‘బోరు’మనిపించావ్ జగన్
తెదేపా హయాంలో అమలుచేసిన ఎన్టీఆర్ జలసిరి పథకానికి వైకాపా ప్రభుత్వం పేరు మార్చి వైఎస్ఆర్ జలకళ అని పెట్టింది. దీనికింద ఉమ్మడి జిల్లాలో 20 వేల బోర్లు తీస్తామని ప్రకటించారు. నియోజకవర్గానికి ఒక రిగ్గు కేటాయిస్తున్నామంటూ సీఎం జగన్ హడావుడి చేశారు.
జలకళకు గ్రహణం
అన్నదాతకు మిగిలింది ఎదురుచూపులే..
ఈనాడు, అనకాపల్లి, న్యూస్టుడే, నక్కపల్లి
తెదేపా హయాంలో అమలుచేసిన ఎన్టీఆర్ జలసిరి పథకానికి వైకాపా ప్రభుత్వం పేరు మార్చి వైఎస్ఆర్ జలకళ అని పెట్టింది. దీనికింద ఉమ్మడి జిల్లాలో 20 వేల బోర్లు తీస్తామని ప్రకటించారు. నియోజకవర్గానికి ఒక రిగ్గు కేటాయిస్తున్నామంటూ సీఎం జగన్ హడావుడి చేశారు. ఈ అయిదేళ్లలో తవ్వినవి కేవలం 397 బోర్లు మాత్రమే.
‘అన్నదాతలకు అండగా ఉంటాం. రైతు పొలంలో బోరు తీసి విద్యుత్తు కనెక్షన్ ఇచ్చి, వ్యవసాయ మోటార్ ఉచితంగా అందిస్తామని’ పథకం ప్రారంభ సమయంలో జగన్ గొప్పగా చెప్పుకొచ్చి ఆచరణలో పాతాళానికి తొక్కేశారు.
నాడు
సాగు చేస్తున్న తోటను చూపుతున్న రైతు సన్యాసిరావు
ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి పేరు జి.సన్యాసిరావు, ఎన్.నర్సాపురం గ్రామం. తెదేపా హయాంలో జలసిరి ద్వారా వేసిన సోలార్ మోటారుతో నీటిని వాడుకుని చక్కగా సాగుచేస్తున్నాడు. ఈ నీటి ఆధారంగా వేసిన కొబ్బరి, జీడి తోట కాపు దశకు చేరుకుంది. అంతరపంటగా గడ్డి పెంచడంతోపాటు కూరగాయలు వేసి ఆదాయం పొందుతున్నారు. ఒకట్రెండు మరమ్మతులు వచ్చినా, సంబంధిత సిబ్బంది వచ్చి బాగు చేశారని సన్యాసిరావు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
నేడు
ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి పేరు పోతంశెట్టి వీరబాబు. కాగిత గ్రామం. వైకాపా పాలనలో ఏడాదిన్నర కిందట బోరు వేశారు. ఈ మధ్య కాలంలో విద్యుత్తు సరఫరా ఇచ్చారు. గ్రామంలో సుమారు 12 బోర్లు వేయగా, ఇందులో ఇటీవల నలుగురికి మోటార్లు ఇచ్చారు. ఇందులో ఆయనకు రాలేదు. దీంతో సొంతంగా మోటారు తెచ్చి వేసుకుని వాడుతున్నారు. ఉచిత మోటార్లు ఎప్పుడు వస్తాయో తెలియడంలేదంటున్నారు వీరబాబు.
జలకళ కింద ఉమ్మడి జిల్లాలో 14,994 మంది దరఖాస్తు చేశారు. వాటన్నింటిని పరిశీలించి కేవలం 1,654 రైతులకే మొదట బోర్లు తీయడానికి అనుమతి ఇచ్చారు. అందులో కూడా ఈ అయిదేళ్లలో 397 చోట్ల మాత్రమే బోర్లు తవ్వారు. మిగతా దరఖాస్తులన్నీ బుట్టదాఖలు చేశారు.
బోర్లు తీసే రిగ్గు గుత్తేదారులకు ప్రభుత్వం రూ. కోట్లలో బకాయిలు పెట్టేసింది. వారంతా బిల్లులిచ్చిన తర్వాతే బోర్లు తీస్తామని ఆగిపోయారు. బోర్లు తీసిన రైతులకు విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వలేదు.. కనెక్షన్ ఇచ్చినా పంప్సెట్లు అందించలేదు. ఉమ్మడి జిల్లాలో ఒక్క రైతుకు కూడా చుక్కనీటిని అందించకుండా ఈ పథకాన్ని పూర్తిగా నీరుగార్చేశారు.
ఆనాటి జల‘సిరులు’..
తెదేపా ప్రభుత్వం హయాంలో ఎన్టీఆర్ జలసిరి పథకంలో బోరు తీసి, మోటారు, సోలార్ ప్యానల్ అమర్చడానికి రూ. 6 లక్షలు ఖర్చయ్యేది. అందులో రైతుల వాటాగా ఎస్సీ, ఎస్టీల నుంచి కేవలం రూ. 6 వేలు వసూలు చేశారు. ఇతర సామాజిక వర్గాల రైతుల నుంచి రూ.49 వేలు తీసుకుని మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే రాయితీగా సమకూర్చేది. ఈ పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో 1,076 మంది రైతులు లబ్ధిపొందారు. జగన్ సర్కారు మొదట్లో అన్నీ ఉచితమని, తీరా రిగ్గులు వేసిన తర్వాత విద్యుత్తు కనెక్షన్ డబ్బులు రైతులే చెల్లించాలంటూ మాటమార్చేసింది. చివరకు అందరికీ అన్యాయం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జననేతనన్నావు.. జలమేదీ జగన్?
[ 04-05-2024]
బటన్లు నొక్కే జగన్కు జనాల బాధలు పట్టడం లేదు. ఈ అయిదేళ్లలో తాగునీటి పథకాలకు పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకోవాలని చూశారు తప్ప ప్రజల గొంతు తడిపే ప్రయత్నమే చేయలేదు. వైకాపా పాలనలో గ్రామాల్లో కొత్తగా నీళ్ల కుండీలను నిర్మించిందీ లేదు. -
జగన్ను ఇంటికి పంపితేనే మన్యం అభివృద్ధి
[ 04-05-2024]
అధ్వాన పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి ఎద్దేవా చేశారు. -
జగనన్న కక్ష.. అవ్వాతాతలకు శిక్ష
[ 04-05-2024]
పింఛను సొమ్ము సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేసే అవకాశం ఉన్నా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులను బలిపశువులను చేసింది. -
వైకాపా పతనం ఖాయం
[ 04-05-2024]
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు తథ్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి దొన్నుదొర పేర్కొన్నారు. -
వైకాపా వాహనం స్వాధీనం
[ 04-05-2024]
అనుమతులు లేకుండా వైకాపా ప్రచార సామగ్రి తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎంపీడీవో, ఎన్నికల అధికారి వెంకటరావు తెలిపారు. -
తెదేపాలో భారీగా చేరికలు
[ 04-05-2024]
దామనాపల్లి, సంకాడ పంచాయతీల నుంచి వైకాపా, సీపీఎంలకు చెందిన కార్యకర్తలు భారీగా తెదేపాలోకి చేరారు. మాడెం, బంధవీధి, దొడ్డికొండరెల్లివీధి, చిన్నజడుమూరు గ్రామాలనుంచి సుమారు 200 మంది పాడేరు కూటమి అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
ఉద్యోగాలిప్పిస్తామని టోకరా
[ 04-05-2024]
ఉద్యోగాలిప్పిస్తామని గిరిజన యువతను ఇద్దరు మహిళలు మోసం చేశారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. -
పేదల పొట్టకొట్టిన జగమొండి
[ 04-05-2024]
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు. -
‘జగన్కు ఒక్క అవకాశమిచ్చి అందరం మోసపోయాం’
[ 04-05-2024]
‘గత ఎన్నికల్లో జగన్ ఒక్క అవకాశం అని అడిగితే ఇచ్చి అందరం మోసపోయాం. ఈ ఐదేళ్లలో అభివృద్ధి లేదు. సంక్షేమంలో ఆశ్రిత పక్షపాతం పెరిగిపోయింది. -
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
[ 04-05-2024]
ఎలమంచిలిలోని దిమిలిరోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించనున్న నందమూరి బాలకృష్ణ సభకు తెదేపా నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కూడలిని జెండాలతో అందంగా తయారు చేశారు. -
కాంగ్రెస్తోనే ప్రత్యేక హోదా
[ 04-05-2024]
కాంగ్రెస్ గెలుపుతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని ఆ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సతక బుల్లిబాబు అన్నారు. మంప, రేవళ్లు పంచాయతీల్లోని గ్రామాల్లో శుక్రవారం సీపీఐ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. -
జగనన్నా.. ఏమిటీ పింఛన్ వెతలు..
[ 04-05-2024]
పింఛన్లకోసం బ్యాంకులకు వచ్చిన వృద్ధులకు రెండో రోజు కష్టాలు తప్పలేదు. వీఆర్పురం మండలం రేఖపల్లిలో బ్యాంకు వద్ద రేఖపల్లి, జీడిగుప్పల పీహెచ్సీల వైద్యులు శిబిరం ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..