ఎన్నికల సిబ్బంది పొరపాటు.. పీవోకి గ్రహపాటు
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మచిలీపట్నంలోని ఎన్నికల సామగ్రి స్వీకరణ(రిసీవింగ్) సిబ్బంది చేసిన పొరపాటుకు ఓ ఉపాధ్యాయుడి కుడి చేయి విరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుడివాడ పట్టణానికి చెందిన షేక్.ఇబ్రహీం బేతవోలులోని ఎస్జీవీఎస్జీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు.
చేయి విరిగిన షేక్ ఇబ్రహీం
గుడివాడ గ్రామీణం, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మచిలీపట్నంలోని ఎన్నికల సామగ్రి స్వీకరణ(రిసీవింగ్) సిబ్బంది చేసిన పొరపాటుకు ఓ ఉపాధ్యాయుడి కుడి చేయి విరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుడివాడ పట్టణానికి చెందిన షేక్.ఇబ్రహీం బేతవోలులోని ఎస్జీవీఎస్జీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా అతనికి అవనిగడ్డలో పీవోగా నియమించారు. ఎన్నికల విధులు పూర్తి చేసుకున్న తర్వాత మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో సామగ్రి మొత్తం అప్పగించి అధికారులు చెప్పిన తర్వాతే బస్సులో మంగళవారం తెల్లవారుజామున గుడివాడ చేరుకున్నారు. ఇంతలోగా మీరు అప్పగించిన సామగ్రిలో ఒక కవర్ కనిపించడం లేదని.. వెంటనే రావాలని ఎన్నికల సామగ్రి స్వీకరణ సిబ్బంది నుంచి ఇబ్రహీంకు ఫోన్ వచ్చింది. దీంతో కంగారుగా ఇబ్రహీం తన ద్విచక్రవాహనంపై తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో వెళ్లగా సామగ్రి మొత్తం అందినట్లు ఆర్వో చెప్పారని, పొరబడి ఫోన్ చేశామని సిబ్బంది స్పష్టం చేశారు. దేవుడా కనికరించావనుకొని అప్పటికే మూడు రోజులపాటు విశ్రాంతి లేకుండా ఇంటికి బయలుదేరిన ఇబ్రహీం గుడివాడ వస్తుండగా గుడ్లవల్లేరు మండలం వేమవరం వద్ద అతని వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న పంట బోదెలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అతని కుడి మోచేయి-భుజానికి మధ్యలో విరిగిపోయి ముక్కలైంది. వెంటనే స్థానికులు అతని భార్యకు ఫోన్ చేయగా బంధువులతోపాటు ఆమె వచ్చి గుడివాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఇబ్రహీం చేతికి వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్లేట్లు వేశారు. సుమారు రూ.లక్ష ఖర్చయ్యింది. శిరస్త్రాణం ధరించడం వల్లే నా భర్త బతికారని.. కవరు దొరికిన వెంటనే ఎన్నికల సిబ్బంది ఫోన్ చేసుంటే ప్రమాదం జరిగేది కాదని ఇబ్రహీం భార్య జరీనా ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అవనిగడ్డ ఎన్నికల అధికారి జి.బాలసుబ్రమణ్యంకు ఇబ్రహీం బంధువులు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. ఎన్నికల విధుల్లో ప్రమాదానికి గురైనందున నిబంధనల ప్రకారం షేక్ ఇబ్రహీంకు నష్ట పరిహారం అందించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.చంద్రశేఖర్ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నవ్యాంధ్రకు చంద్రుడు.. నవచరితకు ఆద్యుడు
[ 13-06-2024]
‘‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను...’’ మాట ప్రతిధ్వనించిన అద్భుత ఘడియలవి. లక్షలాది గొంతుకల జయజయధ్వానాలు.. నవ్యాంధ్ర సారథికి మది మదినా నీరాజనాలు.. ప్రతి ఆంధ్రుడు ఎదురుచూసిన మధుర క్షణాలు... -
అభిమాన చంద్రమా.. అనురాగ సంద్రమా
[ 13-06-2024]
చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. గన్నవరం సమీపంలో కేసరపల్లి ఐటీపార్కు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. -
ఆనందమానందమాయె.. మది ఆశల సంబరమాయె..
[ 13-06-2024]
అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంలో రాజధాని రైతులు, మహిళలు ఆనందంతో పరవశించిపోయారు. -
కృష్ణా జిల్లాకు ఒకే ఒక్కరు..!
[ 13-06-2024]
కృష్ణా జిల్లా నుంచి ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ఒకే ఒక్కరు మంత్రిగా నియమితులయ్యారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి ఈసారి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. పలువురు తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలకు నిరుత్సాహాన్నే మిగిల్చారు. -
ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో సీఎంగా జగనే
[ 13-06-2024]
నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి. మొదటి రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాష్ గతంలో చెప్పారు. -
సముద్రంలో మునిగి తాడిగడప మహిళ మృతి
[ 13-06-2024]
కర్ణాటకలోని మంగుళూరు బీచ్లో సముద్రంలో మునిగి కృష్ణా జిల్లా తాడిగడపకు చెందిన పరిమి లక్ష్మీప్రసన్న భార్య రత్నకుమారి(57) ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని మంగళవారం గ్రామానికి తీసుకురావడంతో విషాదం నెలకొంది. -
కేంద్ర మంత్రి దృష్టికి రైల్వే ఉద్యోగుల సమస్యలు
[ 13-06-2024]
విజయవాడ వచ్చిన కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి రామ్దాస్ అథవాలేను ఆలిండియా రైల్వే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం జోనల్ ప్రధాన కార్యదర్శి గూటాల పాపారావు ఆధ్వర్యంలో సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
అదుపు తప్పిన బ్రాహ్మణి ఎస్కార్ట్ వాహనం
[ 13-06-2024]
కేసరపల్లిలో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు వెళ్తున్న నారా బ్రాహ్మణి ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. -
గోదావరిలో ఈవోపీఆర్డీ మృతదేహం
[ 13-06-2024]
కృష్ణా జిల్లాకు చెందిన ఈవోపీఆర్డీ మృతదేహం రాజమహేంద్రవరంలోని గోదావరిలో లభ్యమైంది. ఒకటో పట్టణ సీఐ పుల్లారావు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని గోదావరి బండ్ రోడ్డు వద్ద పిండాల రేవులో బుధవారం ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు చెప్పారు. -
అభిమాన తరంగం!
[ 13-06-2024]
రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరే కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు కేసరపల్లికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తెదేపా, జనసేన, భాజపాలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా వచ్చారు. -
విమానాశ్రయంలో ప్రముఖుల సందడి
[ 13-06-2024]
సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసే రాజకీయ ప్రముఖులతో మంగళవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సందడి నెలకొంది. తొమ్మిది ప్రత్యేక విమానాల్లో ప్రధాని మోదీ సహా ఇతర ప్రముఖులు దిల్లీ, ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్ శర్మది, నాది ఒకే స్కూల్: అమెరికా క్రికెటర్
-
రూ.15లక్షలకు ఒప్పందం.. 3లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీసీఎస్ ఇన్స్పెక్టర్
-
అమెరికా విద్యార్థి వీసా ప్రక్రియ షురూ.. గతేడాది కంటే ఎక్కువ!
-
దివంగత రామోజీరావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
సిమెంట్ వ్యాపారంలో అదానీ దూకుడు.. అంబుజా చేతికి పెన్నా సిమెంట్