రోడ్డు కాదు పెనం.. జంకుతున్న జనం
[ 01-06-2024]
ఉమ్మడి జిల్లాపై భానుడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నాడు. రోహిణి కార్తెలో రోకళ్లు పగులుతాయన్న సామెతను నిజం చేస్తూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జిల్లా వాసులు బెంబేలెత్తుతున్నారు. -
జన చేతనం.. జయ కేతనం
[ 01-06-2024]
చిన్నా పెద్దా తేడాలేదు. మహిళలు, పురుషులంటూ లింగభేదం లేదు. ఆటలాడే చిన్నారి నుంచి పండు ముసలి వరకు ఒకటే నినాదం.. జై తెలంగాణ. స్వరాష్ట్ర సాధన కోసం ప్రతి ఒక్కరుముందుకు కదిలి పిడికిలి బిగించి ముందుకు సాగిన ఆ రోజులు ఎటుచూసినా ఆందోళనలతో అట్టుడికింది. -
సంపూర్ణ పోషణ.. పాలతో సాధ్యం
[ 01-06-2024]
పంటలతో పాటు పాడి పెంపకంపై రైతులు దృష్టి సారిస్తే.. అదనపు ఆదాయం సమకూరడంతో పాటు పిల్లలకు పోషకాలు అందించేందుకు అవకాశం ఉంది. పాడి పోషణ రైతులకు భారం అవుతుండటంతో చాలా మంది రైతులు వాటికి దూరమవుతున్నారు. -
బాసర అమ్మవారి సన్నిధిలో అందెశ్రీ
[ 01-06-2024]
బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారిని ప్రముఖ గేయ రచయిత అందెశ్రీ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వేదపండితులు, అర్చకులు స్వాగతం పలికారు. -
ప్రారంభించకుండానే శిథిలం
[ 01-06-2024]
పేదల కోసం రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నా లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో ప్రారంభించకముందే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన పనులు ఎవరికీ అక్కరకు రాకుండా నిరుపయోగంగా మారుతున్నాయి. -
నిర్వహణ భారం.. నీరుగారుతున్న లక్ష్యం
[ 01-06-2024]
వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో అన్నదాతలు సమావేశమై పంటల సాగు, సమస్యలపై వ్యవసాయ అధికారులతో చర్చించేందుకు గత ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటి నిర్వహణ, పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారింది. -
ఇంటర్ ఇక్కట్లు
[ 01-06-2024]
పదో తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులు కెరీర్పై దృష్టి సారించి ముందుకు సాగుతుంటారు. జూనియర్ కళాశాలలు అందుబాటులో ఉంటే ఆయా కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. -
కనిపించని ‘పొనికి’ ఉనికి
[ 01-06-2024]
పొనికి కర్ర అరుదైనది. అలంకరణ వస్తువులతోపాటు అందమైన బొమ్మలు, ఇతర కళాకృతుల తయారీకి దీన్ని విరివిగా వినియోగిస్తారు. నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమ దీనిపైనే ఆధారపడి కొనసాగుతోంది. స్థానికంగా కర్ర లభించక పరిశ్రమ నిర్వాహకులు ఇతరప్రాంతాల నుంచి తెప్పించుకుంటున్నారు. -
పారదర్శకత కోసం పొదుపు పద్దు పరిశీలన
[ 01-06-2024]
స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీలో పారదర్శకత పాటించేందుకు పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అవసరమైన చర్యలు తీసుకుంటోంది. మహిళా సాధికారతకు వినియోగించే ప్రతి పైసాకు లెక్క చూపేలా కార్యాచరణ చేపట్టింది. -
పట్టణ చెరువుల పరిరక్షణకు అడుగులు
[ 01-06-2024]
పట్ణణాల్లో జల వనరులు ఆక్రమణకు గురవుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటితోపాటు ఇతర అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెరువులు కబ్జా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పురపాలికల్లో చెరువులు, కుంటల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. -
గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
[ 01-06-2024]
జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం స్థానికంగా ఆందోళనకు దారితీసింది. స్థానిక చున్నంబట్టివాడకు చెందిన ఓ భూవివాదం కేసులో దాసరి నరేష్ అనే వ్యక్తి ఈనెల 19న తాడూరి పోశం, తూము మోహన్లపై ఫిర్యాదు చేశారు. -
శునకం.. చూపిస్తుంది నరకం
[ 01-06-2024]
శునకాల దాడులు జిల్లాలో తీవ్రమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏదో ఒక చోట వీటి దాడులతో గాయపడుతున్న వారు పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు. నిత్యం సర్కారు ఆసుపత్రి బాట పడుతున్నారు. -
అమ్మమ్మ ఇంటికొచ్చి.. అరగంటలో దోచేసి
[ 01-06-2024]
వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికొచ్చింది.. వారింట్లో ఉన్న బంగారం, నగదుపై ఆమె కన్నేసింది. ఎలాగైనా కాజేయాలని పథకం పన్ని తన ప్రియుడిని రప్పించింది. ఇంటిలో ఎవరూ లేని సమయంలో అరగంటలో బంగారం, వెండి, నగదు కాజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు: జీహెచ్ఎంసీ కమిషనర్
-
తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర.. ₹లక్ష దిగువకు విమాన ఇంధనం
-
ఈవీఎంలను చెరువులోకి విసిరి..బాంబులతో దాడి చేసి..ఎన్నికల వేళ కలకలం
-
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా హాజరుకాకపోవచ్చు : కాంగ్రెస్ వర్గాలు
-
ధోనీ స్క్వాడ్ అలా.. రోహిత్ సేన ఇలా..
-
పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉంది.. సుప్రీంను ఆశ్రయించిన బాధితుడు